AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UPI Payments: యూపీఐ వాడేవారికి బ్యాడ్‌న్యూస్.. రూ.2 వేలు దాటితే ఛార్జీలు కట్టాల్సిందే.. కేంద్రం సంచలన నిర్ణయం..

యూపీఐ వాడేవారికి కేంద్రం షాకిచ్చింది. ఎండీఆర్ ఛార్జీలను విధించాలని నిర్ణయం తీసుకుంది. త్వరలోనే దీనికి సంబంధించిన బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనుంది. ఇప్పటికే కేంద్ర ఆర్ధిక శాఖ ఈ ప్రతిపాదనకు అంగీకరించింది. యూపీఐ ఫ్లాట్‌ఫామ్ నుంచి ఎప్పటినుంచో ఎండీఆర్ ఛార్జీలపై డిమాండ్లు వినిపిస్తున్నాయి.

UPI Payments: యూపీఐ వాడేవారికి బ్యాడ్‌న్యూస్.. రూ.2 వేలు దాటితే ఛార్జీలు కట్టాల్సిందే.. కేంద్రం సంచలన నిర్ణయం..
Upi
Mahatma Kodiyar
| Edited By: |

Updated on: Aug 04, 2026 | 5:36 PM

Share

దేశంలో డిజిటల్ విప్లవానికి బాటలు వేసిన యూపీఐ (UPI), రూపే (RuPay) లావాదేవీలపై త్వరలో అదనపు ఛార్జీలు పడే అవకాశం ఉంది. పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న తాజా సవరణ బిల్లుతో మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) చార్జీల వసూలుకు మార్గం సుగమం అవుతుంది. ఈ నిర్ణయం ఎవరిపై ప్రభావం చూపుతుంది? ఆర్థిక శాఖ ప్రతిపాదనల వివరాలు ఇక్కడ చూద్దాం.

దేశంలో డిజిటల్ చెల్లింపుల రంగాన్ని ఊపేస్తున్న యూపీఐ లావాదేవీలపై మళ్లీ ‘మర్చంట్ డిస్కౌంట్ రేట్’ (MDR) విధించే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ వారంలో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్న ‘టాక్సేషన్ అండ్ అదర్ లాస్ (అమెండ్‌మెంట్) బిల్లు, 2026’ లో భాగంగా ఆర్థిక మంత్రిత్వ శాఖ కీలక మార్పులు చేయనుంది. ‘పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్స్ యాక్ట్, 2007’ లోని సెక్షన్ 10Aకు సవరణ చేయడం ద్వారా పెద్ద వ్యాపారులకు ఇచ్చే బ్యాంక్ ఛార్జీల మినహాయింపును తొలగించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది.

తాజా ప్రతిపాదనల వివరాలు

* రూ. 2,000 దాటితే ఛార్జీలు: రూ. 2,000 కంటే ఎక్కువ మొత్తంలో జరిగే UPI, రూపే డెబిట్ కార్డ్ లావాదేవీలపై దాదాపు “0.5%” వరకు ఎండీఆర్ (MDR) ఛార్జీ పడే అవకాశం ఉంది.

* ఎవరిపై ప్రభావం?: రూ. 50 కోట్ల కంటే ఎక్కువ వార్షిక టర్నోవర్ కలిగిన అమెజాన్ (Amazon), ఫ్లిప్‌కార్ట్ (Flipkart) వంటి భారీ ఈ-కామర్స్ దిగ్గజాలు, పెద్ద వ్యాపారులకు (Large Merchants) మాత్రమే ఈ నిబంధనలు వర్తిస్తాయి.

* చిన్న వ్యాపారులు, సామాన్యులకు ఊరట: రూ. 2,000 లోపు ఉండే లావాదేవీలకు ఎండీఆర్ నుంచి పూర్తిగా మినహాయింపు ఉంటుంది.

ఫైనాన్స్ కమిటీ నివేదికలో ప్రతిపాదనలు:

పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ ఫైనాన్స్ ఈ ఏడాది మార్చి నివేదికలో కీలక విషయాలను వెల్లడించింది:

* లావాదేవీల విలువ: ప్రస్తుతం మొత్తం యూపీఐ చెల్లింపుల విలువలో 67% మేర రూ. 2,000 కంటే ఎక్కువ విలువైన లావాదేవీలే ఉన్నాయి.

* భారీ నష్టం: 2021-22 నుంచి 2024-25 వరకు ప్రభుత్వం అందించిన సబ్సిడీ ప్రోత్సాహకాలు డిజిటల్ పేమెంట్ పరిశ్రమ భరించిన నిర్వహణ వ్యయంలో కేవలం 11% మాత్రమే. ఒకవేళ ఎండీఆర్ అనుమతించి ఉంటే వచ్చే రాబడిలో ఇది కేవలం 14%తో సమానం. దీనివల్ల పేమెంట్ సిస్టమ్ కంపెనీలు ప్రాసెసింగ్, సెటిల్‌మెంట్, మౌలిక వసతుల నిర్వహణకు తీవ్రంగా నష్టపోతున్నాయని కమిటీ పేర్కొంది.

* రికార్డు లావాదేవీలు: ఒక్క జూలై నెలలోనే దేశంలో 2,236 కోట్ల UPI లావాదేవీలు జరగ్గా, వాటి విలువ ఏకంగా రూ. 29.88 లక్షల కోట్లుగా నమోదైంది.

చట్టపరమైన మార్పులు ఏంటి?

ప్రస్తుత నిబంధనల ప్రకారం.. పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్స్ యాక్ట్‌లోని సెక్షన్ 10A ప్రకారం RuPay డెబిట్ కార్డులు, BHIM-UPI, UPI-QR కోడ్‌ల ద్వారా జరిగే చెల్లింపులపై బ్యాంకులు లేదా సిస్టమ్ ప్రొవైడర్లు ఎలాంటి ఛార్జీలు వసూలు చేయకూడదు. అయితే, ఆదాయపన్ను చట్టం 1961లోని సెక్షన్ 269SU నిబంధనలకు సవరణలు చేయడం ద్వారా రూ. 50 కోట్ల కంటే ఎక్కువ టర్నోవర్ ఉన్న వ్యాపార సంస్థలపై ఈ మినహాయింపును తొలగించాలని ప్రభుత్వం భావిస్తోంది. గత 2020లో డిజిటల్ పేమెంట్లను ప్రోత్సహించేందుకు MDRను సున్నా చేయగా, ఇప్పుడు వ్యవస్థ సుస్థిరత కోసం పెద్ద వ్యాపారుల నుంచి తిరిగి రుసుములు వసూలు చేసేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తోంది.

Follow Us
యూపీఐ వాడేవారికి షాకిచ్చిన కేంద్రం.. ఇకపై ఛార్జీలు..
యూపీఐ వాడేవారికి షాకిచ్చిన కేంద్రం.. ఇకపై ఛార్జీలు..
ఓట్లు గ్రామాలవి.. అభివృద్ధి నగరాలదా?
ఓట్లు గ్రామాలవి.. అభివృద్ధి నగరాలదా?
IPS అధికారి సస్పెన్షన్ తర్వాత మళ్లీ Job వస్తుందా?
IPS అధికారి సస్పెన్షన్ తర్వాత మళ్లీ Job వస్తుందా?
శ్రీలంక విమానమెక్కిన టీమిండియా.. కానీ ఆ కీలక ప్లేయర్ మిస్సింగ్
శ్రీలంక విమానమెక్కిన టీమిండియా.. కానీ ఆ కీలక ప్లేయర్ మిస్సింగ్
భారత సైన్యంలోకి అత్యాధునిక 'శత్రుంజయ్' యాంటీ డ్రోన్ సిస్టమ్
భారత సైన్యంలోకి అత్యాధునిక 'శత్రుంజయ్' యాంటీ డ్రోన్ సిస్టమ్
జమ్ముకశ్మీర్‌లో క్లౌడ్ బరస్ట్.. మెరుపు వరదల్లో 31 మంది మృతి
జమ్ముకశ్మీర్‌లో క్లౌడ్ బరస్ట్.. మెరుపు వరదల్లో 31 మంది మృతి
అందరం కలిస్తేనే.. అవినీతికి అంతం.. ప్రపంచ దేశాలకు భారత్ పిలుపు
అందరం కలిస్తేనే.. అవినీతికి అంతం.. ప్రపంచ దేశాలకు భారత్ పిలుపు
స్ట్రీట్ ఫుడ్ లవర్స్‌కి ఇక పండుగే.. హైదరాబాద్‌లో స్ట్రీట్ హబ్..
స్ట్రీట్ ఫుడ్ లవర్స్‌కి ఇక పండుగే.. హైదరాబాద్‌లో స్ట్రీట్ హబ్..
అమ్మవారికి ఇష్టమైన శ్రావణ మాస ప్రసాదం.. ఇలా చేస్తే తప్పక దీవెనే
అమ్మవారికి ఇష్టమైన శ్రావణ మాస ప్రసాదం.. ఇలా చేస్తే తప్పక దీవెనే
గ్రహణానికి ముందే జాగ్రత్త.. గర్భిణీలు పాటించాల్సిన నియమాలు ఇవే
గ్రహణానికి ముందే జాగ్రత్త.. గర్భిణీలు పాటించాల్సిన నియమాలు ఇవే
క్రేజీ డిసెంబర్‌.. హాలీవుడ్ మూవీస్‌తో బిగ్ ఫైట్‌
క్రేజీ డిసెంబర్‌.. హాలీవుడ్ మూవీస్‌తో బిగ్ ఫైట్‌
అనుకున్న దానికంటే ఆలస్యం.. విజయ్ దేవరకొండ విషయంలోనే ఎందుకలా..?
అనుకున్న దానికంటే ఆలస్యం.. విజయ్ దేవరకొండ విషయంలోనే ఎందుకలా..?
‘నా బిడ్డకు కొత్త జీవితాన్ని ఇచ్చారు’.. వీడియో
‘నా బిడ్డకు కొత్త జీవితాన్ని ఇచ్చారు’.. వీడియో
కదులుతున్న రైలు కింద పడబోయిన వ్యక్తి.. రెప్పపాటులో కాపాడిన మహిళా
కదులుతున్న రైలు కింద పడబోయిన వ్యక్తి.. రెప్పపాటులో కాపాడిన మహిళా
అమరావతికి ఆధ్యాత్మిక శోభ.. 123 అడుగుల భారీ కార్తికేయ విగ్రహం రెడీ
అమరావతికి ఆధ్యాత్మిక శోభ.. 123 అడుగుల భారీ కార్తికేయ విగ్రహం రెడీ
అన్నీ ఆగస్ట్‌లోనే.. టాలీవుడ్‌కు స్పెషల్ మంత్..!
అన్నీ ఆగస్ట్‌లోనే.. టాలీవుడ్‌కు స్పెషల్ మంత్..!
ఆఫర్ వచ్చినప్పుడు ఫ్లాప్ ఇచ్చారు.. ఇప్పుడేమో ఆఫర్స్ కోసం..
ఆఫర్ వచ్చినప్పుడు ఫ్లాప్ ఇచ్చారు.. ఇప్పుడేమో ఆఫర్స్ కోసం..
ఆర్మీ ఇంటెలిజెన్స్ బిగ్ ఆపరేషన్.. గుట్టు రట్టు!
ఆర్మీ ఇంటెలిజెన్స్ బిగ్ ఆపరేషన్.. గుట్టు రట్టు!
ఇదే నా చివరి మాట.. ఆర్నెల్లలో విగ్రహం పెట్టండి.. నా మాటకు అడ్డొస్
ఇదే నా చివరి మాట.. ఆర్నెల్లలో విగ్రహం పెట్టండి.. నా మాటకు అడ్డొస్
మాంసం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్, గుడ్ల ధరలు!
మాంసం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్, గుడ్ల ధరలు!