AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PPF, SSY, NPS ఖాతాదారులకు బిగ్‌ అలర్ట్‌! మార్చి 31లోపు ఇలా చేయకుంటే నష్టపోతారు!

ఆర్థిక సంవత్సరం 2025-26 ముగిసేలోపు, అంటే మార్చి 31, 2026 నాటికి PPF, సుకన్య సమృద్ధి యోజన (SSY), NPS ఖాతాదారులు కనీస డిపాజిట్లు చేశారో లేదో తనిఖీ చేసుకోవాలి. అలా చేయకపోతే ఖాతాలు నిష్క్రియం కావడమే కాకుండా, పన్ను ప్రయోజనాలు కోల్పోయి, జరిమానాలు చెల్లించాల్సి ఉంటుంది.

PPF, SSY, NPS ఖాతాదారులకు బిగ్‌ అలర్ట్‌! మార్చి 31లోపు ఇలా చేయకుంటే నష్టపోతారు!
Gratuity
SN Pasha
|

Updated on: Mar 09, 2026 | 10:27 PM

Share

ఆర్థిక సంవత్సరం 2025–26 మార్చి 31తో ముగియనున్న నేపథ్యంలో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), సుకన్య సమృద్ధి యోజన (SSY), నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) ఖాతాదారులు తమ ఖాతాల్లో కనీస డిపాజిట్ చేసినట్లున్నారా లేదా అనేది తప్పనిసరిగా పరిశీలించుకోవాల్సిన సమయం వచ్చింది. కనీస డిపాజిట్ చేయకుండా గడువు ముగిస్తే ఖాతాలు నిష్క్రియంగా మారే ప్రమాదం ఉంది. అంతేకాదు పన్ను ప్రయోజనాలు కూడా ప్రభావితమయ్యే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఆడపిల్లల భవిష్యత్తు కోసం రూపొందించిన సుకన్య సమృద్ధి యోజన (SSY)లో ప్రతి ఆర్థిక సంవత్సరానికి కనీసం రూ.250 జమ చేయాలి. ఈ మొత్తాన్ని జమ చేయకపోతే ఖాతా డిఫాల్ట్‌గా మారుతుంది. అటువంటి ఖాతాను తిరిగి యాక్టివ్ చేయాలంటే ప్రతి డిఫాల్ట్ సంవత్సరానికి రూ.50 జరిమానాతో పాటు కనీస డిపాజిట్ రూ.250 చెల్లించాల్సి ఉంటుంది. ఇక పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) ఖాతాలో ప్రతి ఏడాది కనీసం రూ.500 జమ చేయాలి. ఈ మొత్తాన్ని జమ చేయకపోతే ఖాతా నిష్క్రియంగా మారుతుంది. నిష్క్రియమైన PPF ఖాతాల నుంచి రుణాలు తీసుకోవడం లేదా ఉపసంహరణలు చేయడం సాధ్యం కాదు. అయితే ప్రతి డిఫాల్ట్ సంవత్సరానికి రూ.50 జరిమానాతో పాటు రూ.500 కనీస డిపాజిట్ చెల్లిస్తే ఖాతాను మళ్లీ సక్రియం చేసుకోవచ్చు. అంటే ప్రతి సంవత్సరం రూ.550 చెల్లించాల్సి ఉంటుంది.

పదవీ విరమణ కోసం చాలా మంది పెట్టుబడిదారులు నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS)ను వినియోగిస్తున్నారు. పాత పన్ను విధానం ప్రకారం రూ.1.5 లక్షల వరకు పెట్టుబడులకు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద మినహాయింపు లభిస్తుంది. అదనంగా సెక్షన్ 80CCD(1B) కింద మరో రూ.50 వేల వరకు అదనపు మినహాయింపు పొందే అవకాశం ఉంది. అందువల్ల PPF, SSY, NPS ఖాతాదారులు మార్చి 31, 2026లోపు తమ కనీస డిపాజిట్లు చేసినట్లుగా నిర్ధారించుకోవడం చాలా అవసరం. ఇలా చేయడం ద్వారా ఖాతాలు చురుకుగా ఉండటంతో పాటు పన్ను ప్రయోజనాలను కొనసాగించవచ్చు. అలాగే జరిమానాలు తప్పించుకోవచ్చు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us