PM Awas Yojana: 2022-23 పీఎం ఆవాస్ యోజన జాబితా విడుదల.. మీ పేరును తనిఖీ చేయండిలా

ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద ప్రభుత్వం ఇళ్లు నిర్మించుకోవడానికి ప్రజలకు రుణాలపై సబ్సిడీ ఇస్తుంది. అయితే ఈ రుణాలపై సంబంధిత బ్యాంకు కూడా మీ నుండి ఈఎంఐని క్రమం తప్పకుండా..

PM Awas Yojana: 2022-23 పీఎం ఆవాస్ యోజన జాబితా విడుదల.. మీ పేరును తనిఖీ చేయండిలా
Pm Awas Yojana
Follow us

|

Updated on: Dec 02, 2022 | 8:55 PM

ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద ప్రభుత్వం ఇళ్లు నిర్మించుకోవడానికి ప్రజలకు రుణాలపై సబ్సిడీ ఇస్తుంది. అయితే ఈ రుణాలపై సంబంధిత బ్యాంకు కూడా మీ నుండి ఈఎంఐని క్రమం తప్పకుండా వసూలు చేస్తుంది. కానీ మీకు సబ్సిడీ లభించదు. చాలా సార్లు ఒకే ప్లాట్‌లో నిర్మించిన రెండు వేర్వేరు ఇళ్లలో ఒకటి సబ్సిడీ మాత్రమే వస్తుంది. అటువంటి పరిస్థితిలో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన దరఖాస్తు స్థితనిఇ తనిఖీ చేయడం చాలా ముఖ్యం.

స్థితిని ఎలా తనిఖీ చేయాలి?

మీరు కూడా పీఎం ఆవాస్ యోజన కోసం దరఖాస్తు చేసుకున్నట్లయితే మీరు దరఖాస్తు స్థితిని ఆన్‌లైన్‌లో తనిఖీ చేయవచ్చు.

➦ ముందుగా ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి.

ఇవి కూడా చదవండి

➦ ఇక్కడ ‘సిటిజన్ అసెస్‌మెంట్’ ఎంపిక అందుబాటులో ఉంటుంది. దీనిపై క్లిక్ చేయండి.

➦ కొత్త పేజీ తెరవబడుతుంది. దానిపై ‘ట్రాక్ యువర్ అసెస్‌మెంట్ స్టేటస్’ ఆప్షన్‌ను ఎంచుకోండి. దీనిపై క్లిక్ చేయండి.

➦ దీని తర్వాత రిజిస్ట్రేషన్ నంబర్‌ను పూరించండి. స్థితిని తనిఖీ చేయడానికి కోరిన సమాచారాన్ని ఇవ్వండి.

➦ దీని తర్వాత రాష్ట్రం, జిల్లా, నగరాన్ని ఎంచుకోని సమర్పించండి. మీ అప్లికేషన్ స్థితి మీ స్క్రీన్‌పై ఉంటుంది.

PM ఆవాస్ యోజన కోసం ఎలా దరఖాస్తు చేయాలి

➦ ముందుగా అధికారిక వెబ్‌సైట్ pmaymis.gov.inకి వెళ్లండి

➦ సిటిజన్ అసెస్‌మెంట్’పై క్లిక్ చేయండి.

➦ ఇక్కడ మీకు అనేక ఆప్షన్స్‌ కనిపిస్తాయి. మీకు సంబంధించిన దానిని ఎంచుకోండి.

➦ దీని తర్వాత మీరు ఆధార్ నంబర్‌ను పూరించి చెక్‌పై క్లిక్ చేయాలి.

➦ దీని తర్వాత ఆన్‌లైన్ ఫారమ్ ఓపెన్ అవుతుంది.

➦ ఈ ఫారమ్‌లో కోరిన సమాచారాన్ని పూరించండి.

➦ దరఖాస్తును పూరించిన తర్వాత పూర్తి సమాచారాన్ని మరోసారి చదవండి. మీరు సంతృప్తి చెందిన తర్వాత సమర్పించండి.

➦ సమర్పించిన తర్వాత, మీ స్క్రీన్‌పై అప్లికేషన్ నంబర్ ప్రదర్శించబడుతుంది. దాని నుండి ప్రింట్ తీసి దగ్గర ఉంచుకోండి.

ఈ పథకం యొక్క ప్రయోజనం ఎవరికి లభిస్తుంది?

ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన కింద మూడు లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్న ఎవరైనా ఇల్లు లేని వారు దీనిని సద్వినియోగం చేసుకోవచ్చు. ఇందుకోసం రూ.2.50 లక్షల సాయం అందిస్తారు. ఇందులో మూడు విడతలుగా డబ్బులు ఇస్తారు. మొదటి విడతగా 50 వేలు. రెండో విడత 1.50 లక్షలు, మూడో విడతగా 50 వేలు ఇస్తారు. రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 2.50 లక్షల రూపాయలలో 1 లక్ష ఇస్తుంది. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం 1.50 లక్షలు మంజూరు చేస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి