AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AAP vs BJP: ఢిల్లీలో బీజేపీ ఆప్‌ ఢీ అంటే ఢీ.. మాటల యుద్ధం కాస్తా వీధిపోరాటాలుగా మారిన వైనం..

AAP vs BJP: దేశరాజధాని ఢిల్లీలో బీజేపీ ఆప్‌ ఢీ అంటే ఢీ అంటున్నాయి. మాటల యుద్ధం మాత్రమే కాదు వీధి పోరాటాలకు కూడా దిగుతున్నారు ఇరుపార్టీల నేతలు.

AAP vs BJP: ఢిల్లీలో బీజేపీ ఆప్‌ ఢీ అంటే ఢీ.. మాటల యుద్ధం కాస్తా వీధిపోరాటాలుగా మారిన వైనం..
Bjp Vs Aap
Shiva Prajapati
|

Updated on: Aug 31, 2022 | 10:11 PM

Share

AAP vs BJP: దేశరాజధాని ఢిల్లీలో బీజేపీ ఆప్‌ ఢీ అంటే ఢీ అంటున్నాయి. మాటల యుద్ధం మాత్రమే కాదు వీధి పోరాటాలకు కూడా దిగుతున్నారు ఇరుపార్టీల నేతలు. ఢిల్లీలో స్కూళ్ల నిర్మాణంలో అవినీతి జరుగుతోందని బీజేపీ ఆరోపించింది. ఈ విషయంపై బీజేపీ నేత గౌరవ్‌ భాటియా, ఆప్‌ ఎమ్మెల్యే సౌరభ్‌ భరద్వాజ్‌ మధ్య సవాళ్ల పర్వం నడిచింది. తాము నిర్మించిన ప్రభుత్వ స్కూళ్లకు వచ్చి చూడాలని, అవినీతిని నిరూపించాలని సౌరభ్‌ భరద్వాజ్‌ సవాల్‌ విసిరారు. ఈ సవాల్‌కు స్పందించిన గౌరవ్‌ భాటియా ప్రభుత్వ స్కూల్‌ను సందర్శించడానికి వచ్చినప్పుడు గొడవ జరిగింది.

1960లో నిర్మించిన స్కూల్‌ను చూపించి తాము నిర్మించినట్టు కేజ్రీవాల్‌ ప్రచారం చేసుకుంటున్నారని గౌరవ్‌ భాటియా విమర్శించారు. స్కూల్‌ కొత్త బ్లాక్‌ లోకి వచ్చి చూస్తే అసలు విషయం తెలుస్తుందని గౌరవ్‌ భరద్వాజ్‌ కౌంటర్‌ ఇచ్చారు. అయితే స్కూల్‌ లోపలికి రాకుండానే గౌరవ్‌ భాటియా వెనక్కి వెళ్లిపోయారు. కారు నుంచి దిగకుండానే భాటియా పారిపోయారని ఎమ్మెల్యే సౌరభ్‌ భరద్వాజ్‌ విమర్శించారు. దీంతో ఇద్దరు నేతల మధ్య వాగ్వాదం జరిగింది. గౌరవ్‌భాటియా కారు వైపు ఆప్‌ కార్యకర్తలు దూసుకొచ్చారు. ఢిల్లీలో 500 స్కూళ్లను నిర్మించినట్టు ఆప్‌ ప్రచారం చేసుకుంటుందన్నారు గౌరవ్‌ భాటియా. కొత్త స్కూళ్ల పేరుతో అవినీతి పాల్పడుతున్నారని ఆరోపించారు. అయితే తాము కట్టిన స్కూళ్లను చూడడానికి గౌరవ్‌ భాటియా ఇష్టపడడం లేదని , అందుకే పారిపోయారని ఆప్‌ కౌంటరిచ్చింది.

ఆపరేషన్‌ లోటస్‌పై దర్యాప్తునకు డిమాండ్‌..

ఇవి కూడా చదవండి

ఢిల్లీలో ఆప్‌ ఎమ్మెల్యేలు సీబీఐ ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించారు. ఆపరేషన్‌ లోటస్‌పై వెంటనే దర్యాప్తు చేయాలని ఆప్‌ ఎమ్మెల్యేలు డిమాండ్‌ చేశారు. తమ ఎమ్మెల్యేలను బీజేపీ ఒక్కొక్కరికి రూ. 20 కోట్లు ఇచ్చి కొనేందుకు ప్రయత్నించిందని ఆప్‌ నేతలు ఆరోపించారు. తమ వినతి పత్రాన్ని తీసుకోవడానికి సీబీఐ డైరెక్టర్‌ ముందుకు రాలేదన్నారు ఆప్‌ ఎమ్మెల్యే ఆతిషి. ఆప్‌ ఎమ్మెల్యేల నిరసన తరువాత సీబీఐ అధికారులు బయటకు వచ్చి వినతిపత్రాన్ని స్వీకరించారు.

మరోవైపు నోట్లరద్దు సందర్భంగా జరిగిన స్కాంలో తన ప్రమేయముందని ఆప్‌ ఎమ్మెల్యేలు చేసిన ఆరోపణలపై పరువునష్టం దావా వేయాలని ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా నిర్ణయించారు. ఆప్‌ ఎమ్మెల్యేలు సౌరభ్‌ భరద్వాజ్‌, ఆతిషితో సహా మరో ఇద్దరిపై పరువునష్టం దావా వేయాలని ఎల్‌జీ నిర్ణయించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ కేయండి..

Follow Us
విజేతకే కాదు.. రన్నరప్‌తోపాటు ఆ జట్లపైనా కాసుల వర్షం.. !
విజేతకే కాదు.. రన్నరప్‌తోపాటు ఆ జట్లపైనా కాసుల వర్షం.. !
ఏడాది పాటు వచ్చే ఆకు కూరలు.. ఒక్కసారి నాటితే 365 రోజులు కూరలే ..
ఏడాది పాటు వచ్చే ఆకు కూరలు.. ఒక్కసారి నాటితే 365 రోజులు కూరలే ..
ఆ సినిమా ఫ్లాప్ అని ప్రభాస్‌కు చెబితే షాక్ అయ్యాడు.. చివరకు
ఆ సినిమా ఫ్లాప్ అని ప్రభాస్‌కు చెబితే షాక్ అయ్యాడు.. చివరకు
ఇదో వింత ప్రేమాయణం..1995 నాటి ప్రేయసి ముందు లక్షలు పోసినా తక్కువే
ఇదో వింత ప్రేమాయణం..1995 నాటి ప్రేయసి ముందు లక్షలు పోసినా తక్కువే
వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..? రుతుపవనాలపై బిగ్ అప్డేట్
వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..? రుతుపవనాలపై బిగ్ అప్డేట్
మీ గోళ్లే మీ ఆరోగ్యాన్ని తెలియజేస్తాయని తెలుసా?
మీ గోళ్లే మీ ఆరోగ్యాన్ని తెలియజేస్తాయని తెలుసా?
కేంద్రం ఇలా చేస్తే పెట్రోల్‌ ధర లీటర్‌కు రూ.22 వరకు తగ్గుతుంది?
కేంద్రం ఇలా చేస్తే పెట్రోల్‌ ధర లీటర్‌కు రూ.22 వరకు తగ్గుతుంది?
SRH బ్యాటర్ల ఊచకోత.. ఐపీఎల్ హిస్టరీలోనే భువీ చెత్త రికార్డ్..!
SRH బ్యాటర్ల ఊచకోత.. ఐపీఎల్ హిస్టరీలోనే భువీ చెత్త రికార్డ్..!
పిల్లలకు ఎంతో ఇష్టమైన మట్కా కుల్ఫీ.. ఇంట్లో ఎలా చేయాలి అంటే
పిల్లలకు ఎంతో ఇష్టమైన మట్కా కుల్ఫీ.. ఇంట్లో ఎలా చేయాలి అంటే
ఈ ఒక వస్తువు మీ ఇంట్లో ఉంటే చాలు.. లక్ష్మీ కటాక్షం ఎప్పుడూ మీపైనే
ఈ ఒక వస్తువు మీ ఇంట్లో ఉంటే చాలు.. లక్ష్మీ కటాక్షం ఎప్పుడూ మీపైనే