AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nellore: సిసలైన జాతిరత్నాలు..! 800 మార్కులకు పరీక్షలు నిర్వహిస్తే 5,360 మార్కులు సాధించిన విద్యార్ధులు

ఆంధ్రప్రదేశ్‌ డిగ్రీ పరీక్షల ఫలితాల్లో మునుపెన్నడూ చూడనిరీతిలో వింతలు చోటుచేసుకుంటున్నాయి. ఎక్కడైనా అసలు మార్కులకంటే తక్కువ రావడం పరిపాటి. విక్రమ సింహపురి యూనివర్సిటీ విద్యార్ధులకు మాత్రం అసలు కంటే..

Nellore: సిసలైన జాతిరత్నాలు..! 800 మార్కులకు పరీక్షలు నిర్వహిస్తే 5,360 మార్కులు సాధించిన విద్యార్ధులు
Nellore VSU
Srilakshmi C
|

Updated on: Dec 14, 2022 | 9:00 AM

Share

ఆంధ్రప్రదేశ్‌ డిగ్రీ పరీక్షల ఫలితాల్లో మునుపెన్నడూ చూడనిరీతిలో వింతలు చోటుచేసుకుంటున్నాయి. ఎక్కడైనా అసలు మార్కులకంటే తక్కువ రావడం పరిపాటి. విక్రమ సింహపురి యూనివర్సిటీ విద్యార్ధులకు మాత్రం అసలు కంటే వేలకు వేలు మార్కులొచ్చాయి. వివరాల్లోకెళ్తే..

నెల్లూరులోని విక్రమ సింహపురి యూనివర్సిటీలో ఇటీవల డిగ్రీ విద్యార్ధులకు 800 మార్కులకు పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో కొంత మంది విద్యార్ధులకు ఏకంగా 2 వేలకు పైగా మార్కులు వచ్చాయి. ఈ యూనివర్సిటీలో మాత్రం విరుద్ధంగా మూడు రెట్లు అధికంగా మార్కులు రావడంతో విద్యార్ధులు అయోమయానికి గురవుతున్నారు. ఒక విద్యార్ధికైతే 5,360 మార్కులు వచ్చాయి. తాము అసలు పాసైయ్యామో, ఫెయిల్‌ అయ్యామో తెలీక విద్యార్ధులు తలలు పట్టుకుంటున్నారు. 8 నెలల క్రితం విక్రమ సింహపురి యూనివర్సిటీలో జరిగిన డిగ్రీ నాలుగో సెమిస్టర్‌ పరీక్షల ఫలితాలు తాజాగా విడుదలవ్వడంతో ఈ వింత వెలుగు చూసింది. ఫలితాలు ఆలస్యంగా వెల్లడించినప్పటికీ ఈ తప్పులేంటని విద్యార్ధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఎంతోమంది విద్యార్థులకు ఈ విధంగానే మార్కులు వచ్చాయి. దీనిపై యూవర్సిటీ రిజిస్ట్రార్‌ రామచంద్రారెడ్డి స్పందిస్తూ.. మార్కుల జాబితాల్లో తప్పులుంటే సవరించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి