AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: ప్రయాణికులకు శుభవార్త! ఈ అన్ని రైల్వే స్టేషన్లలో టికెట్ల కోసం డిజిటల్‌ చెల్లింపు సదుపాయం

రైల్వే ప్రయాణికులకు శుభవార్త. ఇప్పుడు రైల్వే స్టేషన్లలో రైలు టిక్కెట్లు కొనుగోలు చేసేటప్పుడు ప్రయాణీకులు QR కోడ్ ద్వారా డిజిటల్‌గా ఛార్జీలను చెల్లించవచ్చు. పశ్చిమ రైల్వేలు గుజరాత్‌లోని రాజ్‌కోట్, భావ్‌నగర్ డివిజన్‌లలోని అన్ని స్టేషన్లలో QR కోడ్‌లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇక త్వరలో అన్ని స్టేషన్‌లలో ఈ విధానం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ కొత్త కార్యక్రమం కింద రాజ్‌కోట్ డివిజన్‌లోని..

Indian Railways: ప్రయాణికులకు శుభవార్త! ఈ అన్ని రైల్వే స్టేషన్లలో టికెట్ల కోసం డిజిటల్‌ చెల్లింపు సదుపాయం
మీరు ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లోని పీఎన్‌ఆర్‌ స్టేటస్ ఆప్షన్‌పై క్లిక్ చేయడం ద్వారా మీరు బుక్ చేసిన టికెట్ స్థితిని తనిఖీ చేయవచ్చు. ఇది కాకుండా పీఎన్‌ఆర్‌ నంబర్ సహాయంతో SMS ద్వారా టికెట్ కన్ఫర్మ్ అయిందా లేదా అనేది చూసుకోవచ్చు.
Subhash Goud
|

Updated on: Aug 12, 2024 | 8:44 AM

Share

రైల్వే ప్రయాణికులకు శుభవార్త. ఇప్పుడు రైల్వే స్టేషన్లలో రైలు టిక్కెట్లు కొనుగోలు చేసేటప్పుడు ప్రయాణీకులు QR కోడ్ ద్వారా డిజిటల్‌గా ఛార్జీలను చెల్లించవచ్చు. పశ్చిమ రైల్వేలు గుజరాత్‌లోని రాజ్‌కోట్, భావ్‌నగర్ డివిజన్‌లలోని అన్ని స్టేషన్లలో QR కోడ్‌లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇక త్వరలో అన్ని స్టేషన్‌లలో ఈ విధానం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ కొత్త కార్యక్రమం కింద రాజ్‌కోట్ డివిజన్‌లోని రాజ్‌కోట్, జామ్‌నగర్, సురేంద్రనగర్, ద్వారక సహా అన్ని చిన్న, పెద్ద స్టేషన్‌లలోని అన్ని రిజర్వ్‌డ్, అన్‌రిజర్వ్‌డ్‌ టికెట్ కౌంటర్లలో క్యూఆర్ కోడ్ ద్వారా రైల్వే టిక్కెట్‌ల చెల్లింపును అంగీకరించే సౌకర్యం కల్పించామని డివిజనల్ రైల్వే ప్రతినిధి తెలిపారు. డివిజనల్ రైల్వే మేనేజర్ అశ్వనీ కుమార్, భావ్‌నగర్ డివిజనల్ రైల్వే మేనేజర్ రవీష్ కుమార్ లు క్యూఆర్ కోడ్‌ని ఉపయోగించి టికెట్ ఛార్జీలను డిజిటల్‌గా చెల్లించాలని ప్రయాణికులను అభ్యర్థించారు.

భావ్‌నగర్ డివిజన్‌లోని భావ్‌నగర్ టెర్మినస్, బోటాడ్, గాంధీగ్రామ్, జునాగఢ్, పోర్ బందర్, వెరావల్‌తో సహా అన్ని చిన్న, పెద్ద స్టేషన్‌లలోని అన్ని రిజర్వ్ చేయబడిన, రిజర్వ్ చేయని టికెట్ కౌంటర్లలో QR కోడ్ ద్వారా రైల్వే టిక్కెట్‌ల చెల్లింపును అంగీకరించే సౌకర్యం అందించారు.

ఇది కూడా చదవండి: Hindenburg: హిండెన్‌బర్గ్ రీసెర్చ్ అంటే ఏమిటి ? దీని పనేంటి? దీని యజమాని ఎవరు?

రాజ్‌కోట్, భావ్‌నగర్ డివిజన్ డిజిటల్ చెల్లింపు పద్ధతులను ఉపయోగించి నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడానికి, ప్రయాణీకులకు సాఫీగా, మరింత సమర్థవంతమైన సేవలను అందించడానికి నిరంతరం కృషి చేస్తున్నాయి. డివిజన్‌లోని రిజర్వేషన్ కార్యాలయం, బుకింగ్ కార్యాలయం అన్ని కౌంటర్లలో QR కోడ్ పరికరాలు అమర్చారు. రైల్వే ప్రయాణికులు టిక్కెట్‌ ఛార్జీలు చెల్లించేందుకు క్యూఆర్‌ కోడ్‌ డిజిటల్‌ మాధ్యమం సౌకర్యం కల్పిస్తున్నారు.

రైల్వే ప్రయాణికులు ఇప్పటికే యూటీఎస్‌ మొబైల్ యాప్, ATVM, POS, UPI వంటి వివిధ డిజిటల్ చెల్లింపు ఎంపికలను టిక్కెట్ ఛార్జీని చెల్లించడానికి అందుబాటులో ఉన్నాయి. ఈ రకమైన డిజిటల్ చెల్లింపు వ్యవస్థను మరింత ఉపయోగకరంగా, సాఫీగా మార్చే లక్ష్యంతో, రాజ్‌కోట్ డివిజన్ దీనిని విస్తరించింది. ఈ కొత్త డిజిటల్ చెల్లింపు విధానం ఇప్పుడు క్యూఆర్ కోడ్ ద్వారా టిక్కెట్ ఛార్జీలు చెల్లించడానికి ప్రయాణీకులకు మరింత సౌలభ్యాన్ని అందిస్తుంది. దీని ద్వారా ఏ ప్రయాణీకుడైనా తన టికెట్ ఛార్జీలను సజావుగా, ఎలాంటి ఇబ్బంది లేకుండా చెల్లించవచ్చు.

ఇది కూడా చదవండి: Gold Price Today: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్‌.. తగ్గిన బంగారం, వెండి ధరలు

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి