Ap Corona Cases: ఏపీలో తాజా కరోనా బులిటెన్ విడుదల.. ప్రమాదకరంగా వైరస్ వ్యాప్తి.. కొత్తగా ఎన్ని కేసులంటే..?

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి ప్రమాదకరంగా మారింది. కొత్తగా రాష్ట్రంలో  31325 శాంపిల్స్ టెస్ట్ చేయగా.. 997 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి.

Ap Corona Cases: ఏపీలో తాజా కరోనా బులిటెన్ విడుదల.. ప్రమాదకరంగా వైరస్ వ్యాప్తి.. కొత్తగా ఎన్ని కేసులంటే..?
AP-Corona
Follow us

|

Updated on: Mar 29, 2021 | 4:37 PM

Andhra Corona Updates: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి ప్రమాదకరంగా మారింది. కొత్తగా రాష్ట్రంలో  31325 శాంపిల్స్ టెస్ట్ చేయగా.. 997 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ సంఖ్య 8,96,917కు చేరింది. ఈ మహమ్మారి కారణంగా కొత్తగా ఐదుగురు ప్రాణాలు విడిచారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 7210కి చేరింది. తాజాగా 282 మంది వ్యాధి బారి నుంచి కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో వ్యాధిని జయించినవారి సంఖ్య 886498కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 6,104 యాక్టివ్ కేసులున్నాయి.

కరోనా కేసుల ఉధృతి పెరిగిన నేపథ్యంలో జాగ్రత్తలు పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మాస్క్ ధరించడం, భౌతికదూరం పాటించడం తప్పనిసరి అని చెబుతున్నారు. వైరస్‌ను లైట్ తీసుకోవద్దని, అది మరోసారి విజృంభిస్తే ప్రమాదకర పరిస్థితులు తప్పవని హెచ్చరిస్తున్నారు.

దేశంలో కూడా కరోనా కల్లోలం…

భారత్‌లో కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. కరోనా కేసులు తగ్గినట్లే తగ్గి మళ్లీ వేలల్లో పెరుగుతూనే ఉన్నాయి. దీనితో ప్రజల్లో ఒకింత ఆందోళన నెలకొంది. గడిచిన 24 గంటల్లో కరోనా కేసుల సంఖ్య 68 వేల మార్క్ దాటింది. గత సంవత్సరం అక్టోబర్ నుంచి ఇంత భారీగా ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి. దేశంలో నిన్న కొత్తగా 68,020 కేసులు నమోదయ్యాయి. అలాగే మహమ్మారి కారణంగా 291 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1,20,39,644 కరోనా కేసులు నమోదు కాగా.. 1,61,843 మంది ఈ వైరస్ కారణంగా మరణించారు.

Also Read: కిరాతకం.. రూ.720 గురించి మనిషిని దారుణంగా చంపారు.. నిందితులు ముగ్గురు విద్యాధికులు

ఏప్రిల్ 1న నగరంలో ప‌లుచోట్ల మంచినీటి స‌ర‌ఫ‌రాకు అంత‌రాయం.. పూర్తి వివరాలు