AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RTI Report: రోడ్డు ప్రమాదాల క్లెయిమ్‌ల కేసులు ఎన్ని పెండింగ్‌లో ఉన్నాయో తెలిస్తే షాకవుతారు

దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాద కేసులు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. ప్రతిరోజూ అనేక రోడ్డు ప్రమాదాల్లో పాదచారుల మరణాలు లేదా గాయాలు నమోదవుతున్నాయి. భారతదేశంలో రోడ్డు ప్రమాదాలలో ప్రాణాలు కోల్పోయే, గాయపడిన వారికి బీమా పాలసీలలో క్లెయిమ్ ఇవ్వడానికి నిబంధన ఉంది. అయితే దీనికి సంబంధించి ఒక వార్త మిమ్మల్ని ఆశ్చర్యపరిచే విధంగా ఉంది. ఆర్‌టీఐ (RTI)..

RTI Report: రోడ్డు ప్రమాదాల క్లెయిమ్‌ల కేసులు ఎన్ని పెండింగ్‌లో ఉన్నాయో తెలిస్తే షాకవుతారు
Accident Claims
Subhash Goud
|

Updated on: May 27, 2024 | 8:26 PM

Share

దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాద కేసులు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. ప్రతిరోజూ అనేక రోడ్డు ప్రమాదాల్లో పాదచారుల మరణాలు లేదా గాయాలు నమోదవుతున్నాయి. భారతదేశంలో రోడ్డు ప్రమాదాలలో ప్రాణాలు కోల్పోయే, గాయపడిన వారికి బీమా పాలసీలలో క్లెయిమ్ ఇవ్వడానికి నిబంధన ఉంది. అయితే దీనికి సంబంధించి ఒక వార్త మిమ్మల్ని ఆశ్చర్యపరిచే విధంగా ఉంది. ఆర్‌టీఐ (RTI) కింద అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఐఆర్‌డీఏఐ (IRDAI) నుండి ఈ సమాచారం అందింది.

రూ.80,455 కోట్ల విలువైన 10.46 లక్షల రోడ్డు ప్రమాద క్లెయిమ్‌లు పెండింగ్‌లో..

దేశంలో రోడ్డు ప్రమాదాలకు సంబంధించి రూ.80,455 కోట్ల విలువైన 10,46,163 క్లెయిమ్‌లు పెండింగ్‌లో ఉన్నాయని నివేదికలు చెబుతున్నాయి. 2018-19 నుండి 2022-23 సంవత్సరాల మధ్య వారి సంఖ్యలో నిరంతర పెరుగుదల కనిపించింది. సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ) కింద దాఖలు చేసిన దరఖాస్తు ద్వారా ఈ సమాచారం అందింది. ఆర్టీఐ ప్రతిస్పందన ఆధారంగా క్లెయిమ్ సెటిల్‌మెట్లు నత్తనడకన కొనసాగుతున్నాయని ఆందోళన వ్యక్తం అవుతోంది. రోడ్డు ప్రమాద బాధితుడికి ఆర్థిక ఉపశమనం పొందడానికి సగటున నాలుగు సంవత్సరాలు పడుతుందని అంచనా వేశారు.

ఆర్టీఐ దాఖలు చేసింది ఎవరు? ఏప్రిల్‌లో సుప్రీంకోర్టు న్యాయవాది కెసి జైన్ దరఖాస్తుకు ప్రతిస్పందనగా బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్‌డిఎఐ) ఈ వివరాలను వెల్లడించింది. రాష్ట్రం, జిల్లాల వారీ వివరాలతో పాటు దేశంలో పెండింగ్‌లో ఉన్న మోటారు ప్రమాద క్లెయిమ్‌ల సంఖ్యను వెల్లడించడానికి కేసీ జైన్ దీన్ని చేశారు. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖను అడిగిన ప్రశ్నలో ఈ సమాచారం కోరింది.

గత ఐదేళ్లలో ప్రారంభించిన, సెటిల్ అయిన, బాకీ ఉన్న క్లెయిమ్‌ల వార్షిక వివరాలను ఆయన అడిగారు. దీనితో పాటు మోటారు ప్రమాదాల క్లెయిమ్‌ల త్వరిత పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వం ఏదైనా చొరవ తీసుకుంటుందా అనే సమాచారాన్ని కూడా కోరింది. ఆగ్రాకు చెందిన న్యాయవాది కెసి జైన్ గణాంకాలను ఉటంకిస్తూ, పెండింగ్‌లో ఉన్న క్లెయిమ్‌ల సంఖ్య సంవత్సరానికి పెరుగుతోంది. ఈ కారణంగా రోడ్డు ప్రమాదాల్లో మరణించిన, గాయపడిన వారిపై ఆధారపడిన వారి క్లెయిమ్‌ల పరిష్కారంలో కూడా జాప్యం జరుగుతోందని అన్నారు.

RDAI సమాచారం ప్రకారం (గత 5 సంవత్సరాల డేటా)

  • 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ. 52,713 కోట్ల విలువైన 9,09,166 క్లెయిమ్‌లు
  • 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.61,051 కోట్ల విలువైన 9,39,160 క్లెయిమ్‌లు
  • 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ. 70,722 కోట్ల విలువైన 10,08,332 క్లెయిమ్‌లు
  • 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ. 74,718 కోట్ల విలువైన 10,39,323 క్లెయిమ్‌లు
  • 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ. 80,455 కోట్ల విలువైన 10,46,163 క్లెయిమ్‌లు

ఐఆర్‌డీఏఐ ఈ సమాధానం ఇచ్చింది

ప్రాంతీయ స్థాయి సమాచారానికి సంబంధించి ఐఆర్‌డీఏఐ ‘జిల్లాల వారీగా, రాష్ట్రాల వారీగా మోటార్ థర్డ్ పార్టీ క్లెయిమ్‌ల వివరాలు ఐఆర్‌డీఏఐకి అందుబాటులో లేవు. ఎందుకంటే ఐఆర్‌డీఏఐ అటువంటి వివరణాత్మక సమాచారాన్ని పొందుపర్చదు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us