తమిళనాడులో కరోనా విలయ తాండవం..

తమిళనాడులో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు వేల సంఖ్యలో పెరుగుతున్నాయి. ఇప్పటికే 98 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు..

తమిళనాడులో కరోనా విలయ తాండవం..
Follow us

| Edited By:

Updated on: Jul 02, 2020 | 7:34 PM

తమిళనాడులో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు వేల సంఖ్యలో పెరుగుతున్నాయి. ఇప్పటికే 98 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక ఇలాగే కేసులు నమోదైతే మరో రెండు రోజుల్లోపే లక్ష మార్క్‌ను దాటుతుంది. తాజాగా గురువారం నాడు కొత్తగా మరో 4,343 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 98,392కి చేరింది. రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల్లో అత్యధికంగా చెన్నై నగరంలోనే నమోదవుతున్నాయి. ఇప్పటికే 62 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా గురువారం నాడు కొత్తగా మరో రెండు వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక ఇప్పటి వరకు కరోనా బారినపడి రాష్ట్రంలో వెయ్యి మందికి పైగానే మరణించారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికే లాక్‌డౌన్ విధించింన సంగతి తెలిసిందే.