PNB: ఆ బ్యాంక్ కస్టమర్లకు షాక్.. ఇక చార్జీల మోతే..

మన దేశంలో టాప్ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్‌బీ) తన కస్టమర్లకు కీలక అప్ డేట్ ఇచ్చింది. తన బ్యాంకులో సేవింగ్స్ ఖాతాలపై సర్వీస్ చార్జీలకు సంబంధించి కొన్ని మార్పులను ప్రకటించింది. ఈ మార్పులు అక్టోబర్ 1 నుంచి అమలులోకి వస్తాయని బ్యాంకు ప్రకటించింది.

PNB: ఆ బ్యాంక్ కస్టమర్లకు షాక్.. ఇక చార్జీల మోతే..
Punjab National Bank
Follow us

|

Updated on: Sep 08, 2024 | 4:15 PM

మన దేశంలో టాప్ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్‌బీ) తన కస్టమర్లకు కీలక అప్ డేట్ ఇచ్చింది. తన బ్యాంకులో సేవింగ్స్ ఖాతాలపై సర్వీస్ చార్జీలకు సంబంధించి కొన్ని మార్పులను ప్రకటించింది. ఈ మార్పులు అక్టోబర్ 1 నుంచి అమలులోకి వస్తాయని బ్యాంకు ప్రకటించింది. బ్యాంకు చేసిన మార్పులు లేంటి? ఖాతాదారులకు షాక్ ఇచ్చిందా? వెసులబాటు కల్పించిందా? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు అందిస్తున్నాం.

చార్జీల్లో మార్పులు ఇవే..

పంజాబ్ నేషనల్ బ్యాంకు అందించిన సమాచారం ప్రకారం, బ్యాంకులోని సేవింగ్స్ ఖాతాలపై కనీస సగటు బ్యాలెన్స్, డిమాండ్ డ్రాఫ్ట్‌లు జారీ చేయడం, డూప్లికేటింగ్ డీడీలు, చెక్కులు (ఈసీఎస్ తో సహా), రిటర్న్ ఖర్చులు, లాకర్ అద్దె ఛార్జీలకు సంబంధించి మార్పులు చేసింది. సేవింగ్స్ ఖాతాలో నిర్ణీత కనీస మొత్తం లేకుంటే, బ్యాంకు నెలవారీగా పెనాల్టీ వసూలు చేయడం ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఇది ఇప్పటి వరకూ మూడు నెలలకు ఒకసారి ఉండేది. దీనిని ఇప్పుడు ప్రతి నెలా పర్యవేక్షించి, కనీస మొత్తం బ్యాలెన్స్ లేకపోతే ప్రతి నెలా చార్జీలు వసూలు చేస్తుంది.

కనీస బ్యాలెన్స్ అవసరం..

పీఎన్బీలోని సేవింగ్స్ ఖాతాలో కనీస బ్యాలెన్స్ ఉంచాల్సిన అవసరం ఉంది. ఇది ఇప్పటి వరకూ ప్రతి మూడు నెలలకు ఒకసారి లెక్కిస్తోంది. దాని పరిమితులు ఇలా ఉన్నాయి.

  • గ్రామీణ పరిధిలో- రూ. 500
  • సెమీ అర్బన్ పరిధిలో- రూ. 1000
  • అర్బన్, మెట్రో సిటీ పరిధిలో- రూ. 2000

ప్రతి నెల సగటు బ్యాలెన్స్..

  • గ్రామీణ పరిధిలో- రూ. 500
  • సెమీ అర్బన్ పరిధిలో- రూ. 1000
  • అర్బన్, మెట్రో సిటీ పరిధిలో- రూ. 2000

చార్జీలు ఇలా..

బ్యాంకు వద్ద అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం త్రైమాసిక సగటు బ్యాలెన్స్ 50 శాతం తగ్గితే వినియోగదారుడు గ్రామీణ ప్రాంతాల్లో రూ. 50, సెమీ అర్బన్‌లో రూ. 100, సిటీ, మెట్రో పరిధిలో రూ. 150 వసూలు చేస్తారు. కనీస మొత్తం 50 శాతం కంటే తక్కువగా ఉంటే, రూరల్‌లో రూ.100, సెమీ అర్బన్‌లో రూ.150, అర్బన్, మెట్రోలో రూ.250 చెల్లించాలి. ఒకవేళ అది 50 శాతానికి మించి ఉన్నా.. ఖాతా కనీస సగటు తక్కువగా ఉంటే, ఛార్జీలు తదనుగుణంగా పెరుగుతాయి. పరిమితి తర్వాత సగటు మొత్తం 6 శాతం తగ్గితే, గ్రామీణ ప్రాంత బ్యాంక్ హోల్డర్ కనీస ఛార్జీ రూ. 1, గరిష్టంగా రూ. 30 చెల్లించాలి. సెమీ-అర్బన్ అయితే వారికి రూ. 1 చొప్పున వసూలు చేస్తారు. గరిష్టంగా రూ. 60 ఉంటుంది. పట్టణ, మెట్రో నగరాలకు, కనీస రుసుము మళ్లీ రూ. 1, గరిష్టంగా రూ. 100, అది 5 శాతం కంటే తక్కువగా ఉంటుంది.

డిమాండ్ డ్రాఫ్ట్..

రివిజన్ ప్రకారం, డీడీ మొత్తంలో 0.40 శాతం కనిష్టంగా రూ. 50, గరిష్టంగా రూ. 15,000 వసూలు చేస్తారు. రూ.50,000 కంటే తక్కువ నగదు డిపాజిట్లపై సాధారణ రేట్ల కంటే 50 శాతం అధికంగా వసూలు చేస్తారు. రిటర్న్‌లను తనిఖీ చేసిన తర్వాత పొదుపు ఖాతాలో తక్కువ బ్యాలెన్స్ ఉంటే చెక్కును తిరిగి ఇచ్చినందుకు హోల్డర్‌కు రూ. 300 ఛార్జ్ చేస్తారు. ఒక ఆర్థిక సంవత్సరంలో, తిరిగి వచ్చిన మొదటి మూడు చెక్కులలో రూ. 300 ఇవ్వాలి, నాల్గో రిటర్న్ నాటికి వినియోగదారు నుంచి రూ. 1000 వసూలు చేస్తారు.

లాకర్ అద్దె..

గ్రామీణ ప్రాంతాల్లో చిన్న లాకర్లకు రూ. 1000, సెమీ అర్బన్‌కు రూ. 1250, అర్బన్, మెట్రోకు రూ. 2000. మీడియం లాకర్‌కు గ్రామీణ ప్రాంతాల్లో రూ. 2200, సెమీ అర్బన్‌లో రూ. 2500, పట్టణ ప్రాంతాల్లో రూ. 3500 వసూలు చేస్తారు. పెద్ద లాకర్లకు గ్రామీణ ప్రాంతాల్లో రూ. 2500, సెమీ అర్బన్‌లో రూ. 3000, మెట్రో ప్రాంతాల్లో రూ. 5000 చార్జ్ చేస్తారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..