AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

JEE Main Session 2 Schedule 2025: జేఈఈ మెయిన్‌ సెషన్‌ 2 పరీక్షల షెడ్యూల్‌ వచ్చేసింది.. ఏ పరీక్ష ఏయే తేదీల్లోనంటే

జేఈఈ మెయిన్‌ 2025 (ఏప్రిల్‌) తుది విడత పరీక్షల షెడ్యూల్‌ను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ తాజాగా విడుదల చేసింది. తాజా షెడ్యూల్‌ ప్రకారం ఏప్రిల్‌ 2 నుంచి ఈ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఆయా తేదీల్లో రోజుకు రెండు సెషన్ల చొప్పున ఆన్‌లైన్‌ విధానంలో ఈ పరీక్షలు జరుగుతాయి. పరీక్షకు 4 రోజుల ముందు అడ్మిట్‌ కార్డులు విడుదల చేస్తారు..

JEE Main Session 2 Schedule 2025: జేఈఈ మెయిన్‌ సెషన్‌ 2 పరీక్షల షెడ్యూల్‌ వచ్చేసింది.. ఏ పరీక్ష ఏయే తేదీల్లోనంటే
JEE Main Session 2 Schedule
Srilakshmi C
|

Updated on: Mar 11, 2025 | 5:04 PM

Share

హైదరాబాద్‌, మార్చి 7: జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ (జేఈఈ) మెయిన్‌ 2025 తుది విడత పరీక్షల షెడ్యూల్‌ వచ్చేసింది. ఈ మేరకు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ జేఈఈ మెయిన్‌ సెషన్ 2 షెడ్యూల్‌ను విడుదల చేసింది. తాజా షెడ్యూల్‌ ప్రకారం ఏప్రిల్‌ 2, 3, 4, 7, 8 తేదీల్లో పేపర్‌1 పరీక్ష జరుగుతుంది. ఇక ఏప్రిల్‌ 9వ తేదీన బీఆర్క్‌/బీ ప్లానింగ్‌ పేపర్‌ 2ఏ, 2బీ ప్రవేశ పరీక్ష జరుగుతుంది. ఆయా తేదీల్లో రోజుకు రెండు సెషన్ల చొప్పున ఆన్‌లైన్‌ విధానంలో ఈ పరీక్షలు జరుగుతాయి.

కాగా జేఈఈ మెయిన్‌ పరీక్షలు యేటా రెండు విడతల్లో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే తొలి విడత పరీక్షలు జనవరి 22వ తేదీన ప్రారంభమై మొత్తం 8 రోజుల పాటు దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో పేపర్‌ 1 పరీక్షలు జరిగాయి. తొలి విడత జేఈఈ మెయిన్‌ పరీక్ష ఫలితాలు కూడా వెల్లడయ్యాయి. తాజాగా రెండో సెషన్‌ పరీక్ష నిర్వహణకు ఎన్‌టీఏ ఏర్పాట్లు చేస్తోంది. బీఈ/బీటెక్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పేపర్‌ 1 పరీక్ష ఏప్రిల్‌ 2,3,4,7 తేదీల్లో రోజుకు రెండు షిఫ్టుల్లో జరుగుతుంది. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు మొదటి షిఫ్టు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండో షిఫ్టు పరీక్షలు జరుగుతాయి. ఏప్రిల్ 8వ తేదీన పరీక్ష మొదటి షిఫ్టులో మాత్రమే జరగనుంది. అలాగే ఏప్రిల్‌ 9న పేపర్‌ 2ఏ (బీఆర్క్‌), పేపర్‌-2బి (బిప్లానింగ్‌, పేపర్‌ 2ఎ, బి (బీఆర్క్‌, బి ప్లానింగ్‌) పరీక్ష ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు జరగనుంది.

జేఈఈ మెయిన్‌ సెషన్‌ 2 పరీక్షల షెడ్యూల్‌ 2025 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

దేశవ్యాప్తంగా ఉన్న నగరాలతో పాటు విదేశాల్లోరూ 15 నగరాల్లో ఈ జేఈఈ మెయిన్‌ తుది విడత పరీక్షలు నిర్వహించనున్నారు. ఇప్పటికే ఆన్‌లైన్‌ దరఖాస్తులు పూర్తికాగా.. త్వరలోనే సిటీ ఇంటిమేషన్‌ స్లిప్పులు విడుదల చేయనున్నారు. పరీక్షకు 4 రోజుల ముందు అడ్మిట్‌ కార్డులు విడుదల చేస్తారు.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
సమ్మర్‌లో దోసకాయను తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
సమ్మర్‌లో దోసకాయను తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
ఉత్కంఠ పోరులో ఓడిన ముంబై.. 3వ స్థానానికి చేరిన బెంగళూరు
ఉత్కంఠ పోరులో ఓడిన ముంబై.. 3వ స్థానానికి చేరిన బెంగళూరు
నగరంలో భారీ మోసం.. కస్టమర్ అకౌంట్ నుంచి రూ.6.5 కోట్లు మాయం
నగరంలో భారీ మోసం.. కస్టమర్ అకౌంట్ నుంచి రూ.6.5 కోట్లు మాయం
3 రాష్ట్రాల్లో మోస్ట్‌ వాంటేడ్.. ఇతని క్రిమినల్ రికార్డ్ తెలిస్తే
3 రాష్ట్రాల్లో మోస్ట్‌ వాంటేడ్.. ఇతని క్రిమినల్ రికార్డ్ తెలిస్తే
షాకింగ్ న్యూస్.. సడన్‌గా మైదానం వీడిన రోహిత్.. అసలేమైంది?
షాకింగ్ న్యూస్.. సడన్‌గా మైదానం వీడిన రోహిత్.. అసలేమైంది?
ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన రన్ మెషిన్!
ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన రన్ మెషిన్!
డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం జరగబోతుందా..?
డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం జరగబోతుందా..?
వాంఖడేలో ఆర్సీబీ బ్యాటర్ల ఊచకోత.. ముంబై ముందు భారీ టార్గెట్..
వాంఖడేలో ఆర్సీబీ బ్యాటర్ల ఊచకోత.. ముంబై ముందు భారీ టార్గెట్..
కాలేయం, ప్రేగులు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి..?
కాలేయం, ప్రేగులు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి..?
బిగ్‌ అలర్ట్.. ఆ జిల్లాల్లో రెండ్రోజుల పాటు తీవ్రవడగాలులు
బిగ్‌ అలర్ట్.. ఆ జిల్లాల్లో రెండ్రోజుల పాటు తీవ్రవడగాలులు