Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Reliance Jio: 5జీ సేవల కోసం జియో దూకుడు.. అల్ట్రా-హై స్పీడ్ ఇంటర్నెట్‌ కోసం లక్ష టవర్లు

రిలయన్స్ జియో 5G నెట్‌వర్క్‌ను రోల్ అవుట్ చేయడానికి సన్నాహాలు వేగవంతం చేసింది. ప్రస్తుతం దేశంలోని అనేక ప్రాంతాల్లో దీని ట్రయల్ జరుగుతోంది. ఇప్పుడు కొత్త సమాచారం తెరపైకి..

Reliance Jio: 5జీ సేవల కోసం జియో దూకుడు.. అల్ట్రా-హై స్పీడ్ ఇంటర్నెట్‌ కోసం లక్ష టవర్లు
Jio 5g
Follow us
Subhash Goud

|

Updated on: Mar 25, 2023 | 8:46 PM

రిలయన్స్ జియో 5G నెట్‌వర్క్‌ను రోల్ అవుట్ చేయడానికి సన్నాహాలు వేగవంతం చేసింది. ప్రస్తుతం దేశంలోని అనేక ప్రాంతాల్లో దీని ట్రయల్ జరుగుతోంది. ఇప్పుడు కొత్త సమాచారం తెరపైకి వచ్చింది. టెలికాం శాఖ కొత్త డేటా ప్రకారం.. భారతదేశం వేగవంతమైన నెట్‌వర్క్‌ను అందించడానికి 5G టవర్స్‌ ఏర్పాటు అవుతున్నాయి. జియో 5జీ నెట్‌వర్క్‌ను రూపొందించడానికి అల్ట్రా-హై స్పీడ్ ఇంటర్నెట్‌ను అందించడానికి దాదాపు 1 లక్ష టెలికాం టవర్‌లను నిర్మించింది. ఇది దాని ఇతర టెలికాం కంపెనీ కంటే 5 రెట్లు ఎక్కువ.

డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ నేషనల్ EMF పోర్టల్ ప్రకారం, ముఖేష్ అంబానీ కంపెనీ రిలయన్స్ జియో తన స్వంత 700 MHz, 3,500 MHz ఫ్రీక్వెన్సీలలో 99,897 BTSని ఇన్‌స్టాల్ చేసింది. భారతి ఎయిర్‌టెల్‌కు చెందిన 22,219 బిటిఎస్‌లు ఇన్‌స్టాల్ చేసింది. అలాగే జియో ప్రతి బేస్ స్టేషన్‌లో 3 సెల్‌లను ఇన్‌స్టాల్ చేసింది. ఎయిర్‌టెల్‌ రెండు సెల్‌లను ఇన్‌స్టాల్ చేసింది. మరిన్ని టవర్లు, సెల్ సైట్‌లు అంటే నెట్‌వర్క్ వేగంగా ఉంటుంది.

జియో కోల్‌కతాలో 506.25 Mbps టాప్ యావరేజ్ 5G డౌన్‌లోడ్ స్పీడ్‌ను సాధించగా, ఎయిర్‌టెల్ ఢిల్లీలో 268.89 Mbps స్పీడ్‌ను సాధించింది. దేశంలోని అగ్రశ్రేణి టెలికాం కంపెనీలైన ఎయిర్‌టెల్‌, జియో 5Gని విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ట్రయల్స్ చేస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

భారతదేశం అర బిలియన్ కంటే ఎక్కువ ఇంటర్నెట్ వినియోగదారులను కలిగి ఉంది. ఇది ప్రపంచంలో రెండవ అతిపెద్ద మార్కెట్‌గా అవతరించింది. మొదటి స్థానంలో చైనా ఉంది. 5G అక్టోబర్ 2022లో ట్రయల్ కోసం ప్రారంభించబడింది. ఇది ప్రస్తుతం అనేక ప్రాంతాల్లో అమలు చేయబడుతోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి