AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SBI: ఖాతాదారులను హెచ్చరించిన ఎస్‌బీఐ.. ఆ మెసేజ్‌లతో జాగ్రత్త అంటూ..

ప్రస్తుతం సైబర్‌ నేరాలు పెరిగిపోతున్నాయి. ప్రజల అత్యాశను, తెలియని తనాన్ని ఆసరాగా చేసుకొని కొందరు మోసాలకు పాల్పడుతున్నారు. దీంతో దేశంలో రోజురోజుకీ సైబర్‌ నేరాల బారిన పడుతోన్న వారి సంఖ్య పెరుగుతోంది. ప్రపంచంలో ఎక్కడో కూర్చొని మన ఖాతాల్లోని డబ్బులను కాజేస్తున్నారు కేటుగాళ్లు. ముఖ్యంగా నకిలీ మెసేజ్‌ల ద్వారా ఖాతాలను...

SBI: ఖాతాదారులను హెచ్చరించిన ఎస్‌బీఐ.. ఆ మెసేజ్‌లతో జాగ్రత్త అంటూ..
SBI
Narender Vaitla
|

Updated on: Sep 08, 2024 | 8:49 PM

Share

ప్రస్తుతం సైబర్‌ నేరాలు పెరిగిపోతున్నాయి. ప్రజల అత్యాశను, తెలియని తనాన్ని ఆసరాగా చేసుకొని కొందరు మోసాలకు పాల్పడుతున్నారు. దీంతో దేశంలో రోజురోజుకీ సైబర్‌ నేరాల బారిన పడుతోన్న వారి సంఖ్య పెరుగుతోంది. ప్రపంచంలో ఎక్కడో కూర్చొని మన ఖాతాల్లోని డబ్బులను కాజేస్తున్నారు కేటుగాళ్లు. ముఖ్యంగా నకిలీ మెసేజ్‌ల ద్వారా ఖాతాలను హ్యాక్‌ చేస్తూ డబ్బులు కాజేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఓ రకమైన మోసం వెలుగులోకి వచ్చింది. ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్‌ ఎస్‌బీఐ తమ ఖాతాదారులను అలర్ట్‌ చేసింది.

నకిలీ మెసేజ్‌ల ద్వారా ఖాతాల నుంచి డబ్బులు విత్‌డ్రా అవుతున్నట్లు అధికారులు హెచ్చరిస్తున్నారు. ఎస్‌బీఐ పేరితో వచ్చే ఫేక్ మెసేజ్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం జారీ చేసిన సలహాలో పేర్కొంది. గత కొన్ని రోజుల నుంచి రివార్డ్‌ పాయింట్ల పేరుతో ఓ మోసం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఎస్‌బీఐ పేరుతో రివార్డులను క్లైమ్‌ చేసుకోవాలంటూ కొందరు సైబర్‌ నేరస్థులు నకిలీ మెసేజ్‌లను సర్క్కూలేట్ చేశారు. వీటిని ఓపెన్‌ చేసి, వ్యక్తిగత వివరాలు అందజేసి మోసపోయి కేసులు ఇటీవల చాలా వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ విషయమై ఎస్‌బీఐ ఖాతాదారులను అలర్ట్ చేసింది. ఈమెయిల్స్‌, మెసేజ్‌లతో పాటు సోషల్‌ మీడియాలో రివార్డ్స్‌ పాయింట్స్‌ పేరిట వస్తున్న ఫ్రాడ్‌ మెసేజ్‌లతో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

ఎస్‌బీఐ నెట్‌ బ్యాంకింగ్ రివార్డ్‌ పాయింట్ పేరుతో ఓ మెసేజ్‌ వైరల్ అవుతోంది. ఈ మెసేజ్‌ ప్రకారం రూ. 9980 విలువైన పాయింట్లను రీడిమ్‌ చేసుకోవాలని సందేశంలో పేర్కొంటున్నారు. అయితే ఈ పాయింట్స్‌ను రీడిమ్‌ చేసుకోవాలంటే ఒక ఏపీకే ఫైల్‌ను డౌనల్‌లోడ్‌ చేసుకోవాలని సూచిసత్ఉన్నారు. అయితే ఈ ఏపీకే ఫైల్‌ను పొరపాటున డౌన్‌లోడ్‌ చేశారో ఇక మీ ఫోన్‌ సైబర్‌ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లడం ఖాయం. దీంతో ఈ ఫోన్‌లో ఉన్న డేటా మొత్తం వారి చేతుల్లోకి వెళ్లిపోతాయి.

దీంతో మీ ఓటీపీలను సైబర్ నేరస్థులు యాక్సెస్‌ చేస్తారు. వాట్సాప్‌లో కూడా ఇలాంటి మెసేజ్‌లు వస్తున్నాయని వీటిపట్ల జాగ్రత్తగా ఉండాలని ఎస్‌బీఐ ఓ ప్రకటనలో తెలిపింది. చూశారుగా ఉచితంగా రివార్డ్‌ పాయింట్స్‌ వస్తున్నాయని క్లిక్‌ చేశారో ఇక మీ పని అంతే అవుతుంది. రివార్డ్‌ పాయింట్లకు సంబంధించి ఎస్‌బీఐ అధికారిక యాప్‌నే విశ్వసించాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
తిరుమల శ్రీవారి భక్తులకు రైల్వేశాఖ మరో గుడ్ న్యూస్
తిరుమల శ్రీవారి భక్తులకు రైల్వేశాఖ మరో గుడ్ న్యూస్
తక్కువ ఖర్చుతో ఇంట్లోనే పచ్చి మిర్చి ఇలా పెంచితే బుట్టలు బుట్టలు
తక్కువ ఖర్చుతో ఇంట్లోనే పచ్చి మిర్చి ఇలా పెంచితే బుట్టలు బుట్టలు
చేతబడి వికటిస్తే.. మూడు ఓటీటీల్లోకి వచ్చేసిన సూపర్ హిట్ సినిమా
చేతబడి వికటిస్తే.. మూడు ఓటీటీల్లోకి వచ్చేసిన సూపర్ హిట్ సినిమా
ఒకే రైళ్లో ప్రయాణిస్తూ భారతదేశం మొత్తం చుట్టేయాలని ఉందా? మీ కోసమే
ఒకే రైళ్లో ప్రయాణిస్తూ భారతదేశం మొత్తం చుట్టేయాలని ఉందా? మీ కోసమే
పూల్వామా దాడి సూత్రధారి హతం..
పూల్వామా దాడి సూత్రధారి హతం..
వయస్సొచ్చిన అమ్మాయిలకు సూపర్ ఫుడ్.. ఇలా చేశారంటే అద్భుతమే..
వయస్సొచ్చిన అమ్మాయిలకు సూపర్ ఫుడ్.. ఇలా చేశారంటే అద్భుతమే..
స్టార్ కమెడియన్ కూతురు.. చిరంజీవితో బ్లాక్ బస్టర్ హిట్స్..
స్టార్ కమెడియన్ కూతురు.. చిరంజీవితో బ్లాక్ బస్టర్ హిట్స్..
గడ్డం పెంచుకుంటే ఇన్ని లాభాలా..? ఇది తెలిస్తే షేవింగ్‌కు గుడ్‌బై
గడ్డం పెంచుకుంటే ఇన్ని లాభాలా..? ఇది తెలిస్తే షేవింగ్‌కు గుడ్‌బై
మెగా 158 ప్రారంభం.. చిరంజీవి కూతురిగా ఆ క్రేజీ హీరోయిన్ ఫిక్స్
మెగా 158 ప్రారంభం.. చిరంజీవి కూతురిగా ఆ క్రేజీ హీరోయిన్ ఫిక్స్
రోహిత్ శర్మ 2027 వరల్డ్ కప్ డ్రీమ్‌కు బ్రేక్?
రోహిత్ శర్మ 2027 వరల్డ్ కప్ డ్రీమ్‌కు బ్రేక్?