AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏప్రిల్ 1 నుంచి 'కొత్త ఐటీ చట్టం-2025'.. కీలక మార్పులివే

ఏప్రిల్ 1 నుంచి ‘కొత్త ఐటీ చట్టం-2025’.. కీలక మార్పులివే

Phani CH
|

Updated on: Mar 25, 2026 | 5:34 PM

Share

భారత కేంద్ర ప్రభుత్వం 1961 ఆదాయపు పన్ను చట్టం స్థానంలో ఏప్రిల్ 1, 2025 నుండి అమలులోకి వచ్చే కొత్త చట్టం-2025ను తీసుకువస్తోంది. అయితే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25) రిటర్న్‌లు పాత చట్టం ప్రకారమే దాఖలు చేయాలి. FY 2026-27 నుండి మాత్రమే కొత్త నిబంధనలు వర్తిస్తాయి. పెరిగిన HRA పరిమితులు, విద్యా/హాస్టల్ అలవెన్సులు ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చనున్నాయి. పన్ను ఫైలింగ్‌ను సులభతరం చేయడానికి కొత్త నిబంధనలు వస్తున్నాయి.

భారత్‌లో కొత్త ఆదాయపు పన్ను చట్టం-2025ను తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. దశాబ్దాల నాటి 1961 చట్టం స్థానంలో ఈ కొత్త చట్టం ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. అయితే, ఈ మార్పు కారణంగా ప్రస్తుత పన్ను రిటర్నుల ఫైలింగ్‌పై చెల్లింపుదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేశారు. ఈ ఏడాది ఫైలింగ్ ప్రక్రియ మొత్తం ప్రస్తుతం అమల్లో ఉన్న 1961 చట్టం ప్రకారమే కొనసాగుతుందని అధికారులు హామీ ఇచ్చారు. ఈ కొత్త చట్టం అమలుపై నిపుణులు కీలక వివరణ ఇచ్చారు. ప్రస్తుత ఫైలింగ్: 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఏప్రిల్ 1, 2025 నుంచి మార్చి 31, 2026 వరకు ఆర్జించే ఆదాయానికి పాత చట్టం 1961 ప్రకారమే పన్నులు లెక్కించి రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంటుంది. 026-27 ఆర్థిక సంవత్సరం నుంచి సంపాదించే ఆదాయానికి మాత్రమే కొత్త నిబంధనలు వర్తిస్తాయని నిపుణులు వివరించారు. ప్రభుత్వం ఈ మార్పును దశలవారీగా, స్పష్టమైన ప్రణాళికతో అమలు చేస్తోందని తెలిపారు. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు నోటిఫై చేసిన ‘ఆదాయపు పన్ను నిబంధనలు-2026’ ప్రకారం ఉద్యోగులకు కొన్ని ప్రయోజనాలు కలగనున్నాయి. అందులో భాగంగా..ఇంటి అద్దె అలవెన్స్ పరిమితిని పెంచారు. 50 శాతం HRA స్లాబులోకి మరిన్ని నగరాలను చేర్చడం వల్ల మెట్రోయేతర నగరాల్లో ఉండేవారికి కూడా పన్ను ఆదా అవుతుంది. ఎడ్యుకేషన్ అలవెన్స్‌ను నెలకు రూ.3,000కు, హాస్టల్ అలవెన్స్‌ను నెలకు రూ.9,000కు పెంచారు. అయితే, ప్రయోజనాలు పెంచినప్పటికీ, HRA ఇంకా ఇతర తగ్గింపుల కోసం సమర్పించే డాక్యుమెంట్లు, డిక్లరేషన్ల విషయంలో నిబంధనలను ప్రభుత్వం కఠినతరం చేసింది. ఈ కొత్త విధానంలో భాగంగా ‘ఫైనాన్షియల్ ఇయర్’, ‘అసెస్‌మెంట్ ఇయర్’ అనే పదాల స్థానంలో ‘ట్యాక్స్ ఇయర్’ అనే ఒకే పదాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఫైలింగ్‌ను సులభతరం చేసేందుకు పన్ను ఫారమ్‌లను కూడా పూర్తిగా మార్చి, కొత్త నంబర్లను కేటాయించనున్నారు. దీనివల్ల ఫైలింగ్ ప్రక్రియలో స్పష్టత పెరిగి, సందిగ్ధత తగ్గుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఈపీఎఫ్ఓ సంచలన నిర్ణయం.. క్లెయిమ్ చేయని డబ్బులు నేరుగా ఖాతాల్లోకి

గ్యాస్‌ బండ చోరీకి ప్లాన్.. కానీ అడ్డంగా బుక్కయ్యాడు

మానవత్వం మరిచిన సంస్థకు.. రూ.210 కోట్ల ఫైన్ వేసిన కోర్టు

రైలులో చిన్నారికి అస్వస్థత.. మునగ సూప్‌ తాగించడంతో వాంతులు.. అప్పుడే ఓ అద్భుతం

ఒరిజినల్ ‘ధురంధర్’ ఇతనే !! అదిరిన అసలు కథ

Follow Us