AP Govt Jobs 2022: ఆంధ్రప్రదేశ్‌లో మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులకు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల.. పూర్తి వివరాలు ఇవే..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఆయుష్‌ విభాగంలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ద్వారా.. జనరల్‌/ లిమిటెడ్‌ రిక్రూట్‌మెంట్‌ కింద 26 మెడికల్‌ ఆఫీసర్‌ (యునాని) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్..

AP Govt Jobs 2022: ఆంధ్రప్రదేశ్‌లో మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులకు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల.. పూర్తి వివరాలు ఇవే..
APPSC Medical Officer Recruitment 2022
Follow us

|

Updated on: Sep 30, 2022 | 12:31 PM

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఆయుష్‌ విభాగంలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ద్వారా.. జనరల్‌/ లిమిటెడ్‌ రిక్రూట్‌మెంట్‌ కింద 26 మెడికల్‌ ఆఫీసర్‌ (యునాని) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన విద్యాసంస్థ నుంచి ఆయుష్ విభాగంలో బ్యాచిలర్‌ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. మెడికల్‌ ప్రాక్టీషర్‌గా పర్మనెంట్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకుని ఉండాలి. దరఖాస్తుదారుల వయసు జులై 1, 2022వ తేదీ నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. వయోపరిమితి విషయంలో ఎస్సీ/ఎస్టీ/పీహెచ్‌/బీసీ/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్ధులకు రిజర్వేషన్‌ వర్తిస్తుంది.

ఈ అర్హతలు కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ విధానంలో అక్టోబర్‌ 21, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్‌ 6, 2022వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. దరఖాస్తు సమయంలో జనరల్ అభ్యర్ధులు రూ.370లు, ఎస్సీ/ఎస్టీ/బీసీ/పీహెచ్‌/ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ అభ్యర్ధులు రూ.250లు అప్లికేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌ ఫీజు చెల్లింపులకు చివరి తేదీ అక్టోబర్‌ 20. రాత పరీక్ష ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.57,100ల నుంచి రూ.1,47,760ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

రాత పరీక్ష విధానం: రాత పరీక్ష మొత్తం 2 పేపర్లకు నిర్వహిస్తారు. మొదటి పేపర్‌లో జనవర్‌ స్టడీస్‌ అండ్‌ మెంటల్‌ ఎబిలిటీ విభాగంలో 150 మార్కులకు, 150 మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలకు, 150 నిముషాల వ్యవధిలో పరీక్ష రాయవల్సి ఉంటుంది. రెండో పేపర్ సంబంధిత సబ్జెక్టులో 150 ప్రశ్నలకు 300 మార్కులకుగానూ, 150 నిముషాల్లో పరీక్ష రాయవల్సి ఉంటుంది. ఈ విధంగా మొత్తం 450 మార్కులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. నెగెటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 1/3 చొప్పున పెనాల్టి విధిస్తారు. రాత పరీక్ష నవంబర్‌లో ఉంటుంది.

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

Latest Articles
కాకరకాయ కూర చేదు రావద్దంటే.. ఇలా ట్రై చేయండి..
కాకరకాయ కూర చేదు రావద్దంటే.. ఇలా ట్రై చేయండి..
మద్యం తాగే మహిళలకు షాకింగ్‌ న్యూస్‌.. అమెరికన్‌ అధ్యయనంలో..
మద్యం తాగే మహిళలకు షాకింగ్‌ న్యూస్‌.. అమెరికన్‌ అధ్యయనంలో..
కీలకపోరుకు సిద్ధమైన ఉప్పల్.. చూపులన్నీ ప్లేఆఫ్స్‌ పైనే..
కీలకపోరుకు సిద్ధమైన ఉప్పల్.. చూపులన్నీ ప్లేఆఫ్స్‌ పైనే..
మోదీని ఒక్కటీ అడగలేని నీకెందుకు ఓటేయాలి?బండి సంజయ్‌పై వినోద్ ఫైర్
మోదీని ఒక్కటీ అడగలేని నీకెందుకు ఓటేయాలి?బండి సంజయ్‌పై వినోద్ ఫైర్
పిట్రోడా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన ప్రధాని మోదీ
పిట్రోడా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన ప్రధాని మోదీ
ఇంత ముద్దుగా ఉన్న చిన్నారి ఇప్పుడు సోషల్ మీడియా సెన్సేషన్..
ఇంత ముద్దుగా ఉన్న చిన్నారి ఇప్పుడు సోషల్ మీడియా సెన్సేషన్..
ఏందిరా భయ్ ఇది.. సెల్ఫీ కోసం వస్తే.. మెడ పట్టుకుని నెట్టేస్తావా..
ఏందిరా భయ్ ఇది.. సెల్ఫీ కోసం వస్తే.. మెడ పట్టుకుని నెట్టేస్తావా..
సెల్ఫ్ రిపేరింగ్ రోడ్లు వచ్చేస్తున్నాయ్.. గోతులు వాటంతట అవే..
సెల్ఫ్ రిపేరింగ్ రోడ్లు వచ్చేస్తున్నాయ్.. గోతులు వాటంతట అవే..
మీరు బరువు తగ్గాలనుకుంటున్నారా.. ఈ విషయాలు మీ కోసమే!
మీరు బరువు తగ్గాలనుకుంటున్నారా.. ఈ విషయాలు మీ కోసమే!
ఫ్యామిలీతో కలిసి స్పెషల్ ఫ్లైట్‌లో ఢిల్లీకి చిరంజీవి, రామ్ చరణ్..
ఫ్యామిలీతో కలిసి స్పెషల్ ఫ్లైట్‌లో ఢిల్లీకి చిరంజీవి, రామ్ చరణ్..