AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Capgemini In India: ఐటీ నిపుణులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ.. ఈ ఏడాదిలో భారీ నియామకాలు

కరోనా సృష్టించిన కల్లోలంతో చాలా రంగాల్లో నిరుద్యోగం పెరిగిపోయి.. కొంతమంది కూలీలుగా కూడా జీవనం సాగిస్తున్న సంగతి తెలిసిందే.. అయితే భారత్ లోని ఐటీ రంగ నిపుణులకు ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ క్యాప్ జెమినీ గుడ్ న్యూస్..

Capgemini In India: ఐటీ నిపుణులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ.. ఈ ఏడాదిలో భారీ నియామకాలు
Surya Kala
|

Updated on: Feb 27, 2021 | 3:08 PM

Share

Capgemini In India: కరోనా సృష్టించిన కల్లోలంతో చాలా రంగాల్లో నిరుద్యోగం పెరిగిపోయి.. కొంతమంది కూలీలుగా కూడా జీవనం సాగిస్తున్న సంగతి తెలిసిందే.. అయితే భారత్ లోని ఐటీ రంగ నిపుణులకు ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ క్యాప్ జెమినీ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది భారత్ లో 30 వేల మందికి ఉద్యోగాలు కల్పించబోతున్నామని ప్రకటించింది. 2020 తో పోలిస్తే… ఇప్పుడు ఐటీ నియామకాలు 25 శాతం అధికం. కరోనా నేపధ్యంలో వ్యాపారావకాశాలు మరింత పెరగనున్నాయని.. ఈ ఫ్రెంచ్ కంపెనీ భావిస్తోంది.

ఈ ఏడాది చేపట్టబోతున్న నియామకాల్లో ప్రెషర్స్ తో పాటు అనుభవజ్ఞులను కూడా క్యాప్‌జెమిని తీసుకోనుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ, క్లౌడ్, 5జీ, సైబర్ సెక్యూరిటీ, ఆర్ అండ్ డీ, ఇంజనీరింగ్ వంటి అభివృద్ధి చెందుతున్న డిజిటల్ రంగాల్లో నియమాకలను చేపట్టనున్నామని క్యాప్ జెమిని సీఈవో అశ్విన్ యార్డి చెప్పారు. కోవిడ్ 19 నేపధ్యంలో డిజిటల్ సొల్యూషన్స్‌కు పెరిగిన భారీ డిమాండ్ తమ వ్యాపారావకాశాలను మెరుగుపరచిందన్నారు. ఇక తాజా నియామకాల్లో..కొత్తవారితో పాటు.. ఎక్స్‌పీరియన్స్‌ అభ్యర్ధులను 50 శాతం చొప్పున తీసుకుంటామని  తెలిపారు.

డిసెంబరు త్రైమాసికంలో క్యాప్‌జెమిని ఆదాయంలో 65 % వాటా క్లౌడ్ బిజినెస్, డిజిటల్ సొల్యూషన్స్ విభాగాలనుండే ఉంది. కరోనా నుండి కోలుకుంటోన్న నేపధ్యంలో వ్యాపారం మళ్ళీ పుంజుకుంటోందని, భారీ డీల్స్, ప్రాజెక్టులు వస్తాయని సంస్థ భావిస్తోంది. గత సంవత్సరం ఏప్రిల్‌లో కరోనా సమయంలోనూ వేతన పెంపు ప్రకటించిన విషయం తెలిసిందే.

డిజిటల్ సొల్యూషన్స్‌కు డిమాండ్ పెరగడంతో.. ఈ ఏడాది భారత్ లో ఐటీ సంస్థల్లో నియామకాలు పెరుగుతాయని నిపుణులు అంచనావేస్తున్నారు. క్యాప్ జెమినీ బాటలోనే టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్ వంటి దేశీయ దిగ్గజాలు కూడా కొత్త ఉద్యోగులను గతంలో కంటే ఎక్కువగా తీసుకునే దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయి.

Also Read:

సౌందర్యతో పెళ్లిని రిజెక్ట్ చేశా… అంటున్న మల్టీటాలెంటెడ్ పర్సన్ ఎవరో తెలుసా..!

పెళ్ళిసమయంలో అనుష్కశర్మ చేసిన పని తెలిస్తే షాక్ అవుతారు..