RBI MPC Meeting: ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ సమావేశం.. ఆ విషయంలో కీలక నిర్ణయం తీసుకోనుందా..?

గత ఏడాది కాలంలో దేశంలో అన్ని రకాల రుణాలు ఖరీదైనవిగా మారాయి. అది హోమ్ లోన్ లేదా కార్ లోన్, పర్సనల్ లోన్ లేదా మరేదైనా ఈఎంఐ అయినా… ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఎక్కువ డబ్బు చెల్లించాలి. ఈ కారణంగా ప్రజలు చాలా కాలంగా ఉపశమనం కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఈ నిరీక్షణకు తెరపడనుంది. ఎందుకంటే ఈ విషయంలో నిర్ణయం తీసుకోవడానికి రిజర్వ్ బ్యాంక్ ముఖ్యమైన సమావేశం సోమవారం నుండి ప్రారంభం కానుంది. ప్రపంచ వ్యాప్తంగా […]

RBI MPC Meeting: ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ సమావేశం.. ఆ విషయంలో కీలక నిర్ణయం తీసుకోనుందా..?
RBI
Follow us

|

Updated on: Jun 04, 2023 | 9:15 PM

గత ఏడాది కాలంలో దేశంలో అన్ని రకాల రుణాలు ఖరీదైనవిగా మారాయి. అది హోమ్ లోన్ లేదా కార్ లోన్, పర్సనల్ లోన్ లేదా మరేదైనా ఈఎంఐ అయినా… ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఎక్కువ డబ్బు చెల్లించాలి. ఈ కారణంగా ప్రజలు చాలా కాలంగా ఉపశమనం కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఈ నిరీక్షణకు తెరపడనుంది. ఎందుకంటే ఈ విషయంలో నిర్ణయం తీసుకోవడానికి రిజర్వ్ బ్యాంక్ ముఖ్యమైన సమావేశం సోమవారం నుండి ప్రారంభం కానుంది.

ప్రపంచ వ్యాప్తంగా రికార్డు స్థాయికి చేరిన ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచేందుకు పూనుకున్నాయి. రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను వేగంగా పెంచింది. గత ఏడాది మేలో రిజర్వ్ బ్యాంక్ మానిటరీ పాలసీ కమిటీ అత్యవసర సమావేశాన్ని నిర్వహించి వడ్డీ రేట్లను పెంచడం ప్రారంభించింది. ఆ తర్వాత ఏడాది కాలంలో రెపో రేటు 2.50 శాతం పెరిగింది.

ఇప్పుడు పాలసీ రేటు

ద్రవ్యోల్బణాన్ని అరికట్టడానికి మే 2022 నుంచి నిరంతర పెరుగుదల కారణంగా, పాలసీ రేటు రెపో 2.5 శాతం పెరిగి ఫిబ్రవరి 2023లో 6.5 శాతానికి చేరుకుంది. ఆ తర్వాత రిజర్వ్ బ్యాంక్ మానిటరీ పాలసీ కమిటీ సమావేశం ఏప్రిల్ 2023లో జరిగింది. ఇది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎంపీసీ మొదటి సమావేశం. ఆ సమావేశంలో రెపో రేటును యథాతథంగా కొనసాగించాలని రిజర్వ్ బ్యాంక్ నిర్ణయించింది. ఈ విధంగా ఇప్పుడు రెపో రేటు 6.5 శాతం.

ఇవి కూడా చదవండి

రెపో రేటు స్థిరంగా ఉంటుందని అంచనా

PTI నివేదిక ప్రకారం.. ఏప్రిల్ నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గడం, మరింత ఉపశమనం పొందే అవకాశం ఉన్నందున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జూన్ 8న పాలసీ రేటు రెపోను 6.5 శాతంగా ఉంచవచ్చు. రిజర్వ్ బ్యాంక్ రేట్లను స్థిరంగా ఉంచినట్లయితే ద్రవ్యోల్బణ నియంత్రణకు ఇప్పుడు తీసుకున్న చర్యలు ప్రభావవంతంగా ఉన్నాయని రుజువు చేయవచ్చని నిపుణులు భావిస్తున్నారు. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ద్రవ్య విధాన కమిటీ సమావేశం మంగళవారం అంటే జూన్ 6 నుంచి ప్రారంభమవుతుంది. ఈ సమావేశం జూన్ 8 గురువారం వరకు కొనసాగుతుంది. సమావేశం అనంతరం ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నిర్ణయాలను గురువారం తెలియజేస్తారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీకి ఇది రెండో, 43వ సమావేశం.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.! రూ.349కే విమాన ప్రయాణం.!
విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.! రూ.349కే విమాన ప్రయాణం.!
14 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్న టెస్లా!
14 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్న టెస్లా!
అమెజాన్ 'బజార్' వచ్చేసింది.. ఇక్కడ అన్నీ చవక.. వీటికి పోటీగా..
అమెజాన్ 'బజార్' వచ్చేసింది.. ఇక్కడ అన్నీ చవక.. వీటికి పోటీగా..
ఈ టిప్స్ పాటిస్తే .. ఎంత ఎండలోనైనా ఊటీలో ఉన్నట్టే ఉంటుంది.
ఈ టిప్స్ పాటిస్తే .. ఎంత ఎండలోనైనా ఊటీలో ఉన్నట్టే ఉంటుంది.
తిరుమల వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.! ఏప్రిల్‌ 18న ఉదయం 10 గంటలకు
తిరుమల వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.! ఏప్రిల్‌ 18న ఉదయం 10 గంటలకు
లోన్ యాప్‌ల ఆగడాలకు చెక్ పెట్టడానికి డిజిటల్‌ అస్త్రం..
లోన్ యాప్‌ల ఆగడాలకు చెక్ పెట్టడానికి డిజిటల్‌ అస్త్రం..
'గ్లామర్‌ షో ఓకే.! కాని లిప్ కిస్ వద్దన్నారు మా నాన్న..!' వీడియో.
'గ్లామర్‌ షో ఓకే.! కాని లిప్ కిస్ వద్దన్నారు మా నాన్న..!' వీడియో.
ఇజ్రాయెల్‌కు ఇరాన్ సంచలన హెచ్చరిక.. ఆ ఆయుధాలు కూడా ప్రయోగిస్తాం.!
ఇజ్రాయెల్‌కు ఇరాన్ సంచలన హెచ్చరిక.. ఆ ఆయుధాలు కూడా ప్రయోగిస్తాం.!
అక్కే అన్నింటా తోడుగా.! వారసురాలితో ఇంటికి చేరుకున్న మనోజ్, మౌనిక
అక్కే అన్నింటా తోడుగా.! వారసురాలితో ఇంటికి చేరుకున్న మనోజ్, మౌనిక
హీరో అతనే .. విలనూ అతనే.! కంగువ నుంచి బిగ్ అప్డేట్..
హీరో అతనే .. విలనూ అతనే.! కంగువ నుంచి బిగ్ అప్డేట్..