AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NPS Vatsalya: పిల్లల కోసం కేంద్ర కొత్త పథకం.. ఎంత ఇన్వెస్ట్ చేయాలంటే..

కేంద్ర ప్రభుత్వం ఓ కొత్త పథకాన్ని తీసుకువచ్చింది. మైనర్ల కోసం రూపొందించిన ఈ పథకానికి ఎన్ పీఎస్ వాత్సల్య అని పేరు పెట్టింది. దీని ద్వారా పిల్లల పేరు మీద ఏడాదికి కనీసం రూ.వెయ్యి జమ చేయవచ్చు. వారికి 18 ఏళ్ల నిండిన తర్వాత ఇది సాధారణ పెన్షన్ ఖాతాగా మారుతుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రారంభించిన ఎన్ పీఎస్ వాత్సల్య పథకం వివరాలు ఇవే..

NPS Vatsalya: పిల్లల కోసం కేంద్ర కొత్త పథకం.. ఎంత ఇన్వెస్ట్ చేయాలంటే..
Nps Vatsalya Scheme
Madhu
|

Updated on: Sep 19, 2024 | 5:03 PM

Share

పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్ధడం కోసం తల్లిదండ్రులు అనేక ప్రణాళికలు తయారు రూపొందిస్తారు. భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తకుండా అనేక చర్యలు తీసుకుంటారు. దీనిలో భాగంగా వివిధ పొదుపు పథకాలలో డబ్బులను ఇన్వెస్ట్ చేస్తారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఓ కొత్త పథకాన్ని తీసుకువచ్చింది. మైనర్ల కోసం రూపొందించిన ఈ పథకానికి ఎన్ పీఎస్ వాత్సల్య అని పేరు పెట్టింది. దీని ద్వారా పిల్లల పేరు మీద ఏడాదికి కనీసం రూ.వెయ్యి జమ చేయవచ్చు. వారికి 18 ఏళ్ల నిండిన తర్వాత ఇది సాధారణ పెన్షన్ ఖాతాగా మారుతుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రారంభించిన ఎన్ పీఎస్ వాత్సల్య పథకం వివరాలు ఇవే..

దీర్ఘకాలంలో అధిక రాబడి..

పిల్లల ఆర్థిక భవిష్యత్తును సుస్థిరం చేయడం కోసం దీర్ఘకాలంలో అధిక సంపద సృష్టించాలనుకునే తల్లిదండ్రులకు నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్‌పీఎస్)-వాత్సల్య పథకం చాలా ఉపయోగంగా ఉంటుంది. 2024 బడ్జెట్‌లో తొలిసారిగా దీన్ని ప్రకటించారు. అనంతరం ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మైనర్లకు ప్రాన్ (శాశ్వత పదవీ విరమణ ఖాతా సంఖ్య) కార్డులను పంపిణీ చేశారు. దీని ద్వారా సాధారణ ఎన్ పీఎస్ ఫండ్లు అందించే దీర్ఘకాలిక రాబడిని పిల్లలు పొందుతారు. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (పీఎఫ్‌ఆర్‌డీఏ) దీన్ని పర్యవేక్షిస్తుంది.

ఎన్పీఎస్ వాత్సల్య..

  • తల్లిదండ్రులు తమ పిల్లలకు 18 ఏళ్లు నిండే వరకూ ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. దీర్ఘకాలంలో పిల్లల కోసం సంపదను సృష్టించడం దీని ప్రధాన లక్ష్యం. సాధారణ ఎన్ పీఎస్ ఖాతాల మాదిరిగానే ఈ పథకానికి కూడా పీఎఫ్‌ఆర్‌డీఏ నియంత్రణ ఉంటుంది.
  • 18 ఏళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లల తల్లిదండ్రులు దీనికి అర్హులు. పిల్లల పేరుమీద తల్లిదండ్రులు, సంరక్షకులు ఖాతాలను తెరవవచ్చు.
  • ప్రధాన బ్యాంకులు, పోస్టాఫీసులు, పెన్షన్ ఫండ్స్ కార్యాలయాలు, ఇ-ఎన్ పీఎస్ పోర్టల్ ద్వారా వీటికి ప్రారంభించుకోవచ్చు.
  • ఖాతాను ప్రారంభించడానికి తల్లిదండ్రుల కేవైసీ అవసరం. పిల్లలకు సంబంధించిన గుర్తింపు పత్రాలు కూడా అందజేయాలి.
  • ఈ పథకం కింద తల్లిదండ్రులు తమ పిల్లల పేరిట సంవత్సరానికి కనీసం రూ.వెయ్యి ఇన్వెస్ట్ చేయవచ్చు. గరిష్ట పరిమితి లేదు. పిల్లలు మేజర్లయిన తర్వాత అది సాధారణ ఎన్ పీఎస్ ఖాతాకు మారుతుంది.
  • ప్రామాణిక ఎన్ పీఎస్ ఖాతాల మాదిరిగానే తల్లిదండ్రులు ఎన్ పీఎస్ పెన్షన్ ఫండ్ మేనేజర్‌లలో ఎవరినైనా ఎంచుకోవచ్చు. పెట్టుబడులు పెట్టడానికి యాక్టివ్ లేదా ఆటో ఎంపికను ఎంచుకోవచ్చు.
  • పిల్లలు ఎదిగి సొంతంగా ఆదాయం పొందడం ప్రారంభించే సమయానికి పొదుపు చేసిన మొత్తం బాగా పెరుగుతుంది. ఇది పిల్లలతో పాటు తల్లిదండ్రులకు పొదుపు క్రమశిక్షణను పెంపొందిస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..