AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సంక్షోభంలో యెస్ బ్యాంక్..విత్ డ్రాలపై ఆంక్షలు.. ఆందోళనలో కస్టమర్లు..!

యెస్ బ్యాంక్ సంక్షోభంలో పడిపోయింది. గతకొద్ది రోజుల నుంచి ఈ బ్యాంకు పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది. తాజాగా రిజర్వ్ బ్యాంకు విడుదల చేసిన ప్రకటనలో యెస్ బ్యాంకు పనితీరుపై.. అసంతృప్తిని వ్యక్తం చేసింది. అంతేకాదు.. ప్రస్తుతం యెస్ బ్యాంకు సంక్షోభంలో మునిగిపోయిందని పేర్కొనడంతో.. ఒక్కసారిగా డిపాజిటర్లు, ఇన్వెస్టర్లలో భయం నెలకొంది. ఈ విషయం తెలిసిన వెంటనే.. యెస్ బ్యాంకు కస్టమర్లంతా.. బ్యాంకులు, ఏటీఎంల వద్ద తమ డబ్బులు తీసుకునేందుకు బారులు తీరారు. అయితే కస్టమర్లంతా అకౌంట్లో ఉన్న […]

సంక్షోభంలో యెస్ బ్యాంక్..విత్ డ్రాలపై ఆంక్షలు.. ఆందోళనలో కస్టమర్లు..!
TV9 Telugu Digital Desk
|

Updated on: Mar 06, 2020 | 12:41 PM

Share

యెస్ బ్యాంక్ సంక్షోభంలో పడిపోయింది. గతకొద్ది రోజుల నుంచి ఈ బ్యాంకు పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది. తాజాగా రిజర్వ్ బ్యాంకు విడుదల చేసిన ప్రకటనలో యెస్ బ్యాంకు పనితీరుపై.. అసంతృప్తిని వ్యక్తం చేసింది. అంతేకాదు.. ప్రస్తుతం యెస్ బ్యాంకు సంక్షోభంలో మునిగిపోయిందని పేర్కొనడంతో.. ఒక్కసారిగా డిపాజిటర్లు, ఇన్వెస్టర్లలో భయం నెలకొంది. ఈ విషయం తెలిసిన వెంటనే.. యెస్ బ్యాంకు కస్టమర్లంతా.. బ్యాంకులు, ఏటీఎంల వద్ద తమ డబ్బులు తీసుకునేందుకు బారులు తీరారు. అయితే కస్టమర్లంతా అకౌంట్లో ఉన్న డబ్బులను విత్ డ్రా చేస్తుండటంతో.. ఆర్బీఐ పలు షరతులను విధించింది.

అకౌంట్ హోల్డర్లు అంతా ఒకే సారి డబ్బులు విత్ డ్రా చేస్తే.. మరింత సంక్షోభంలోకి బ్యాంకు వెళ్లాల్సి వస్తుందన్న ఉద్దేశంతో.. క్యాష్ విత్ డ్రాపై ఆంక్షలు విధించారు. ఏప్రిల్ 3వ తేదీ వరకు ఒక్క అకౌంట్ హోల్డర్.. కేవలం రూ. 50 వేలు వరకు మాత్రమే విత్ డ్రా చేసుకునేలా షరతులు విధించింది. అంతకు మించి విత్ డ్రా చేయాలనుకునే కస్టమర్.. తప్పనిసరిగా ఆర్బీఐ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. యెస్ బ్యాంక్‌లో ఉన్న సేవింగ్స్, కరెంట్ అకౌంట్ కస్టమర్లందరికీ ఈ కండిషన్స్ వర్తిస్తాయన ఆర్బీఐ తెలిపింది.

యెస్ బ్యాంక్ బోర్డును ఆర్బీఐ సస్పెండ్ చేయడంతో.. కస్టమర్లలో ఆందోళన రెట్టింపయ్యింది. ఈ బ్యాంకు నుంచి ఇక మీదట ఎలాంటి లోన్లు, రెన్యూవల్ చేయడం.. అలాగే ఇన్వెస్ట్‌మెంట్‌ పెట్టేందుకు కుదరదు. కస్టమర్లు అత్యవసర పరిస్థితుల్లో ఉన్నసమయంలో.. అనారోగ్యం, వివాహాల వంటి సమయాల్లో మాత్రమే కస్టమర్లకు రూ.5లక్షల వరకు ఇచ్చేందుకు ఆర్బీఐ అనుమతిచ్చింది. బ్యాంకు డిపాజిటర్లకు రిజర్వ్ బ్యాంకు పూర్తిస్థాయి నమ్మకాన్నిస్తుంది.

Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర