Reliance Electric Car: ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లోకి రిలయన్స్.. ఆ కంపెనీతో చర్చలు.. అంబానీ కొత్త ఎత్తుగడ

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ప్రస్తుతం టాటా మోటార్స్ ఇందులో ముందంజలో ఉంది. టెస్లా భారత మార్కెట్‌లోకి ప్రవేశించేందుకు సన్నాహాలు చేస్తోంది. టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ఈ నెల మూడో వారంలో భారత్‌కు రానున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని మస్క్ స్వయంగా ట్వీట్ చేశారు. ఇప్పుడు బిజినెస్ లైన్‌లోని..

Reliance Electric Car: ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లోకి రిలయన్స్.. ఆ కంపెనీతో చర్చలు.. అంబానీ కొత్త ఎత్తుగడ
Mukesh Ambani
Follow us

|

Updated on: Apr 12, 2024 | 7:12 PM

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ప్రస్తుతం టాటా మోటార్స్ ఇందులో ముందంజలో ఉంది. టెస్లా భారత మార్కెట్‌లోకి ప్రవేశించేందుకు సన్నాహాలు చేస్తోంది. టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ఈ నెల మూడో వారంలో భారత్‌కు రానున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని మస్క్ స్వయంగా ట్వీట్ చేశారు. ఇప్పుడు బిజినెస్ లైన్‌లోని ఒక నివేదిక ప్రకారం.. టెస్లా భారతదేశంలో ఒక ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేయడానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ సహాయం తీసుకోబోతోంది. బిజినెస్‌లైన్ ప్రకారం.. రిలయన్స్, టెస్లా ప్రతినిధుల మధ్య గత నెల రోజులుగా చర్చలు జరుగుతున్నాయి. గతేడాది ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు వెళ్లారు. ఆ సమయంలో మస్క్ మోడీని కలిశారు. భారత ప్రభుత్వం వారం రోజుల క్రితం ఎలక్ట్రిక్ వాహన విధానాన్ని ప్రకటించింది.

ఎలక్ట్రిక్ కార్లను ఉత్పత్తి చేయడానికి రెండు కంపెనీలు ఎలా కలిసి వస్తాయి.. వాటి జాయింట్ వెంచర్ ఏమిటి అనే సమాచారం వెల్లడి కాలేదు. రిలయన్స్ కూడా ఈ విషయాన్ని వెల్లడించలేదు. వెలువడుతున్న నివేదికల ప్రకారం చూస్తే.. రిలయన్స్ టెస్లా ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తిని నిర్వహించగలదు. సంబంధిత సౌకర్యాలను అందిస్తుంది.

2 నుండి 3 మిలియన్ డాలర్ల పెట్టుబడి

ఇవి కూడా చదవండి

టెస్లా బృందం భారత్‌లో పర్యటన నేపథ్యంలో ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ ప్లాంట్‌ ఎక్కడ ఏర్పాటు చేస్తారన్న విషయం ఆసక్తికరంగా ఉంది. అయితే ఈ నేపథ్యంలో దేశంలో 2 నుంచి 3 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు టెస్లా సిద్ధమవుతోంది. ఫైనాన్షియల్ టైమ్స్ ప్రకారం.. టెస్లా ఈ నెలలో భారతదేశానికి నిపుణుల బృందాన్ని పంపాలని యోచిస్తోంది. ఈ బృందం భారతదేశంలోని మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాలలో ప్రాజెక్ట్ కోసం అనువైన భూమి కోసం వెతుకుతోంది. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిని కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. దేశంలో పెట్రోలు, డీజిల్‌కు ప్రత్యామ్నాయం చూపే ప్రయోగం పెద్ద ఎత్తున జరుగుతోంది. వాటిలో భారతదేశం కనీసం 500 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టవలసి ఉంటుంది. అలాగే ఈ కంపెనీలు స్థానిక విక్రేతల నుండి వస్తువులను కొనుగోలు చేయాలి. అటువంటి కంపెనీలకు దిగుమతి సుంకంలో పెద్ద తగ్గింపు ఇవ్వనుంది.

లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ కార్లను తయారు చేసే టెస్లా జర్మనీలోని తన ప్లాంట్‌లో రైట్ హ్యాండ్ డ్రైవ్ కార్ల ఉత్పత్తిని ప్రారంభించింది. గ్లోబల్ న్యూస్ ఏజెన్సీ రాయిటర్స్ నివేదిక ప్రకారం.. టెస్లా ఎలక్ట్రిక్ కారు ఈ సంవత్సరం జర్మనీ నుండి భారతదేశంలోకి ప్రవేశిస్తుంది. అయితే భారతదేశంలో ఏ మోడల్ టెస్లా లాంచ్ చేయబడుతుందో వెల్లడించలేదు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్