AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP ECET 2025 Notification: ఏపీ ఈసెట్ 2025 నోటిఫికేషన్‌ వచ్చేసింది.. ప్రవేశ పరీక్ష ఎప్పుడంటే?

పాలిటెక్నిక్‌ డిప్లొమా కోర్సు, బీఎస్సీ (మ్యాథమేటిక్స్‌) పూర్తి చేసిన విద్యార్థులకు బీఈ/ బీటెక్‌/ బీఫార్మసీ కోర్సుల్లో లేటరల్‌ ఎంట్రీ విధానంలో నేరుగా రెండో ఏడాదిలో ప్రవేశాలు కల్పించేందుకు ఈ ఏడాది కూడా ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఇంజినీరింగ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (ఏపీ ఈసెట్‌ 2025) నోటిఫికేషన్‌ను ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ (APSCHE) విడుదల చేసింది..

AP ECET 2025 Notification: ఏపీ ఈసెట్ 2025 నోటిఫికేషన్‌ వచ్చేసింది.. ప్రవేశ పరీక్ష ఎప్పుడంటే?
AP ECET 2025
Srilakshmi C
|

Updated on: Mar 10, 2025 | 2:23 PM

Share

అమరావతి, మార్చి 10: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్‌ కాలేజీల్లో 2025-26 విద్యాసంవత్సరానికి సంబంధించి బీటెక్‌, బీఫార్మసీ కోర్సు ద్వితీయ సంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించే ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఇంజినీరింగ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (ఏపీ ఈసెట్‌ 2025) నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ (APSCHE) షార్ట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈసెట్‌ ఆన్‌లైన్ దరఖాస్తులు మార్చి 12వ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్లు ఏపీ ఈసెట్‌ ఛైర్మన్‌, అనంతపురం జేఎన్‌టీయూ వీసీ ప్రొఫెసర్‌ శ్రీనివాసరావు, కన్వీనర్‌ ప్రొఫెసర్‌ భానుమూర్తి ఓ ప్రకటనలో వెల్లడించారు. ఏప్రిల్‌ 7, 2025వ తేదీ వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది.

ఇక మే 6వ తేదీన అభ్యర్థులకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఆన్‌లైన్ విధానంలో జరిగే ఈ పరీక్ష రెండు షిఫ్టుల్లో ఉంటుంది. మొదటి షిఫ్ట్‌ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో షిఫ్ట్‌ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. ఇక ఈసెట్‌ పరీక్షకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలు, వయోపరిమితి, ఆలస్య రుసుముతో దరఖాస్తు చేసుకునేందుకు గడువు వంటి వివరాలు వివరణాత్మక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు. మొత్తం వివరాలతో కూడి పూర్తి నోటిఫికేషన్‌ మార్చి 10వ తేదీన విడులద చేయనున్నట్లు ఉన్నత విద్యామండలి పేర్కొంది.

కాగా ఏపీ ఈసెట్‌లో వచ్చిన ర్యాంకు ఆధారంగా పాలిటెక్నిక్‌ డిప్లొమా కోర్సు, బీఎస్సీ (మ్యాథమేటిక్స్‌) పూర్తి చేసిన విద్యార్థులకు బీఈ/ బీటెక్‌/ బీఫార్మసీ కోర్సుల్లో లేటరల్‌ ఎంట్రీ విధానంలో నేరుగా రెండో ఏడాదిలో ప్రవేశాలు కల్పిస్తారన్న సంగతి తెలిసిందే. అగ్రికల్చర్‌ ఇంజినీరింగ్‌, కెమికల్‌ ఇంజినీరింగ్‌, సివిల్‌, కంప్యూటర్‌ సైన్స్‌, బయో టెక్నాలజీ, సెరామిక్‌ టెక్నాలజీ, ఈఈఈ, ఈసీఈ, మెకానికల్‌ ఇంజినీరింగ్‌ కోర్సులు, ఇన్‌స్ట్రుమెంటేషన్‌, మెటలర్జికల్‌, ఫార్మసీ విభాగాల్లో ప్రవేశాలకు పరీక్షలు జరుగుతాయి. ఇక ఈ ఏడాది కూడా ఏపీ ఈసెట్‌ 2025 పరీక్షను జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ అనంతపురం నిర్వహిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
ఫిట్నెస్ సీక్రెట్ రివీల్ చేసిన అల్లరి నరేష్..
ఫిట్నెస్ సీక్రెట్ రివీల్ చేసిన అల్లరి నరేష్..
ఇల్లు కొనేకంటే బెస్ట్ ఐడియా ఇది.. ఓ సారి చూసేయండి.
ఇల్లు కొనేకంటే బెస్ట్ ఐడియా ఇది.. ఓ సారి చూసేయండి.
తెల్ల జుట్టు నల్లగా మారాలా.. పైసా ఖర్చు లేకుండా మీ ఇంట్లోని..
తెల్ల జుట్టు నల్లగా మారాలా.. పైసా ఖర్చు లేకుండా మీ ఇంట్లోని..
ప్లేఆఫ్స్ రేసులో దూసుకొచ్చిన చెన్నై.. టాప్-4 చేరాలంటే ఏం చేయాలి?
ప్లేఆఫ్స్ రేసులో దూసుకొచ్చిన చెన్నై.. టాప్-4 చేరాలంటే ఏం చేయాలి?
కోహ్లీకి కోలుకోలేని దెబ్బ.. ఆరెంజ్ క్యాప్ రేసులో కింగ్ వెనక్కి
కోహ్లీకి కోలుకోలేని దెబ్బ.. ఆరెంజ్ క్యాప్ రేసులో కింగ్ వెనక్కి
స్పోర్ట్స్‌ బైక్‌ బీభత్సం.. స్పాట్‌లోనే ఐదుగురు మృతి
స్పోర్ట్స్‌ బైక్‌ బీభత్సం.. స్పాట్‌లోనే ఐదుగురు మృతి
నెక్ట్స్ టార్గెట్‌ తెలంగాణే.. మోదీ సభతో బీజేపీ నేతల్లో కొత్త జోష్
నెక్ట్స్ టార్గెట్‌ తెలంగాణే.. మోదీ సభతో బీజేపీ నేతల్లో కొత్త జోష్
అతి తక్కువ టైమ్‌లో రూ.17 లక్షలు కావాలా?
అతి తక్కువ టైమ్‌లో రూ.17 లక్షలు కావాలా?
మీరు స్నానం చేసే నీటిలో ఆ ఆకులు వేస్తే చాలు.. ఆ సమస్యలన్నీ మాయం..
మీరు స్నానం చేసే నీటిలో ఆ ఆకులు వేస్తే చాలు.. ఆ సమస్యలన్నీ మాయం..
120 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన 18 ఏళ్ల కుర్రాడు.. అరంగేట్రంలోనే
120 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన 18 ఏళ్ల కుర్రాడు.. అరంగేట్రంలోనే