AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Modified UDAN: మధ్యతరగతి వారికి గుడ్‌న్యూస్‌.. కొత్త స్కీమ్‌కు కేంద్ర క్యాబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌!

కేంద్ర ప్రభుత్వం మాడిఫైడ్ ఉడాన్ పథకానికి రూ.28,840 కోట్ల బడ్జెట్‌తో ఆమోదం తెలిపింది. పదేళ్లలో దేశవ్యాప్తంగా 100 కొత్త విమానాశ్రయాలు, హెలిపోర్టులు, వాటర్ ఏరోడ్రోమ్‌ల నిర్మాణంతో సామాన్యులకు విమాన ప్రయాణం అందుబాటులోకి తేవడం లక్ష్యం. ఇది పర్యాటక రంగానికి ఊతమిచ్చి, వేల ఉద్యోగాలను సృష్టించి, ప్రాంతీయ అనుసంధానతను, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుంది.

Modified UDAN: మధ్యతరగతి వారికి గుడ్‌న్యూస్‌.. కొత్త స్కీమ్‌కు కేంద్ర క్యాబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌!
Modified Udan Scheme
SN Pasha
|

Updated on: Mar 25, 2026 | 7:30 PM

Share

దేశవ్యాప్తంగా విమాన ప్రయాణాన్ని సామాన్యులకు మరింత అందుబాటులోకి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ మాడిఫైడ్ ఉడాన్ పథకానికి ఆమోదం తెలిపింది. ఈ పథకానికి రూ.28,840 కోట్ల భారీ బడ్జెట్ కేటాయించగా, రాబోయే పదేళ్లలో దేశవ్యాప్తంగా 100 కొత్త విమానాశ్రయాలను నిర్మించడమే లక్ష్యంగా నిర్ణయించారు.

ఈ పథకం కేవలం ఎయిర్‌పోర్టుల నిర్మాణంతో మాత్రమే పరిమితం కాకుండా, హెలిపోర్టులు, వాటర్ ఏరోడ్రోమ్‌ల అభివృద్ధిని కూడా కలిగి ఉంది. ఇప్పటివరకు విమాన సౌకర్యం లేని మారుమూల ప్రాంతాలు, చిన్న పట్టణాలను జాతీయ విమాన రవాణా నెట్‌వర్క్‌లోకి తీసుకురావడమే ఈ ప్రణాళిక ప్రధాన ఉద్దేశ్యంగా ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రాంతీయ అనుసంధానతను పెంచడం ద్వారా ప్రజలకు తక్కువ ఖర్చుతో విమాన ప్రయాణం అందించడమే కాకుండా, మధ్యతరగతి ప్రజల కలలను సాకారం చేయాలనే లక్ష్యాన్ని కేంద్రం ముందుంచింది.

మాడిఫైడ్ ఉడాన్ పథకం అమలు వల్ల పర్యాటక రంగానికి కొత్త ఊపు లభించనుంది. ముఖ్యంగా పర్యాటక ప్రాధాన్యత గల ప్రాంతాలకు సులభంగా చేరుకునే అవకాశం పెరగడంతో దేశీయ పర్యాటకంలో వృద్ధి చోటు చేసుకుంటుందని భావిస్తున్నారు. అంతేకాకుండా, చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో వ్యాపార అవకాశాలు పెరిగి స్థానిక ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఈ ప్రాజెక్ట్ ద్వారా వేల సంఖ్యలో ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు సృష్టించబడతాయని అంచనా. విమానాశ్రయాల నిర్మాణం, నిర్వహణ, సంబంధిత సేవల రంగాల్లో ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి. మౌలిక సదుపాయాల అభివృద్ధిలో ఇది ఒక కీలక మైలురాయిగా నిలుస్తుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. దేశంలోని మారుమూల ప్రాంతాలకు కూడా విమాన సౌకర్యం కల్పించడమే మా ప్రాధాన్యత అని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే ఈ 100 కొత్త విమానాశ్రయాలు ఎక్కడ నిర్మించబడతాయన్న వివరాలు ఇంకా వెల్లడించలేదు. ఈ నేపథ్యంలో ప్రాజెక్ట్ అమలు దశపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us