India Post Payments: ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌దారులు అలర్ట్‌.. నేటి నుంచి కొత్త ఛార్జీలు.. పూర్తి వివరాలు

India Post Payments: వచ్చే ఏడాది జనవరి 1 నుంచి బ్యాంకింగ్‌ రంగంలో కొత్త నిబంధనలు అందుబాటులోకి రానున్నాయి. ఆర్బీఐ నిబంధల ప్రకారం ఈ కొత్త మార్పులు..

India Post Payments: ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌దారులు అలర్ట్‌.. నేటి నుంచి కొత్త ఛార్జీలు.. పూర్తి వివరాలు
Follow us

|

Updated on: Jan 01, 2022 | 7:18 AM

India Post Payments: వచ్చే ఏడాది జనవరి 1 నుంచి బ్యాంకింగ్‌ రంగంలో కొత్త నిబంధనలు అందుబాటులోకి రానున్నాయి. ఆర్బీఐ నిబంధల ప్రకారం ఈ కొత్త మార్పులు జరగనున్నాయి. ఇక ఇండియా పోస్ట్ పేమెంట్స్‌ బ్యాంక్‌ (ఐపీపీబీ) ఖాతా ఉన్న వారు ఈ ఏడాది నుంచి క్యాష్‌ విత్‌డ్రా చేసినా, డిపాజిట్‌ చేసినా ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ నిబంధనలు జనవరి 1, 2022 నుంచి అమల్లోకి రానున్నాయి. డబ్బుల ఉపసంహరణ, డిపాజిట్‌ లావాదేవీలపై ఛార్జీలు ఉంటాయని ఇండియా పేమెంట్‌ బ్యాంక్‌ తెలిపింది. పరిమితి దాటితే ఛార్జీలు ఉంటాయని వెల్లడించింది.

వేర్వేరు ఛార్జీలు.. అయితే ఈ ఛార్జీలు అందరికి ఒకేలా ఉండవు. వేర్వేరు ఛార్జీలు ఉంటాయి. బేసిక్‌ సేవింగ్స్‌ ఖాతా ఉన్నవారికి నెలకు నాలుగు సార్లు డబ్బులను ఎలాంటి ఛార్జీలు లేకుండా ఉపసంహరించకోవచ్చు. కానీ ఆ తర్వాత డబ్బులు ఉపసంహరించుకుంటే ఛార్జీలు తప్పవు. మొత్తంలో 0.50 శాతం లేదా కనీసం రూ.25 లావాదేవీకి ముట్టజెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ ఖాతా ఉన్నవారు క్యాష్‌ డిపాజిట్‌ చేసుకోవడం ఉచితం. ఎలాంటి ఛార్జీలు ఉండవు.

ఇతర పొదుపు ఖాతాలున్నవారు నెలకు రూ.25వేల వరకు విత్‌డ్రా చేసుకునేందుకు ఎలాంటి ఛార్జీలు ఉండవు. ఇది పూర్తిగా ఉచితం. ఆ తర్వాత విత్‌డ్రా చేసుకుంటే మొత్తం 0.50 శాతం లేదా కనీసం రూ.25 వరకు చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఈ ఖాతా కలిగిన వారు రూ.10వేల వరకు క్యాష్‌ డిపాజిట్‌ చేసుకోవచ్చు. ఎలాంటి ఛార్జీలు ఉండవు. కానీ రూ.10వేలకుపైగా డిపాజిట్‌ చేసుకుంటే 0.50 శాతం లేదా రూ.25 ప్రతి లావాదేవీకి ఛార్జీలు ఉంటాయి. ఈ నిబంధనలు 2022 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. కస్టమర్ల ఈ విషయాలను గమనించడం తప్పనిసరి. లేకుంటే ఎక్కువ విత్‌డ్రాలు చేసుకుంటే అదనంగా ఛార్జీల బదులు తప్పనిసరి ఉంటుంది.

ఇవి కూడా చదవండి:

PM Kisan: రైతన్నలకు కేంద్రం గుడ్‌న్యూస్‌.. రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్‌ డబ్బులు..!

Taxpayers: మీరు ఆదాయపు పన్ను రిటర్న్‌ దాఖలు చేస్తున్నారా..? కావాల్సిన పత్రాలు ఇవే..!

దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!