Army Recruitment Rally Vishaka: విశాఖపట్నం ఆర్మీ రిక్రూట్మెంట్ కార్యాలయం పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో భాగంగా తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి,కృష్ణా, శ్రీకాకుళం,విశాఖపట్నం,విజయనగరం, యానాం(పుదుచ్చేరి)కు చెందిన ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీని ఆగస్టు 16 నుంచి 31 వరకు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో నోటిఫికేషన్కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..
* నోటిఫికేషన్లో భాగంగా సోల్జర్- జనరల్ డ్యూటీ, సోల్జర్ – టెక్నికల్, సోల్జర్–టెక్నికల్ నర్సింగ్ అసిస్టెంట్, సోల్జర్–క్లర్క్/స్టోర్ కీపర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. * పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎనిమిది, పదో తరగతి, 10+2/ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులవ్వాలి. దీంతో పాటు నిర్దేశిత శారీరక ప్రమాణాలు తప్పనిసరి. * సోల్జర్ జనరల్ డ్యూటీకి దరఖాస్తు చేసుకునే వారు 7 ఏళ్ల 6 నెలల నుంచి 21 ఏళ్లు, మిగతా పోస్టులకు 17ఏళ్ల 6 నెలల నుంచి 23 ఏళ్ల మధ్య వయసు ఉండాలి.
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. * ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్(పీఎఫ్టీ), ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్(పీఎంటీ) పోస్టులను ఉమ్మడి ప్రవేశ పరీక్ష మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. * ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ వచ్చే నెల 3వ తేదీతో (03-08-2021) ముగియనుంది. * ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీని 2021 ఆగస్టు 16 నుంచి 31 వరకు నిర్వహిస్తారు. * విశాఖపట్నంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ర్యాలీ నిర్వహించనున్నారు. * పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Bank Of Baroda Recruitment: బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..