Post office: నెలకు రూ. 10 వేలతో రూ. 16 లక్షలు పొందే అవకాశం.. పోస్టాఫీస్ నుంచి అదిరిపోయే స్కీమ్.
డబ్బు పొదుపు చేయాలనుకునే వారి కోసం బ్యాంకులు ఎన్నో రకాల స్కీమ్లను తీసుకొస్తున్నాయి. అయితే బ్యాంకులతో పాటు పోస్టాఫీస్ కూడా పలు ఆకర్షణీయమైన పథకాలతో వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలోనే..
డబ్బు పొదుపు చేయాలనుకునే వారి కోసం బ్యాంకులు ఎన్నో రకాల స్కీమ్లను తీసుకొస్తున్నాయి. అయితే బ్యాంకులతో పాటు పోస్టాఫీస్ కూడా పలు ఆకర్షణీయమైన పథకాలతో వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలోనే పోస్టాఫీస్ అందిస్తోన్న అదిరిపోయే స్కీమ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పోస్ట్ ఆషీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్ పేరుతో అందుబాటులో ఉన్న ఈ పథకం ద్వారా రూ. 100 నుంచి పెట్టుబడి పెట్టొచ్చు. గరిష్టంగా ఎలాంటి లిమిట్ లేదు. ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుంచి పోస్టాఫీసు ఆర్డీ ఏడాదికి 5.8 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది. ఈ వడ్డీలో మార్పు త్రైమాసిక ప్రాతిపదికన ఉంటుంది.
ఎలాంటి రిస్క్ లేని పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ (పీఓఆర్డీ) ఐదు సంవత్సరాల మెచ్యూరిటీని కలిగి ఉంది. 5 సంవత్సరాలకు ఒకసారి పొడిగించవచ్చు. ఎవరైనా ముందుగా ఆర్డీని క్లోజ్ చేయాలనుకుంటే.. మూడేళ్ల తర్వాత క్లోజ్ చేసుకోవచ్చు. సింగిల్గానే కాకుండా, ముగ్గురు వరకు ఉమ్మడి ఖాతా తెరవవచ్చు. మైనర్ కోసం గార్డియన్ ఖాతాను తెరవవచ్చు.
ఈ పథకం ద్వారా నెలకు రూ. 10 వేలు జమ చేస్తే ఎంత ఫండ్ వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక వ్యక్తి నెలకు రూ. 10 వేలు జమ చేసుకుంటూ వెళ్తే.. ఐదేళ్ల తరువాత మీకు రూ.6,96,968 రిటర్న్ లభిస్తుంది. ఇందులో మీరు రూ. 6 లక్షలు పెట్టుబడి పెడితే, వడ్డీ ద్వారా రూ. 96,968 లభిస్తుంది. అదే విధంగా ఈ స్కీమ్ను మరో ఐదేళ్లు పొడగితస్తే.. రూ. 16,26,476 గ్యారంటీ ఫండ్ లభిస్తుంది. అంటే మీరు రూ. 12 లక్షలు పెట్టుబడి పెడితే వడ్డీ ద్వారా రూ. 4,26,476 లభిస్తుంది. నెలకు రూ. 10 వేలు జమ చేస్తూ వెళితే.. పదేళ్ల తర్వాత మీకు వచ్చే మొత్తం రూ. 16,26,476 గా ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..