AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PF Aadhar Scam: పీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్‌.. నకిలీ ఆధార్‌లు సృష్టించి ఖాతాల నుంచి రూ.1.83 కోట్లు స్వాహా

ప్రైవేట్ రంగంలో పనిచేసే వారికి, ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్‌) సామాజిక భద్రతకు ప్రధాన ఆధారం. అత్యవసర పరిస్థితుల్లో అవసరమైనప్పుడు ఇది కొన్నిసార్లు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది కాకుండా, పదవీ విరమణ తర్వాత జీవితం కూడా దాని నుంచి భద్రతను పొందుతుంది. అయితే మీ..

PF Aadhar Scam: పీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్‌.. నకిలీ ఆధార్‌లు సృష్టించి ఖాతాల నుంచి రూ.1.83 కోట్లు స్వాహా
Pf Aadhar Scam
Subhash Goud
|

Updated on: Jun 13, 2023 | 4:26 PM

Share

ప్రైవేట్ రంగంలో పనిచేసే వారికి, ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్‌) సామాజిక భద్రతకు ప్రధాన ఆధారం. అత్యవసర పరిస్థితుల్లో అవసరమైనప్పుడు ఇది కొన్నిసార్లు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది కాకుండా, పదవీ విరమణ తర్వాత జీవితం కూడా దాని నుంచి భద్రతను పొందుతుంది. అయితే మీ పీఎఫ్ ఖాతాను ఎవరైనా ఖాళీ చేస్తే? సమస్యల్లో చిక్కుకున్నట్లే. తాజాగా దీనికి సంబంధించిన ఒక ఉదంతం తెరపైకి వచ్చింది. ఇది తెలిసిన తర్వాత మీరు ఆశ్చర్యపోతారు. ఈ కేసులో ఆధార్ కార్డుకు సంబంధించిన సమాచారాన్ని తారుమారు చేసి ఇతరుల పీఎఫ్ ఖాతాల నుంచి డబ్బులు డ్రా చేసే వ్యక్తిని సీబీఐ అరెస్ట్ చేసింది. అరెస్టయిన వ్యక్తి తన సహచరులతో కలిసి ఈ విధంగా కోట్లాది రూపాయలను విత్‌డ్రా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

సీబీఐ అధికారులను ఉటంకిస్తూ వార్తా సంస్థ పిటిఐ నివేదికలో ఈ సమాచారం అందించింది. అధికారుల ప్రకారం.. ఢిల్లీకి చెందిన ప్రియాంషు కుమార్ అనే వ్యక్తి తన సహచరులతో కలిసి దీన్ని అమలు చేశాడు. తమ ఈపీఎఫ్‌ ఖాతాను ఆధార్‌తో అనుసంధానం చేసుకోని వ్యక్తులను నిందితులు లక్ష్యంగా చేసుకున్నారు. అలాంటి వారి పీఎఫ్ ఖాతాల నుంచి నిందితులు కలిసి కోట్లాది రూపాయలు తీసుకున్నారు.

దాదాపు రూ.2 కోట్ల మోసం

నివేదికల ప్రకారం.. ప్రియాంషు కుమార్, అతని సహచరులు 11 పీఎఫ్ ఖాతాల నుంచి రూ.1.83 కోట్లు స్వాహా చేశారు. ఈ ఉపసంహరణలు చేయడానికి అతను 39 నకిలీ ఆధారాలను సృష్టించాడు. ఈ కేసులో గత ఏడాది ఫిబ్రవరి 8న సీబీఐ ఏడు సంస్థలు, ఒక గుర్తు తెలియని వ్యక్తిపై కేసు నమోదు చేసింది. ఈపీఎఫ్‌వో ఫిర్యాదు మేరకు సీబీఐ ఈ కేసు నమోదు చేసింది. నిజమైన లబ్ధిదారుల పీఎఫ్‌ ఖాతాల నుంచి తప్పుగా డబ్బును విత్‌డ్రా చేసేందుకు గుర్తింపు దొంగతనంపై ఈపీఎఫ్‌వో​ఫిర్యాదు చేసింది. ప్రియాంషు కుమార్, అతని ముఠా నాగ్‌పూర్, ఔరంగాబాద్, పాట్నా, రాంచీ వంటి నగరాల్లో సంస్థలను నమోదు చేసుకున్నారు. ఎలాంటి మాన్యువల్ వెరిఫికేషన్ లేకుండానే వాటిలో పీఎఫ్ కవరేజీ తీసుకున్నారు. విచారణ చేసినప్పుడు ఈ సంస్థలతో లింక్ చేయబడిన ఏకైక ఖాతా సంఖ్యల మొత్తం సహకారం అందించే ఖాతాల సంఖ్య కంటే ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. దీంతో మోసం జరిగిందన్న అనుమానం బలపడింది.

ఇవి కూడా చదవండి

అయితే ఈ కేసులో బీహార్, జార్ఖండ్, ఢిల్లీలో ముఠాకు సంబంధించిన ఎనిమిది ప్రాంతాల్లో సీబీఐ సోదాలు చేసింది. ఇందులో అనేక పత్రాలు, మొబైల్ ఫోన్లు, ఏటీఎం కార్డులు, చెక్‌బుక్‌లు, పాస్‌బుక్‌లు వంటి ఆధారాలు లభించాయి. అరెస్టు చేసిన ప్రియాంషు కుమార్‌ను ప్రత్యేక కోర్టు నాలుగు రోజుల పోలీసు కస్టడీకి పంపినట్లు సీబీఐ అధికార ప్రతినిధి తెలిపారు. డిజిటల్ యుగంలో మోసాల పద్ధతులు మారుతున్నాయి. అయితే అవగాహన ద్వారా ఇటువంటి మోసాలను తగ్గించుకునే అవకాశం ఉంది. అన్నింటిలో మొదటిది ఇప్పటికే ఉన్న భద్రతా చర్యలను అమలు చేయాలి. మీకు కూడా పీఎఫ్‌ ఖాతా ఉండి, ఇంకా ఆధార్‌తో లింక్ చేయకపోతే ఆలస్యం చేయకుండా ఈ పని పూర్తి చేయండి. ఆధార్‌కు లింక్ చేసే సందర్భంలో మీ సమ్మతి లేకుండా క్లెయిమ్ చేయడం చాలా కష్టం. రెండో విషయం ఏమిటంటే పీఎఫ్ ఖాతాను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. ఏదైనా ఆటంకం ఏర్పడే అవకాశం ఉంటే వెంటనే EPFO​కి తెలియజేయాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి