AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆర్మీ ఉద్యోగాల కోసం లాస్ట్ డేట్ పొడిగింపు.. ఇదే చివరి అవకాశం

Indian Army Recruitment 2027: నిర్దిష్ట గడువులో రిజిస్ట్రేషన్ పూర్తి చేయలేకపోయిన అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో, వారికి మరో అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఇప్పటివరకు అప్లై చేయని అర్హులైన యువతీ యువకులు తమ దరఖాస్తులను పూర్తి చేసుకునే అవకాశం పొందారు.

ఆర్మీ ఉద్యోగాల కోసం లాస్ట్ డేట్ పొడిగింపు.. ఇదే చివరి అవకాశం
Aarmy
Prabhakar M
| Edited By: |

Updated on: Apr 04, 2026 | 9:12 PM

Share

భారతీయ సైన్యంలో చేరాలని లక్ష్యంగా పెట్టుకున్న యువతకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక అవకాశం కల్పించింది. రిక్రూట్‌మెంట్ ఇయర్ 2027 కోసం ఫిబ్రవరి 13, 2026న విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం దరఖాస్తుల గడువు ఏప్రిల్ 1తో ముగియాల్సి ఉండగా, ఇప్పుడు దాన్ని ఏప్రిల్ 10, 2026 వరకు పొడిగించారు.

నిర్దిష్ట గడువులో రిజిస్ట్రేషన్ పూర్తి చేయలేకపోయిన అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో, వారికి మరో అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఇప్పటివరకు అప్లై చేయని అర్హులైన యువతీ యువకులు తమ దరఖాస్తులను పూర్తి చేసుకునే అవకాశం పొందారు.

అభ్యర్థులు తప్పనిసరిగా అధికారిక వెబ్‌సైట్ www.joinindianarmy.nic.in ద్వారా మాత్రమే రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాలి. ఇతర మార్గాల ద్వారా దరఖాస్తులు స్వీకరించబడవు. గడువు ముగిసిన తర్వాత ఎలాంటి పొడిగింపు ఉండకపోవచ్చు కాబట్టి, అభ్యర్థులు చివరి తేదీకి ముందే అప్లై చేయడం అవసరం.

దరఖాస్తు చేసుకునే ముందు అభ్యర్థులు తమ అర్హతలను పూర్తిగా పరిశీలించుకోవాలి. వయసు పరిమితి, విద్యార్హతలు, శారీరక ప్రమాణాలు వంటి అంశాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవాలి. సరైన అర్హతలు ఉన్నవారే దరఖాస్తు చేయాలని అధికారులు సూచించారు.

భారతీయ సైన్యం నియామక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా, న్యాయంగా మరియు ఆటోమేటెడ్ విధానంలో జరుగుతుందని స్పష్టం చేసింది. ఎంపిక ప్రక్రియలో ఎలాంటి సిఫార్సులు లేదా వ్యక్తిగత ప్రభావాలకు స్థానం ఉండదు. అభ్యర్థుల ప్రతిభ, అర్హతల ఆధారంగానే ఎంపిక జరుగుతుంది.

ఇటీవల మోసపూరిత ఏజెంట్లు ఉద్యోగాల పేరుతో డబ్బులు వసూలు చేసే ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో, అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఎవరైనా డబ్బులు తీసుకుని ఆర్మీలో ఉద్యోగం ఇప్పిస్తామని చెబితే నమ్మవద్దని స్పష్టం చేశారు. రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో ఎలాంటి మధ్యవర్తులు ఉండరని అధికారులు పేర్కొన్నారు.

దేశ సేవ చేయాలనే అభిలాష కలిగిన యువత ఈ అదనపు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, చివరి తేదీకి ముందే దరఖాస్తు పూర్తి చేయాలని సూచిస్తున్నారు. ఇది సైన్యంలో చేరేందుకు మంచి అవకాశమని అధికారులు తెలిపారు.

Follow Us