Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Silver Price: అప్పటి వరకు వెండి ధర రూ.1 లక్ష దాటుతుందా..? కారణాలు ఇవే.. నిపుణులు ఏమంటున్నారు?

లోక్‌సభ ఎన్నికలకు ముందు దేశంలో వెండి ధరలు రోజురోజుకు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ప్రస్తుతం వెండి ధరలు తగ్గుముఖం పట్టినా రానున్న రోజుల్లో వెండి ధర లక్ష దాటుతుందని నిపుణులు చెబుతున్నారు. మరోసారి మార్చి నాటికి వెండి ధర రూ.లక్ష దాటే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నిపుణులు దీని వెనుక ఖచ్చితమైన కారణాలను కూడా చెబుతున్నారు..

Silver Price: అప్పటి వరకు వెండి ధర రూ.1 లక్ష దాటుతుందా..? కారణాలు ఇవే.. నిపుణులు ఏమంటున్నారు?
Silver
Subhash Goud
|

Updated on: Aug 02, 2024 | 2:49 PM

Share

లోక్‌సభ ఎన్నికలకు ముందు దేశంలో వెండి ధరలు రోజురోజుకు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ప్రస్తుతం వెండి ధరలు తగ్గుముఖం పట్టినా రానున్న రోజుల్లో వెండి ధర లక్ష దాటుతుందని నిపుణులు చెబుతున్నారు. మరోసారి మార్చి నాటికి వెండి ధర రూ.లక్ష దాటే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నిపుణులు దీని వెనుక ఖచ్చితమైన కారణాలను కూడా చెబుతున్నారు. వాస్తవానికి ఇటీవల చైనాతో సహా ప్రపంచంలోని అనేక దేశాలలో ఆర్థిక వ్యవస్థ వేగం మందగించింది. దీంతో పారిశ్రామికంగా వెండికి డిమాండ్ తగ్గడంతో పాటు వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. అయితే ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి.

వెండి ధర రూ.లక్ష దాటనుందా?

వెండికి పారిశ్రామిక డిమాండ్ మరోసారి పెరుగుతోందని కేడియా కమోడిటీస్ హెడ్ అజయ్ కేడియా చెప్పారు. అదే సమయంలో ఫెడరల్ రిజర్వ్ ఆఫ్ అమెరికా వచ్చే నెలలో పాలసీ వడ్డీ రేట్లను తగ్గించాలని సూచించింది. దీంతో వెండికి పారిశ్రామిక డిమాండ్ పెరుగుతుందని అంచనా. చైనా నుండి వెండికి పారిశ్రామిక డిమాండ్ మరోసారి పెరిగితే మార్చి 2025 నాటికి వెండి ధర కిలో రూ.1.10 లక్షలకు చేరవచ్చని చెబుతున్నారు. ఈ విధంగా చూస్తే, స్వల్పకాలంలో బంగారం కంటే వెండిపై రాబడి మెరుగ్గా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

వెండికి డిమాండ్ పెరుగుతుంది:

భారత్‌లో ఇప్పుడు ద్రవ్యోల్బణం అదుపులోకి రావడం ప్రారంభమైంది. అయినప్పటికీ ఆహార ద్రవ్యోల్బణం ఇంకా ఎక్కువగానే ఉంది. ఇది కాకుండా 2024-25 బడ్జెట్‌లో తయారీని ప్రోత్సహించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. రాబోయే కాలంలో దేశంలో ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్ల తయారీని ప్రోత్సహించడం వల్ల దేశీయ స్థాయిలో వెండికి పారిశ్రామిక డిమాండ్ పెరుగుతుంది.

ఇది మాత్రమే కాదు, మొబైల్ ఫోన్లు, సోలార్ ప్యానెల్లు, బ్యాటరీలు భారతదేశ బడ్జెట్‌లో చౌకగా మారాయి. దీంతో వారికి డిమాండ్ పెరుగుతుందని భావిస్తున్నారు. ఇది అంతిమంగా ప్రపంచ స్థాయిలో వెండికి పారిశ్రామిక డిమాండ్‌ను పెంచడంలో సహాయపడుతుంది. దీని కారణంగా రానున్న రోజుల్లో వెండి ధర వేగంగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

వెండి ధర:

ఆగస్టు 1న స్పాట్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.87,100గా ఉంది. ఇదిలా ఉంటే ఆగస్టు 2న మధ్యాహ్నం 2 గంటల సమయానికి కిలో వెండిపై స్వల్పంగా పెరిగింది. ముంబైలో కిలో వెండి ధర రూ.87,200, ఢిల్లీలో రూ.86,500, హైదరాబాద్‌లో రూ.91,000, చెన్నైలో రూ.91,000, బెంగలూరులో రూ.86,000.

ఇది కూడా చదవండి: Mukesh Ambani: ముఖేష్‌ అంబానీ ఎలాంటి ఆహారం తీసుకుంటారో తెలుసా? ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్‌!