AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Success Story: అలా మొదలైంది.. దుబాయ్‌లో ఉద్యోగం వదిలి స్వదేశానికి.. ఇప్పుడు కోట్ల సంపాదన!

Success Story: దుబాయ్ నుండి భారతదేశానికి వచ్చిన తర్వాత తాను మొదట అరటిపండ్లను దుబాయ్‌కి ఎగుమతి చేశానని బిజేష్ చెప్పాడు . అయితే చెల్లింపు సంబంధిత సమస్యలు ప్రారంభమైనందున ఈ వ్యాపారం ఎక్కువ కాలం కొనసాగలేదు. అలాగే, పెద్దగా లాభం రాలేదు. దీని తర్వాత..

Success Story: అలా మొదలైంది.. దుబాయ్‌లో ఉద్యోగం వదిలి స్వదేశానికి.. ఇప్పుడు కోట్ల సంపాదన!
Subhash Goud
|

Updated on: Jul 31, 2025 | 10:07 AM

Share

Success Story: కూరగాయలు అమ్మడం ద్వారా కోట్ల రూపాయలు సంపాదించవచ్చా? అవును.. ఇది నిజమే అని నిరూపించాడు కేరళ నివాసి బిజేష్ పికె. అతను తన ఉద్యోగాన్ని వదిలి కూరగాయలు పండించడం, అమ్మడం ప్రారంభించాడు. దీని వల్ల అతనికి గొప్ప ఆదాయం వచ్చింది. తక్కువ సమయంలోనే అతని సంపాదన కోట్ల రూపాయలు రావడం మొదలైంది. అతను తన కూరగాయలను దుబాయ్‌కు సరఫరా చేస్తాడు.

అది ఎలా మొదలైంది?

అది దాదాపు దశాబ్దం క్రితం బిజేష్ దుబాయ్ వెళ్ళాడు. అక్కడ ఓనం పండుగ సమయంలో విందుకు తాజా అరటి పండ్లు, ఆకులు దొరకడానికి అతను చాలా కష్టపడాల్సి వచ్చింది. ఆ సమయంలో అతను ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అరటి ఆకుల కోసం వెతుకుతున్నప్పుడు భారతదేశంలో లాగా ఇక్కడ నివసించే భారతీయులు కూడా అరటి ఆకులు, పండ్లు, ఇతర కూరగాయలను సులభంగా పొందడం ప్రారంభిస్తే ఎంత బాగుంటుందో అనే ఆలోచన వచ్చింది. అప్పుడే అతని మనసులో బిజినెస్‌ ఐడియా పుట్టింది.

ఇవి కూడా చదవండి

ఈ ఆలోచనతో ప్రేరణ పొందిన 47 ఏళ్ల బిజేష్ దుబాయ్‌లో తన ఉద్యోగాన్ని వదిలి తన స్వస్థలం త్రిసూర్‌కు తిరిగి వచ్చాడు. అవసరమైన లైసెన్స్ తీసుకున్న తర్వాత 35 కుటుంబాలు పండించిన 160 కిలోల కూరగాయలను ఎగుమతి చేయడం ద్వారా ఇక్కడ అతను తన వ్యాపారాన్ని ప్రారంభించాడు. నేడు అతని కంపెనీ నేచర్ బీట్స్ ఆర్గానిక్ దుబాయ్‌లోని 1000 కంటే ఎక్కువ కుటుంబాలకు సేంద్రీయ కూరగాయలను అందిస్తుంది. ఇది మాత్రమే కాదు, అతనికి అల్ ఖుసైస్‌లో రిటైల్ దుకాణం కూడా ఉంది.

ఇది కూడా చదవండి: PM Kisan: రైతులకు గుడ్‌న్యూస్‌.. పీఎం కిసాన్‌ నిధుల విడుదలకు తేదీ ఖరారు.. వీరికి మాత్రం రావు!

అరటిపండ్లతో వ్యాపారం ప్రారంభం:

దుబాయ్ నుండి భారతదేశానికి వచ్చిన తర్వాత తాను మొదట అరటిపండ్లను దుబాయ్‌కి ఎగుమతి చేశానని బిజేష్ చెప్పాడు . అయితే చెల్లింపు సంబంధిత సమస్యలు ప్రారంభమైనందున ఈ వ్యాపారం ఎక్కువ కాలం కొనసాగలేదు. అలాగే, పెద్దగా లాభం రాలేదు. దీని తర్వాత అతను దుబాయ్‌లో ఆర్గానిక్ కూరగాయలను అమ్మడం ప్రారంభించాడు.

ఇది కూడా చదవండి: Hero Bike: ఈ బైక్‌లో ఒక్కసారి పెట్రోల్‌ నింపితే 650 కి.మీ.. నెలకు రూ.3 వేలతో బైక్‌ సొంతం!

ప్రారంభంలో సేంద్రీయ కూరగాయలు దొరకడం చాలా కష్టంగా ఉండేది. తాను 35 కుటుంబాలతో ప్రారంభించానని బిజేష్ చెప్పాడు. ఆ సమయంలో అతను 1 కిలో ప్యాకెట్లలో 160 కిలోల కూరగాయలను పంపాడు. దుబాయ్‌లో నివసించే అతని సోదరుడు ప్రవీణ్ ఈ పనిలో అతనికి చాలా సహాయం చేశాడు. ప్రవీణ్ ఈ కూరగాయలను దుబాయ్‌లోని ప్రతి ఇంటికి డెలివరీ చేసేవాడు.

ఇది కూడా చదవండి: Electric Scooter: కేవలం రూ.54వేలకే 130కిమీ రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్‌ స్కూటర్‌.. డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు

పెరిగిన వ్యాపారం:

దుబాయ్‌లోని ప్రజలు సేంద్రీయ కూరగాయల గురించి తెలుసుకున్నప్పుడు వారి కస్టమర్ల సంఖ్య పెరిగిందని బిజేష్ చెప్పారు. 35 కుటుంబాలతో ప్రారంభమైన తన ప్రయాణం 1000 కుటుంబాలకు చేరుకుంది. ఎగుమతులు ప్రారంభించిన రెండు సంవత్సరాల తర్వాత బిజేష్ సేంద్రీయ వ్యవసాయం ప్రారంభించాలని అనుకున్నాడు. అతను త్రిస్సూర్‌లో 1.5 ఎకరాల భూమిని లీజుకు తీసుకున్నాడు. ఇప్పుడు వారిద్దరూ 8 ఎకరాల భూమిలో సేంద్రీయ కూరగాయలను పండిస్తున్నారు. వ్యవసాయ సమయంలో అతను సేంద్రీయ ఎరువులను ఉపయోగిస్తాడు.

Bijesh Pk1

ఇది కూడా చదవండి: Viral Video: హేయ్.. నాతో పెట్టుకోకు.. పులినే తరిమికొట్టిన కుక్క.. వీడియో వైరల్‌

ఎంత సంపాదిస్తున్నారు?

బిజేష్ ఇప్పుడు దుబాయ్ కి కూరగాయలతో పాటు పండ్లను పంపుతున్నానని చెప్పాడు. అతను ప్రతి వారం 2500 నుండి 3000 కిలోల పండ్లు, కూరగాయలను దుబాయ్ కి పంపుతున్నాడు. అతను కేరళ నుండి దుబాయ్ కి 24 గంటల్లో తాజా వస్తువులను పంపుతాడు. తన పండ్లు, కూరగాయలను విమానంలో దుబాయ్ కి పంపుతానని బిజేష్ చెప్పాడు. గత సంవత్సరం బిజేష్ కంపెనీ నేచర్ బీట్స్ మొత్తం ఆదాయం దాదాపు రూ. 2 కోట్లు.

ఇది కూడా చదవండి: Gold Price Today: తెలుగు రాష్ట్రాల్లో భగ్గుమంటున్న బంగారం ధరలు.. దుబాయ్‌, సౌదీలో ఎంతో తెలుసా?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి