AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Paramedical Courses: పారామెడికల్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల.. పూర్తి కౌన్సెలింగ్‌ షెడ్యూల్ ఇదే

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజీల్లో పారా మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు 2024-25 విద్యా సంవత్సరానికి గానూ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. కౌన్సెలింగ్కు హాజరయ్యే విద్యార్ధులు సంబంధిత ధ్రువపత్రాలతో..

Paramedical Courses: పారామెడికల్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల.. పూర్తి కౌన్సెలింగ్‌ షెడ్యూల్ ఇదే
Paramedical Courses
Srilakshmi C
|

Updated on: Oct 25, 2024 | 2:58 PM

Share

హైదరాబాద్‌, అక్టోబర్‌ 25: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లో మెడికల్‌ కోర్సుల్లో ప్రవేశాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా రాష్ట్రంలోని పారామెడికల్‌ కాలేజీల్లో సీట్ల భర్తీకి అర్హులైన విద్యార్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ పారామెడికల్‌ బోర్డు అక్టోబరు 24న నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీనిపై అక్టోబరు 30వ తేదీలోపు పూర్తి వివరాలతో కూడిన దరఖాస్తులను సంబంధిత జిల్లా డీఎంహెచ్‌వో ఆఫీసుల్లో అందజేయాలని విద్యార్ధులకు సూచించింది. జిల్లాల వారీగా నవంబరు 13లోపు కౌన్సెలింగ్‌ పూర్తి చేయాలని, నవంబర్‌ 20వ తేదీలోగా ఎంపిక జాబితా విడుదల చేస్తామని నోటిఫికేషన్‌లో తెలిపింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో చూడొచ్చని వివరించింది.

కొనసాగుతున్న టీజీపీఎస్సీ గ్రూప్‌ 1 పరీక్షలు.. పేపర్‌ 3 పరీక్షకు 67శాతం హాజరు

వివాదాల నడుమ తెలంగాణ గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్షలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో మొత్తం 46 పరీక్ష కేంద్రాల్లో అక్టోబర్‌ 22వ తేదీ నుంచి గ్రూప్‌ 1 పరీక్షలు ప్రారంభమయ్యాయి. పోలీలసుతోపాటు పాటు జిల్లా కలెక్టర్లు పటిష్ట భద్రత నడుమ ఈ పరీక్షలను నిర్వహిస్తున్నారు. అక్టోబర్‌ 22వ తేదీన పేపర్‌ 1 జనరల్‌ ఎస్సే పరీక్ష, 23వ తేదీన పేపర్‌ 2 హిస్టరీ, కల్చర్, జాగ్రఫీ పరీక్ష, 24వ తేదీన పేపర్‌ 3 ఇండియన్‌ సొసైటీ పరీక్షలు జరిగాయి. అయితే ఒక్కో పరీక్షకు అభ్యర్ధుల హాజరు 70 శాతాన్ని మించింది లేదు.

దీనిలో భాగంగా నిన్న (అక్టోబరు 24) జరిగిన పేపర్‌ 3 ఇండియన్‌ సొసైటీ, రాజ్యాంగం, గవర్నెన్స్‌ పరీక్షకు 67.7 శాతం హాజరు నమోదైందని టీజీపీఎస్సీ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ పరీక్షకు 21,264 మంది మాత్రమే హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్షలకు మొత్తం 31,383 మంది అభ్యర్థులు అర్హత సాధిస్తే.. వీరిలో అధిక మంది పరీక్షలకు డుమ్మా కొట్టడం విశేషం. కాగా ఆయా తేదీల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగుతున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
రాసిపెట్టుకోండి.. ప్లే ఆఫ్స్ చేరే ఆ 4 జట్లు ఇవే..!
రాసిపెట్టుకోండి.. ప్లే ఆఫ్స్ చేరే ఆ 4 జట్లు ఇవే..!
ములక్కాడ గుజ్జు కర్రీ.. అన్నం, చపాతీల్లోకి టేస్ట్ అదిరిపోతోంది
ములక్కాడ గుజ్జు కర్రీ.. అన్నం, చపాతీల్లోకి టేస్ట్ అదిరిపోతోంది
మెట్రోలో సాంకేతిక సమస్య.. ఆ రూట్‌లో రాకపోకలకు అంతరాయం!
మెట్రోలో సాంకేతిక సమస్య.. ఆ రూట్‌లో రాకపోకలకు అంతరాయం!
మాల్దీవులు కాదు..అందమైన డంపింగ్ యార్డ్.. షుటింగ్స్‌తో బిజీబిజీ
మాల్దీవులు కాదు..అందమైన డంపింగ్ యార్డ్.. షుటింగ్స్‌తో బిజీబిజీ
ఆ ఒక్కడు రిటైర్ అయ్యాక.. టీమిండియా పరిస్థితి తలుచుకుంటే
ఆ ఒక్కడు రిటైర్ అయ్యాక.. టీమిండియా పరిస్థితి తలుచుకుంటే
ఈ టాలీవుడ్ నటుడు మొన్నటివరకు HYD ఎలక్ట్రిసిటీ బోర్డులో వర్కర్
ఈ టాలీవుడ్ నటుడు మొన్నటివరకు HYD ఎలక్ట్రిసిటీ బోర్డులో వర్కర్
ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే.. చుట్టకు నిప్పు కావాలన్నట్టుంది..
ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే.. చుట్టకు నిప్పు కావాలన్నట్టుంది..
వాడు ఆడుతోన్న తీరు చూస్తే వణుకొస్తోంది.. గేల్ కంటే డేంజరస్
వాడు ఆడుతోన్న తీరు చూస్తే వణుకొస్తోంది.. గేల్ కంటే డేంజరస్
పురుషులకు నో ఎంట్రీ! పూర్తిగా మహిళల పాలనలోనే ఈ రైల్వే స్టేషన్..
పురుషులకు నో ఎంట్రీ! పూర్తిగా మహిళల పాలనలోనే ఈ రైల్వే స్టేషన్..
కొత్త ఆదాయపు పన్ను విధానం! CTCపై పన్ను..?
కొత్త ఆదాయపు పన్ను విధానం! CTCపై పన్ను..?