AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బస్సుల్లో మారిన సీట్లు.. ఏపీఎస్‌ఆర్టీసీ‌లో కొత్త మోడల్

సూపర్ లగ్జరీ బస్సులను ఆర్టీసీ అధికారులు సమూలంగా మార్చాలని నిర్ణయించారు. దీని కోసం సీట్ల మధ్య దూరం పెంచారు. గతంలో మాదిరిగా కాకుండా.. మూడు వరుసలు ఏర్పాటు చేశారు. ఈ వరుసలో ఓకే సీటు ఉండేలా..

బస్సుల్లో మారిన సీట్లు.. ఏపీఎస్‌ఆర్టీసీ‌లో కొత్త మోడల్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 13, 2020 | 11:11 AM

Share

ఆంధప్రదేశ్‌లో ప్రస్తుతం ప్రజా రవాణాకు ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. కరోనా లాక్‌డౌన్ కారణంగా ఆర్థిక వ్యవస్థ మొత్తం స్తంభించిపోయింది. ఇప్పటికే తీవ్ర అప్పుల్లో కూరుకుపోయామని ఏపీ ప్రభుత్వం అంటోంది. దీంతో లాక్‌డౌన్ ముగిసిన తర్వాత బస్సులు నడిపేందుకు అవసరమైన కసరత్తులను ప్రారంభించింది ప్రభుత్వం. ఈమేరకు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారి కోసం ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు. ప్రయాణికుల మధ్య భౌతిక దూరం ఉండేలా బస్సుల్లో సీట్లను సర్దుబాటు చేశారు. దానికి సంబంధించిన ఒక మోడల్‌ ఫొటోను కూడా విడుదల చేశారు.

సూపర్ లగ్జరీ బస్సులను ఆర్టీసీ అధికారులు సమూలంగా మార్చాలని నిర్ణయించారు. దీని కోసం సీట్ల మధ్య దూరం పెంచారు. గతంలో మాదిరిగా కాకుండా.. మూడు వరుసలు ఏర్పాటు చేశారు. ఈ వరుసలో ఓకే సీటు ఉండేలా చూసుకున్నారు. దీని ద్వారా భౌతిక దూరం పాటించేందుకు వీలు ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. అలాగే ఈ మోడల్‌కు ప్రభుత్వం పచ్చ జెండా ఊపిన వెంటనే మిగిలిన వాటిని కూడా మార్చేసి సేవలను ప్రారంభించే అవకాశం ఉందట. కాగా గతంలో సూపర్ లగ్జరీ బస్సులో మొత్తం 36 సీట్లు ఉండగా.. ఇప్పుడు 10 తక్కువగా ఉంటాయి. దీంతో ఏపీ ఆర్టీసీపై కొంత నష్టాల భారం పడే ఛాన్స్ కూడా ఉంది. అయితే ఈ నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు.. ప్రభుత్వం ఛార్జీలు ఏమైనా పెంచే అవకాశం ఉంటుందా? అని అందరూ ప్రశ్నించుకుంటున్నారు. అలాగే బస్సుల్లో కూడా ప్రత్యేకంగా శానిటైజర్లు, మాస్కులు ఉండేలా చూస్తామంటున్నారు ఏపీఎస్ఆర్టీసీ అధికారులు.

Read More:

రెండో భార్యతో దిల్ రాజు ఫస్ట్ సెల్ఫీ.. వైరల్ అవుతున్న పిక్

మరో కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. టెన్త్ విద్యార్థులకు వాట్సాప్‌ లెసన్స్

పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం