Delhi: వర్చువల్ పాఠశాల విద్యారంగంలో మైలురాయి.. ఫీజు లేకుండానే నాణ్యమైన బోధన.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్

ఢిల్లీ (Delhi) ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. దేశంలోనే తొలి వర్చువల్‌ పాఠశాలను ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ ప్రారంభించారు. ఈ స్కూల్ లో చేరేందుకు దేశంలోని 13 నుంచి 18 ఏళ్ల వయసున్న విద్యార్థులు అందరూ..

Delhi: వర్చువల్ పాఠశాల విద్యారంగంలో మైలురాయి.. ఫీజు లేకుండానే నాణ్యమైన బోధన.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్
Arvind Kejriwal
Follow us

|

Updated on: Sep 01, 2022 | 9:09 AM

ఢిల్లీ (Delhi) ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. దేశంలోనే తొలి వర్చువల్‌ పాఠశాలను ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ ప్రారంభించారు. ఈ స్కూల్ లో చేరేందుకు దేశంలోని 13 నుంచి 18 ఏళ్ల వయసున్న విద్యార్థులు అందరూ అర్హులేనని వెల్లడించారు. నీట్‌, సీయూఈటీ, జేఈఈ వంటి పరీక్షలకు నిపుణులతో శిక్షణ ఇస్తామని చెప్పారు. ఈ వర్చువల్ పాఠశాల దేశ విద్యా విధానంలో మైలు రాయిగా మిగిలిపోతుందని కేజ్రీవాల్ అభివర్ణించారు. దూరం, బాలికలను పాఠశాలకు పంపించలేకపోవడం వంటి కారణాలతో మధ్యలోనే చదువు మానేసే వారికి, డ్రాపవుట్ గా మారే వారికి ఈ వర్చువల్ పాఠశాలల్లో ప్రవేశాలు కల్పిస్తామని, తరగతులు ఆన్‌లైన్‌లోనే (Online) జరుగుతాయని వివరించారు. అంతే కాకుండా ఉపాధ్యాయులు బోధించే వీడియోలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేస్తామని పేర్కొన్నారు. విద్యార్థుల అటెండెన్స్, పరీక్షలు వర్చువల్​మోడ్​లో జరిగుతాయి. కాపీ కొట్టేందుకు అవకాశం లేకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు. ఢిల్లీలోని ఎంపిక చేసిన పాఠశాలల్లో కంప్యూటర్ ద్వారా విద్యార్థులు ఈ పరీక్షలు రాయాలి. ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులనే వర్చువల్ విధానంలో బోధించేలా ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. వర్చువల్ స్కూల్స్​లో ఇంగ్లీష్, హిందీ మీడియాల్లో టీచింగ్ జరగనుంది.

ఢిల్లీ మోడల్‌ వర్చువల్ స్కూల్ విద్యారంగంలో మైలురాయి. వివిధ కారణాలతో స్కూల్ కు వెళ్లి చదువుకోలేని వారి కోసం ఈ వర్చువల్ పాఠశాలను ఏర్పాటు చేశాం. వర్చువల్‌ విధానంలోనే తరగతులు జరుగుతాయి. టీచర్లు పాఠాలు చెప్పే వీడియోలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేస్తారు. స్కూల్​నెట్, గూగుల్ కలిసి అభివృద్ధి చేసిన స్కూలింగ్ ప్లాట్​ఫాం ద్వారా ఆన్‌లైన్‌లో పాఠాలు బోధిస్తారు. విద్యార్థుల అటెండన్స్ కోసం ప్రత్యేక ఫీచర్ ఉంటుంది. పరీక్షలు వర్చువల్​విధానంలోనే జరిగినా కాపీకి ఆస్కారం లేకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటాం. రెండు టెర్మ్​-ఎండ్ పరీక్షల కోసం విద్యార్థులు తప్పనిసరిగా ఢిల్లీకి రావాల్సి ఉంటుంది. ఢిల్లీలోని ఎంపిక చేసిన పాఠశాలల్లో కంప్యూటర్ ద్వారా విద్యార్థులు ఈ పరీక్షలు రాయాలి.

– అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ ముఖ్యమంత్రి

ఇవి కూడా చదవండి

ఈ వర్చువల్ స్కూల్‌ దిల్లీ బోర్డ్ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌కు అనుబంధంగా ఉంటుంది. డీబీఎస్ఈ ఆధ్వర్యంలోనే మార్క్​ షీట్స్​, సర్టిఫికేట్స్​ఇస్తారు. వీటి ఆధారంగా విద్యార్థులు అండర్​గ్రాడ్యుయేట్ కోర్సుల్లో చేరవచ్చు. ఈ పాఠశాలలో చేరే విద్యార్థుల నుంచి ఎలాంటి ఫీజు వసూలు చేయరు. రిజిస్ట్రేషన్ల ఆధారంగా బ్యాచ్ లను నిర్ణయిస్తారు.