ఇక స్కూళ్లు 100 రోజులు మాత్రమే.. విద్యాశాఖలో కీలక మార్పులు!

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి కారణంగా అనేక రంగాలు సంక్షోభాన్ని ఎదుర్కుంటున్నాయి. ముఖ్యంగా ఈ వైరస్ వృద్దులు, పిల్లలపైనే ఎక్కువ ప్రభావం చూపుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరించడంతో కేంద్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. నూతన విద్యా సంవత్సరంలో అనేక మార్పులు తీసుకురావాలని యోచిస్తోంది. ఇందులో భాగంగానే సరికొత్త ప్రణాళికలను రచిస్తోంది. దీనితో గతంలో మాదిరిగానే పిల్లలు బడులకు 220 రోజులు వెళ్ళకపోవచ్చునని విద్యావేత్తలు అంటున్నారు. ఇక మీదట పిల్లలు బడికి 100 […]

ఇక స్కూళ్లు 100 రోజులు మాత్రమే.. విద్యాశాఖలో కీలక మార్పులు!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 30, 2020 | 4:25 PM

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి కారణంగా అనేక రంగాలు సంక్షోభాన్ని ఎదుర్కుంటున్నాయి. ముఖ్యంగా ఈ వైరస్ వృద్దులు, పిల్లలపైనే ఎక్కువ ప్రభావం చూపుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరించడంతో కేంద్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. నూతన విద్యా సంవత్సరంలో అనేక మార్పులు తీసుకురావాలని యోచిస్తోంది. ఇందులో భాగంగానే సరికొత్త ప్రణాళికలను రచిస్తోంది.

దీనితో గతంలో మాదిరిగానే పిల్లలు బడులకు 220 రోజులు వెళ్ళకపోవచ్చునని విద్యావేత్తలు అంటున్నారు. ఇక మీదట పిల్లలు బడికి 100 రోజులు వెళ్లే అవకాశాలు ఉంటాయని.. మరో 100 రోజులు ఇంటి నుంచే ఆన్లైన్ ద్వారా విద్యను అభ్యసించే విధంగా ప్రణాళికను కేంద్ర ప్రభుత్వం సిద్దం చేస్తున్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. మరో 20 రోజుల పాటు విద్యార్ధులలో మానసిక వికాసాన్ని పెంచేలా డాక్టర్లు, కౌన్సిలర్స్‌తో కార్యక్రమాలు చేపట్టేలా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. కాగా, ఆన్లైన్ సౌకర్యం లేని విద్యార్ధులపై స్కూల్ యాజమాన్యాలు ప్రత్యేక దృష్టి పెట్టాలని హెచ్ఆర్డీ మంత్రిత్వ శాఖ సూచించింది.

Also Read: జగన్ సర్కార్ సంచలనం.. పీజీ వైద్య విద్య ఫీజులు భారీగా తగ్గింపు..

Latest Articles