AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stock Market: స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడానికి ఇది సరైన సమయమా.. నిపుణులు ఏమంటున్నారు..

ప్రస్తుతం స్టాక్ మార్కెట్‌.. చాలా ఒడిదుడుకులను ఎదుర్కొంటుంది. మార్కెట్‌ వరుసగా మూడో వారం కూడా నష్టాలతో ముగిసింది...

Stock Market: స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడానికి ఇది సరైన సమయమా.. నిపుణులు ఏమంటున్నారు..
Srinivas Chekkilla
|

Updated on: Mar 06, 2022 | 8:41 AM

Share

ప్రస్తుతం స్టాక్ మార్కెట్‌.. చాలా ఒడిదుడుకులను ఎదుర్కొంటుంది. మార్కెట్‌ వరుసగా మూడో వారం కూడా నష్టాలతో ముగిసింది. ఉక్రెయిన్ సంక్షోభం కారణంగా, కమోడిటీ ధరలు, ముఖ్యంగా ముడి చమురు, రికార్డు స్థాయిలో పెరిగాయి. మరోవైపు, ద్రవ్యోల్బణ ఒత్తిడి పెరుగుతుండటంతో US ఫెడరల్ రిజర్వ్ ఈ నెలలో వడ్డీ రేటును పెంచవచ్చు. మొత్తం మీద, అనేక అంశాల ప్రభావం మార్కెట్‌పై కనిపిస్తోంది. కమోడిటీ మార్కెట్‌లో కూడా భారీ బూమ్ ఉంది. ఇక్కడ స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారులు ఇప్పుడు ఏమి చేయాలి అనే ప్రశ్న తలెత్తుతుంది.

ప్రస్తుతం ప్రతికూల సూచీలే ఆధిపత్యం చెలాయిస్తున్నాయని మార్కెట్ నిపుణులు అంటున్నారు. దీర్ఘకాలిక పెట్టుబడిదారులు నాణ్యమైన స్టాక్‌లలో పెట్టుబడి పెట్టవచ్చు. ఇన్వెస్ట్ చేయడం అనేది ఒకేసారి చేయడం కాకుండా క్రమంగా చేయాలి. ఆర్థిక నిపుణులు ఒకేసారి పెట్టుబడి పెట్టొద్దని చెబుతున్నారు. మార్కెట్ పడినప్పుడల్లా పెట్టుబడి పెడితే మంచిని పేర్కొంటున్నారు. దీంతో పాటు బంగారం, వెండిపై కూడా పెట్టుబడులు పెట్టాలని సూచించారు. ఇప్పటివరకు 2022 సంవత్సరంలో వెండి 10 శాతం, బంగారం 8.3 శాతం పెరిగింది. నిఫ్టీ 7.8 శాతం, సెన్సెక్స్ 8.2 శాతం నష్టపోయాయి.

ఇన్వెస్టర్లు స్వల్పకాలంలో మార్కెట్ నుంచి డబ్బు సంపాదించాలనుకున్నప్పుడు సమస్య తలెత్తుతుందని విశ్లేషకులు అంటున్నారు. పతనం కారణంగా, అతను నష్టానికి గురవుతాడని వివరిస్తున్నారు. దీంతో మార్కెట్ నుంచి నష్టాల్లో నిష్క్రమిస్తారు. చాలా మంది పెట్టుబడిదారులు అదే చేస్తారు. దీని కారణంగా మార్కెట్లో అస్థిరత మరింత పెరుగుతుంది. మార్కెట్‌లో మీ వద్ద ఉన్న మిగులు ఫండ్‌లో 30-40 శాతం వరకు పెట్టుబడి పెట్టండి. మిగిలిన మొత్తాన్ని లిక్విడ్ ఫండ్స్‌లో డిపాజిట్ చేయాలని, తదుపరి నాలుగు-ఆరు నెలల్లో ఈ ఫండ్‌ని ఉపయోగించండని చెబుతున్నారు. స్వల్పకాలానికి బాండ్లలో పెట్టుబడి పెట్టాలని సూచిస్తున్నారు.

మీరు ఖరీదైన లోహాలలో పెట్టుబడి పెట్టాలనుకుంటే, బంగారం బదులుగా వెండిలో పెట్టుబడి పెట్టండని కమోడిటీ రీసెర్చ్ అనలిస్ట్, మోతీలాల్ ఓస్వాల్, నవనీత్ దమానీ చెప్పార. రష్యా-ఉక్రెయిన్ వివాదం కారణంగా ముడిచమురు ధర ఆకాశాన్ని తాకుతున్నదని అన్నారు. ప్రస్తుతం ముడి చమురు 11 ఏళ్ల గరిష్ఠ స్థాయికి చేరుకుంది. దీంతో ద్రవ్యోల్బణం మరింత పెరుగుతుంది.

Read Also..  Petrol, Diesel Price: పెట్రోల్, డీజిల్ ధర పెరుగుదలకు కౌన్‌డౌన్ స్టార్ట్ అయిందా..!