AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మా షాపులో ముస్లింలు పని చేయరు!

దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరగడానికి ఢిల్లీలో జరిగిన తబ్లీఘీ జమాత్ కార్యక్రమం ఓ కారణమని అందరికీ తెలిసిందే. ఈ సమావేశానికి వివిధ రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో ముస్లింలు హాజరయ్యారు. ఈ నేపధ్యంలోనే ముస్లింలు నిర్వహించే షాపుల్లో వస్తువులు కొనేందుకు దేశవ్యాప్తంగా పలువురు జనాలు ఇప్పటికీ భయపడుతున్నారు. ఈ క్రమంలోనే తన షాపు నడవాలంటే.. తన దగ్గర ముస్లింలు ఎవరూ పని చేయట్లేదంటూ చెన్నైలోని టీనగర్‌కు చెందిన ఓ బేకరీ యజమాని ముస్లింలను కించపరిచేలా ఓ […]

మా షాపులో ముస్లింలు పని చేయరు!
Ravi Kiran
|

Updated on: May 10, 2020 | 4:10 PM

Share

దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరగడానికి ఢిల్లీలో జరిగిన తబ్లీఘీ జమాత్ కార్యక్రమం ఓ కారణమని అందరికీ తెలిసిందే. ఈ సమావేశానికి వివిధ రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో ముస్లింలు హాజరయ్యారు. ఈ నేపధ్యంలోనే ముస్లింలు నిర్వహించే షాపుల్లో వస్తువులు కొనేందుకు దేశవ్యాప్తంగా పలువురు జనాలు ఇప్పటికీ భయపడుతున్నారు.

ఈ క్రమంలోనే తన షాపు నడవాలంటే.. తన దగ్గర ముస్లింలు ఎవరూ పని చేయట్లేదంటూ చెన్నైలోని టీనగర్‌కు చెందిన ఓ బేకరీ యజమాని ముస్లింలను కించపరిచేలా ఓ ప్రకటనను రూపొందించాడు. తమ షాపులో ముస్లింలు ఎవరూ పని చేయరని.. జైన్ మతస్తులు మాత్రమే స్వీట్లను తయారు చేస్తారంటూ సదరు యజమాని ఒక అడ్వర్టైజ్‌మెంట్‌ను రూపొందించి వాట్సప్‌ ద్వారా వినియోగదారులకు షేర్‌ చేశాడు. అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయింది. అలా ఈ విషయం పోలీసుల వరకు చేరడంతో వారు సదరు షాపు యజమానిని అదుపులోకి తీసుకుని అతనిపై సెక్షన్ 153, 153ఏ, 505, 295ఏ కింద కేసులు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

Read More:

నార్త్ కొరియాలో మరోసారి కలకలం.. కిమ్‌కు ప్రాణ సంకటం.!

ఇకపై పెళ్లిళ్లు చేసుకోవాలంటే.. దరఖాస్తు చేసుకోవాల్సిందే!

కేంద్రం కీలక నిర్ణయం.. ఇకపై పరీక్షలు లేకుండానే డిశ్చార్జ్!

గుడ్ న్యూస్.. పాత హాల్ టికెట్లతోనే టెన్త్ పరీక్షలు…

ఫ్లాష్ న్యూస్: ఏపీలో కొత్తగా 50 కరోనా కేసులు..

జూన్‌లో ప్రజా రవాణాకు గ్రీన్ సిగ్నల్ పడేనా.!

తెలంగాణలోని ఆ గ్రీన్ జోన్‌లో నలుగురికి కరోనా..