లాక్డౌన్ చిట్కాలు చెప్పిన అను..
మనం ఆశతో జీవించాలి.. నిరాశకు గురి కాకుండా ముందుకు సాగాలి.. చిన్న చిన్న విషయాల్లోనూ ఆనందాన్ని వెతుక్కోవాలి... ఇవన్నీ చెప్పింది ఓ తత్వవేత్త...
మనం ఆశతో జీవించాలి.. నిరాశకు గురి కాకుండా ముందుకు సాగాలి.. చిన్న చిన్న విషయాల్లోనూ ఆనందాన్ని వెతుక్కోవాలి… ఇవన్నీ చెప్పింది ఓ తత్వవేత్త అనుకుంటే.. మీరు పొరపడినట్లే. ఈ ఫిలాసఫీని చెప్పింది టాలీవుడ్ ముద్దుగుమ్మ అనూ ఇమ్మాన్యుయేల్.
కరోనాతో ఇంటికే పరిమితమై పోయిన చాలా మంది డిప్రేషన్కు గురికాకుండా చిట్కాలను చెప్పింది. ఈ లాక్ డౌన్ సమయంలో ఎలా ఉండాలో.. ఎలా జీవించాలో చెప్పుకొచ్చింది. తాను ఎక్కువ సమయాన్ని పుస్తకాలు చదవడానికి కేటాయిస్తున్నానని చెప్పింది. షూటింగ్స్తో బిజీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదవడానికి కుదరదు. ఎన్ని పుస్తకాలు చదివితే అంత జ్ఞానం సంపాదించుకోవచ్చని తెలిపింది.
అంతే కాదు…మరెన్నో విషయాలను టచ్ చేసింది. “మనం చదివే ప్రతి పుస్తకంలోనూ ఓ కొత్త కథ ఉంటుంది… అవి చదువుతున్నప్పుడు ఆ కథల్లో ఉన్న పాత్రల ప్రపంచంలోకి మనం వెళతాం… అలా వేరే ప్రపంచంలోకి వెళ్లడం బాగుంటుంది.’’ అని అన్నారు.
అనూ ఇమ్మాన్యుయేల్.. తెలుగులో చాలా సక్సెస్ సినిమాల్లో నటించింది. అవి ‘మజ్ను’, ‘అజ్ఞాతవాసి’, ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’, ‘శైలజారెడ్డి అల్లుడు’ తదితర చిత్రాల్లో నటించి మెప్పించింది.