AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Govt Schools: ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు భలే ఛాన్స్.. రోజూ గంటసేపు పండగే

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను చదువుతోపాటు క్రీడల్లోనూ తీర్చిదిద్దాలని కూటమి సర్కార్ సంకల్పించింది. ఇందుకోసం క్రీడల్లోనూ పిల్లల్లోని ప్రతిభను వెలికి తీసేందుకు సరికొత్త కార్యక్రమాన్ని అన్ని ప్రభుత్వ బడుల్లో అమలు చేసేందుకు సంకల్పించింది. ఆటలు ఆడటం వల్ల విద్యార్థుల మానసిక వికాసం మెరుగుపడుతుందని, గెలుపోటములను సమానంగా తీసుకుని ఆదర్శంగా మారతారని భావిస్తుంది..

AP Govt Schools: ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు భలే ఛాన్స్.. రోజూ గంటసేపు పండగే
Govt School Students
Srilakshmi C
|

Updated on: Mar 05, 2025 | 3:06 PM

Share

అమరావతి, మార్చి 5: రాష్ట్ర ప్రభుత్వం విద్యార్ధుల కోసం మరో వినూత్న కార్యక్రమాన్ని అమలు చేయనుంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను క్రీడల్లోనూ తీర్చిదిద్దాలని సంకల్పించింది. ఇందుకోసం క్రీడల్లోనూ పిల్లల్లోని ప్రతిభను వెలికి తీసేందుకు ‘యాక్టివ్‌ ఆంధ్ర’ కార్యక్రమాన్ని అన్ని ప్రభుత్వ బడుల్లో అమలు చేసేందుకు సంకల్పించింది. ఆటలు ఆడటం వల్ల విద్యార్థుల మానసిక వికాసం మెరుగుపడుతుందని, గెలుపోటములను సమానంగా తీసుకునే స్ఫూర్తి అలవడి ఆత్మవిశ్వాసం పెంచుకుంటారని భావిస్తోంది. ఈ కార్యక్రమం కింద అన్ని బడుల్లో రోజుకు గంట చొప్పున విద్యార్ధులతో ఆటలు ఆడించేందుకు విద్యాశాఖ సమాయాత్త మవుతుంది. ఇందుకు ఢిల్లీ పాఠశాలల్లో అమలు చేసిన నమూనాపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. అంతేకాకుండా వచ్చే వేసవి సెలవుల వరకు ఈ కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా మంగళగిరి నియోజకవర్గంలోని నిడమర్రు పాఠశాలలో ఈ కార్యక్రమాన్ఇన అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అనంతరం విడతల వారీగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది.

యాక్టివ్‌ ఆంధ్ర కార్యక్రమం ఎలా ఉంటుందంటే..

అన్ని ప్రభుత్వ బడుల్లోని విద్యార్థులను 5-8, 9-14, 15-19 ఏళ్లుగా విభజిస్తారు. వారికి ఆసక్తి ఉన్న ఆటలను రోజుకో గంట చొప్పున ఆడిస్తారు. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, ఫుల్‌బాల్‌ వంటి క్రీడల కోసం పాఠశాలల్లో మల్టీ కోర్టులు ఏర్పాటు చేస్తారు. అలాగే పరుగు పందెం, ఇతర క్రీడల కోసం ట్రాక్‌లు నిర్మిస్తారు. ఇందుకోసం పాఠశాలల్లోని పీఈటీ టీచర్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఫలితాలను పరిశీలించి, వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని పాఠశాలల్లో అమలు చేయాలని విద్యాశాఖ భావిస్తోంది. అంతేకాకుండా నాలుగైదు పాఠశాలలకు ఓ స్పోర్ట్స్‌ ఎక్స్‌లెన్స్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని చూస్తున్నారు.

పాఠశాలల్లో రాణించిన వారిని ఈ కేంద్రంలో నిర్వహించే ప్రత్యేక శిబిరాలకు పంపి అక్కడ మెరికల్లా తీర్చిదిద్దాలని భావిస్తున్నారు. చిన్నప్పటి నుంచే ప్రోత్సహిస్తే రాణించే అవకాశం ఉంటుందనేది ప్రభుత్వం ఉద్దేశ్యం. మొదట ప్రాథమిక స్థాయిలో విద్యార్థుల్లో ప్రతిభ అన్వేషణ జరుగుతుంది. వీరికి చదువుతో సహా పదేళ్లపాటు శిక్షణ ఇచ్చి.. జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా తయారు చేస్తారన్నమాట. ఇందుకోసం ప్రత్యేకంగా పాఠశాలల్లో స్పోర్ట్స్‌ కరిక్యులమ్‌ను రూపొందిస్తారు. ‘యాక్టివ్‌ ఆంధ్ర’ కార్యక్రమం కోసం స్వీక్యోయియా ఫిట్నెస్‌ అండ్‌ స్పోర్ట్స్‌ టెక్నాలజీ అనే సంస్థతో విద్యాశాఖ ఒప్పందం కూడా కుదుర్చుకుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
నాపై చర్యలు తీసుకుంటారంట.. ఆల్రెడీ సగం జీవితం పోయింది.. గీతూ
నాపై చర్యలు తీసుకుంటారంట.. ఆల్రెడీ సగం జీవితం పోయింది.. గీతూ
ఆన్‌లైన్‌లో రైల్వే టికెట్లు బుక్ చేసుకుంటున్నారా..? యాప్ బంద్
ఆన్‌లైన్‌లో రైల్వే టికెట్లు బుక్ చేసుకుంటున్నారా..? యాప్ బంద్
గల్ఫ్ దేశాల్లో క్షిపణుల మోత.. ప్లేయర్ల ఇంటి ప్రయాణంపై నీలినీడలు
గల్ఫ్ దేశాల్లో క్షిపణుల మోత.. ప్లేయర్ల ఇంటి ప్రయాణంపై నీలినీడలు
ఉదయం ఖాళీ కడుపుతో ఇవి తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా..?
ఉదయం ఖాళీ కడుపుతో ఇవి తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా..?
అయ్యో ఎంత పని చేశావక్కా.. జ్యోతిష్యుడు చెప్పిన మాటలు నమ్మి
అయ్యో ఎంత పని చేశావక్కా.. జ్యోతిష్యుడు చెప్పిన మాటలు నమ్మి
బలమైన వెస్టిండీస్‌ను ఢీకొట్టే టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే?
బలమైన వెస్టిండీస్‌ను ఢీకొట్టే టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే?
ఎంత ఘోరం.. ఎంత విషాదం.. వేట్లపాలెంలో అసలేం జరిగింది..?
ఎంత ఘోరం.. ఎంత విషాదం.. వేట్లపాలెంలో అసలేం జరిగింది..?
ఏపీలో పురుషులకు కూడా ఉచిత బస్సు సౌకర్యం.. నేటి నుంచే అమలు
ఏపీలో పురుషులకు కూడా ఉచిత బస్సు సౌకర్యం.. నేటి నుంచే అమలు
మార్చి 4న కోల్‌కతాలో కివీస్ దేనితో ఆడుతుందో తెలుసా ?
మార్చి 4న కోల్‌కతాలో కివీస్ దేనితో ఆడుతుందో తెలుసా ?
శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఎల్లుండి ఆలయం మూసివేత!
శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఎల్లుండి ఆలయం మూసివేత!