Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Union Budget 2023: వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లపై ఫోకస్.. వచ్చే బడ్జెట్లో భారీ ఎత్తున కేటాయింపులు! నిర్మలమ్మ ఏం చెబుతుందో!

వచ్చే 2023 కేంద్ర బడ్జెట్లోనే దీనికి సంబంధించిన ప్రతిపాదనలు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించే అవకాశం ఉంది. దాదాపు 300 నుంచి 400 కొత్త వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే చాన్స్ ఉంది.

Union Budget 2023: వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లపై ఫోకస్.. వచ్చే బడ్జెట్లో భారీ ఎత్తున కేటాయింపులు! నిర్మలమ్మ ఏం చెబుతుందో!
Vander Bharat Express (File Photo) Image Credit source: TV9 Telugu
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Anil kumar poka

Updated on: Jan 02, 2023 | 5:45 PM

వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు.. భారతీయ రైల్వే వ్యవస్థలో సరికొత్త విప్లవాన్ని తీసుకొచ్చింది. అత్యాధునిక సాంకేతికత, అధిక వేగంతోపాటు అద్భుత సౌకర్యాలతో ప్రయాణికులకు తమ ప్రయాణంలో మంచి అనుభూతినిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రైళ్ల సంఖ్యను మరింత పెంచి, దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. వచ్చే 2023 కేంద్ర బడ్జెట్లోనే దీనికి సంబంధించిన ప్రతిపాదనలు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించే అవకాశం ఉంది. దాదాపు 300 నుంచి 400 కొత్త వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే చాన్స్ ఉంది. అందుకనుగుణంగా రైల్వే సంస్థ 160 కిలోమీటర్ల వేగంగా దూసుకెళ్లే 475 రైళ్లను తయారు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఇందుకోసం టిల్టింగ్ అనే ప్రత్యేక టెక్నాలజీని వినియోగిస్తోంది. తద్వారా ట్రాక్ వంపుల్లోనూ రైలు అధిక వేగంతో సులభంగా ప్రయాణించేందుకు వీలు కల్గుంతుంది.

500 వందే భారత్ రైళ్లు..

వచ్చే కొన్ని ఏళ్లలో 500 వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లను తయారు చేసేందుకు తగిన ప్రణాళికతో ముందుకెళ్తున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి ఓ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ప్రస్తుతం ఒక నెలలో రెండు నుంచి రెండున్నర రైళ్లను తయారు చేస్తున్నట్లు చెప్పిన మంత్రి.. త్వరలో నెలలో ఆరు రైళ్లను సిద్ధం చేసేలా ప్రొడక్షన్ ను పెంచనున్నట్లు వెల్లడించారు. అలాగే పార్లమెంట్లో ఓ ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ ఆర్థిక సంవత్సరంలో ఆరు వందేభారత్ రైళ్లను ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు.

వందే భారత్ రూట్లు ఇవి..

వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు 2019 తన తొలి ప్రయాణాన్ని వారణాసి, ఢిల్లీ.. ఢిల్లీ, కాత్రా మధ్య ప్రారంభించింది. 2022లో అప్ గ్రేడేడ్ వందే భారత్ ఎక్స్ ప్రెస్ 2.0 రైలును ఐసీఎఫ్ చెన్నై ఆవిష్కరించింది. ఇప్పటి వరకూ నాలుగు అప్ గ్రేడేడ్ ర్యాక్ లు వినియోగంలో ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

1. 20825/20826 బిలాస్‌పూర్ జంక్షన్ – నాగ్‌పూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్

2. 20607/20608 చెన్నై సెంట్రల్- మైసూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్

3. 22447/22448 న్యూ ఢిల్లీ – అంబ్ అందౌరా వందే భారత్ ఎక్స్‌ప్రెస్

4. 20901/2090 ముంబై సెంట్రల్ గాంధీనగర్ ఎక్స్‌ప్రెస్ కాపిటల్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్

5. 22439/22440 న్యూఢిల్లీ-శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా వందే భారత్ ఎక్స్‌ప్రెస్

6. 22435/22436 న్యూఢిల్లీ-వారణాసి వందే భారత్ ఎక్స్‌ప్రెస్

త్వరలో స్లీపర్ క్లాస్ లు కూడా..

వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లలో ప్రస్తుతం ప్రపంచ స్థాయి చైర్ కార్ కోచ్ లు అందుబాటులో ఉన్నాయి. వీటిని మరింత అప్ గ్రేడ్ చేయడంతో పాటు స్లీపర్ కోచ్ లను కూడా తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాజధాని ఎక్స్ ప్రెస్ తరహాలో బెర్త్ లను దీనిలో ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక చేస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి..