AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SIDBI recruitment 2022: 70వేల వేతనంతో అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులు.. రేపటితో ముగియనున్న గడువు.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..

SIDBI Grade A Assistant Manager Recruitment 2022: స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SIDBI) అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ A (General Stream) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది

SIDBI recruitment 2022: 70వేల వేతనంతో అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులు.. రేపటితో ముగియనున్న గడువు.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..
Sidbi Jobs
Basha Shek
|

Updated on: Mar 23, 2022 | 6:35 AM

Share

SIDBI Grade A Assistant Manager Recruitment 2022: స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SIDBI) అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ A (General Stream) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. అప్లై చేయడానికి రేపే (మార్చి24) తుది గడువు. బ్యాంకింగ్ రంగంలో స్థిరపడాలనుకునేవారికి ఇది మంచి అవకాశం. అందులోనూ కేవలం డిగ్రీ ఉత్తీర్ణతతోనే అసిస్టెంట్‌ మేనేజర్‌ ఉద్యోగాలు సొంతం చేసుకునే ఛాన్స్‌. మరి ఈ నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం తదితర విషయాల గురించి తెలుసుకుందాం రండి.

నోటిఫికేషన్‌ వివరాలు..

*మొత్తం ఖాళీల సంఖ్య: 100 *పోస్టుల వివరాలు: అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు *వయోపరిమితి: అభ్యర్థుల వయసు 18 – 28 ఏళ్ల మధ్య ఉండాలి. *పే స్కేల్‌: నెలకు రూ.70,000ల వరకు జీతం

*అర్హతలు: అభ్యర్థులు తప్పనిసరిగా ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి కనీసం 60 శాతం మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ లా లేదా ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ (సివిల్ / ఎలక్ట్రికల్ / మెకానికల్) లేదా ఏదైనా విభాగంలో మాస్టర్స్ డిగ్రీ (కామర్స్/ఎకనామిక్స్/మేనేజ్‌మెంట్)లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి లేదా CA / CS / CWA / CFA లేదా PhD పూర్తి చేసి ఉండాలి.

*ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

*దరఖాస్తు ఫీజు : జనరల్‌/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు: రూ. 1100 ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులకు: రూ. 175

*దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

*దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 24, 2022.

* అభ్యర్థులు SIDBI అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. * అభ్యర్థులు తమ వివరాలతో అప్లికేషన్ పూర్తిచేయాక దరఖాస్తు ఫీజు చెల్లించి సబ్మిట్ చేయాలి. దరఖాస్తు ఫామ్ ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి. * అభ్యర్థులకు తెలంగాణలోని హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విశాఖపట్నం, కర్నూలు, రాజమండ్రి, గుంటూరు పరీక్షా కేంద్రాలను కేటాయిస్తారు.

Also Read:ద్రాక్ష తీసుకుంటే ఎన్ని ప్ర‌యోజ‌నాలో..

Viral Video: కొంపముంచిన బంతి.. క్యాచ్ పట్టాలనుకుంటే దిమ్మతిరిగిపోయింది.. షాకింగ్ వీడియో వైరల్..

Traffic Challan: ఖజానాకు కాసులు కురిపిస్తున్న ట్రాఫిక్‌ చలాన్లు.. 20 రోజుల్లో 1.2 కోట్ల చలాన్లు క్లియర్‌..