AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TSPSC Group 2 exam: షెడ్యూల్‌ ప్రకారమే టీజీపీఎస్సీ గ్రూప్‌ 2 పరీక్ష.. పోస్టుల పెంపుపై సర్కార్ అనాసక్తి!

తెలంగాణ రాష్ట్ర గ్రూప్‌ 2 పరీక్ష ఏడాదిగా వాయిదా పడుతూనే వచ్చింది. తాజాగా మరోమారు వాయిదా వేయాలంటూ నిరుద్యోగులు నిరసనలు చేస్తున్నారు. పోస్టుల సంఖ్య పెంచాలంటూ నిరుద్యోగులు పోరుబాట పట్టారు. అయితే గ్రూప్‌ 2లో ఒక్క పోస్టు కూడా పెంచే ప్రసక్తే కనిపించడం లేదు. అలాంటి ఆలోచన కూడా కాంగ్రెస్‌ సర్కార్‌ చేస్తున్నట్లు ఆనవాలులేవు. ఈ విషయంపై ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి కూడా స్పష్టత..

TSPSC Group 2 exam: షెడ్యూల్‌ ప్రకారమే టీజీపీఎస్సీ గ్రూప్‌ 2 పరీక్ష.. పోస్టుల పెంపుపై సర్కార్ అనాసక్తి!
TSPSC Group 2 exam
Srilakshmi C
|

Updated on: Jul 10, 2024 | 8:05 AM

Share

హైదరాబాద్‌, జులై 10: తెలంగాణ రాష్ట్ర గ్రూప్‌ 2 పరీక్ష ఏడాదిగా వాయిదా పడుతూనే వచ్చింది. తాజాగా మరోమారు వాయిదా వేయాలంటూ నిరుద్యోగులు నిరసనలు చేస్తున్నారు. పోస్టుల సంఖ్య పెంచాలంటూ నిరుద్యోగులు పోరుబాట పట్టారు. అయితే గ్రూప్‌ 2లో ఒక్క పోస్టు కూడా పెంచే ప్రసక్తే కనిపించడం లేదు. అలాంటి ఆలోచన కూడా కాంగ్రెస్‌ సర్కార్‌ చేస్తున్నట్లు ఆనవాలులేవు. ఈ విషయంపై ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి కూడా స్పష్టత ఇచ్చారు. అభ్యర్ధులు కోరుతున్నట్టు పరీక్షలు వాయిదా వేసే ఆలోచన లేదని తేలిపోయింది. దీంతో షెడ్యూల్‌ ప్రకారమే ఆగస్టు 7, 8 తేదీల్లో పరీక్షలు నిర్వహించడానికి టీజీపీఎస్సీ ఏర్పాట్లు చేస్తుంది. ఆ మేరకు జిల్లాల వారీగా పరీక్ష కేంద్రాలను గతంలోనే గుర్తించగా, పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తిచేయాలని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో గ్రూప్‌ 2 పోస్టులను 2000లకు పెంచుతామని కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీని నెరవేర్చాలంటూ నిరుద్యోగులు కోరుతున్నారు. తీరా అధికారం చేపట్టిన తర్వాత చేసిన హామీలు రేవంత్‌ సర్కార్ తుంగలో తొక్కిందని నిరుద్యోగులు ఆందోళనలు చేస్తున్నారు.

కాగా మొత్తం 18 విభాగాల్లో 783 పోస్టులతో టీఎస్‌పీఎస్సీ గత ఏడాది గ్రూప్‌ 2 ఉద్యోగ ప్రకటన జారీచేసిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి 2023 జనవరి 18 నుంచి ఫిబ్రవరి 16 వరకు దరఖాస్తులు స్వీకరించింది కూడా. రాష్ట్ర వ్యాప్తంగా 5,51,943 మంది అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికే మూడు సార్లు వివిధ కారణాలతో గ్రూప్‌ 2 వాయిదా పడింది. ఈ సారి మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ గ్రూప్‌ పరీక్ష వాయిదా వేయబోమని ప్రభుత్వం తేల్చిచెప్పింది.

ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్‌లో ప్రవేశాల దరఖాస్తు గడువు పెంపు.. ఎప్పటివరకంటే!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అన్ని రకాల ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్‌ కాలేజీల్లో ఇంటర్మీడియట్‌ మొదటి ఏడాది ప్రవేశాలకు సంబంధించి దరఖాస్తు గడువును పెంపొందిస్తూ ఇంటర్‌ బోర్డు నిర్ణయం తీసుకుంది. అన్ని కాలేజీల్లో ఇప్పటికే ప్రవేశాల దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దానిని జులై 31వ తేదీ వరకు తుది గడువును మరోమారు పొడిగిస్తున్నట్లు బోర్డు కార్యదర్శి నిధిమీనా ఓ ప్రకటనలో తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగ పరచుకోవాలని, మరోసారి గడువు పెంచబోమని స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
బతికున్న వ్యక్తిని చనిపోయినట్లు నమోదు.. పింఛన్ నిలిపివేత... ఆయన
బతికున్న వ్యక్తిని చనిపోయినట్లు నమోదు.. పింఛన్ నిలిపివేత... ఆయన
బ్యాగ్‌లో ఏదో కదిలింది.. లోపల ఉన్నది చూసి గుండె ఆగినంత పనైంది!
బ్యాగ్‌లో ఏదో కదిలింది.. లోపల ఉన్నది చూసి గుండె ఆగినంత పనైంది!
ఇంజినీరింగ్ విద్యార్థులకు ఇంటర్నల్ స్లైడింగ్ షెడ్యూల్ విడుదల..
ఇంజినీరింగ్ విద్యార్థులకు ఇంటర్నల్ స్లైడింగ్ షెడ్యూల్ విడుదల..
3 ఏళ్లు డిప్రెషన్‏లో హీరోయిన్.. జీవిత పాఠాలు చెప్పిన యమున..
3 ఏళ్లు డిప్రెషన్‏లో హీరోయిన్.. జీవిత పాఠాలు చెప్పిన యమున..
శుక్ర చంద్రుల యుతి.. ఈ రాశులవారికి ఇక మంచి రోజులు!
శుక్ర చంద్రుల యుతి.. ఈ రాశులవారికి ఇక మంచి రోజులు!
గ్యాస్ వినియోగదారులకు కేంద్రం అలర్ట్.. అలా చేయకపోతే డబ్బులు కట్..
గ్యాస్ వినియోగదారులకు కేంద్రం అలర్ట్.. అలా చేయకపోతే డబ్బులు కట్..
ఇన్‌స్టా రీల్స్‌లో తిలక్ వర్మ యాక్టింగ్ అదుర్స్
ఇన్‌స్టా రీల్స్‌లో తిలక్ వర్మ యాక్టింగ్ అదుర్స్
వెళ్లింది ఆరుగురు.. తిరిగొచ్చింది మాత్రం ఐదుగురే..
వెళ్లింది ఆరుగురు.. తిరిగొచ్చింది మాత్రం ఐదుగురే..
నా పిల్లల కోసం మళ్లీ కత్తి పడతా..హంతకుడిని అవుతానన్న నారాయణ
నా పిల్లల కోసం మళ్లీ కత్తి పడతా..హంతకుడిని అవుతానన్న నారాయణ
పసికందు మృతదేహం మాయంపై కీలక విషయం చెప్పిన పోలీసులు
పసికందు మృతదేహం మాయంపై కీలక విషయం చెప్పిన పోలీసులు