Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Share Market: రూ.5 వేల పెట్టుబడితో షేర్‌ మార్కెట్ కింగ్‌ అయిన వ్యక్తి ఎవరో తెలుసా?.. పెట్టుబడిదారులకు ఇచ్చే సూచనలు తెలిస్తే షాకవుతారు..

షేర్‌ మార్కెట్‌ రంగంలో పెట్టుబడి అంటే రిస్క్‌ అధికంగా ఉంటుంది. అంటే రిస్క్‌ ఫేస్‌ చేయాలనుకునే వాళ్లు షేర్‌ మార్కెట్‌ రంగంలో అడుగుపెడతారు. అయితే 1985 ప్రాంతంలో కేవలం రూ.5 వేల ప్రారంభ పెట్టుబడితో వచ్చిన రాకేష్ జున్‌జున్‌వాలా ప్రస్తుతం షేర్‌ మార్కెట్‌ రంగంలో బిగ్‌బుల్‌గా మారారు. షేర్‌ మార్కెట్‌ రంగంలో అనేది ఓ సముద్రం అందులో అవగాహన ఉన్నవాళ్లే రాణిస్తారు. ఈ నేపథ్యంలో షేర్‌ మార్కెట్‌ రంగంలో రాణించాలంటే గతంలో రాకేష్ జున్‌జున్‌వాలా పలు సూచనలు చేశారు.

Share Market: రూ.5 వేల పెట్టుబడితో షేర్‌ మార్కెట్ కింగ్‌ అయిన వ్యక్తి ఎవరో తెలుసా?.. పెట్టుబడిదారులకు ఇచ్చే సూచనలు తెలిస్తే షాకవుతారు..
Invest
Follow us
Srinu

|

Updated on: Sep 07, 2023 | 4:45 PM

కష్టపడి సంపాదించిన సొమ్మును మంచి రాబడి కోసం వివిధ పథకాల్లో పెట్టుబడి పెడుతూ ఉంటాం. అయితే ఏ పథకాల్లో పెట్టుబడి పెడుతున్నామనే విషయంపైనే మన రాబడి ఆధారపడి ఉంటుంది. తక్కువ మొత్తం పెట్టుబడులకు షేర్‌ మార్కెట్‌ మంచిదని ఆర్థిక నిపుణులు చెబుతూ ఉంటారు. అయితే షేర్‌ మార్కెట్‌ రంగంలో పెట్టుబడి అంటే రిస్క్‌ అధికంగా ఉంటుంది. అంటే రిస్క్‌ ఫేస్‌ చేయాలనుకునే వాళ్లు షేర్‌ మార్కెట్‌ రంగంలో అడుగుపెడతారు. అయితే 1985 ప్రాంతంలో కేవలం రూ.5 వేల ప్రారంభ పెట్టుబడితో వచ్చిన రాకేష్ జున్‌జున్‌వాలా ప్రస్తుతం షేర్‌ మార్కెట్‌ రంగంలో బిగ్‌బుల్‌గా మారారు. షేర్‌ మార్కెట్‌ రంగంలో అనేది ఓ సముద్రం అందులో అవగాహన ఉన్నవాళ్లే రాణిస్తారు. ఈ నేపథ్యంలో షేర్‌ మార్కెట్‌ రంగంలో రాణించాలంటే గతంలో రాకేష్ జున్‌జున్‌వాలా పలు సూచనలు చేశారు. అవేంటో ఓ సారి తెలుసుకుందాం.

రాకేష్ జున్‌జున్‌వాలా పెట్టుబడి ప్రారంభించే సమయంలో అతను తన తండ్రి నుండి ఎటువంటి మద్దతు పొందలేదు. దీంతో అతని తండ్రి క్లయింట్ నుంచి డబ్బు సేకరించుకోవాల్సి వచ్చింది. అయితేనేం ప్రస్తుతం అతను బిలియనీర్ పెట్టుబడిదారుడి మారాడు. రాకేష్ జున్‌జున్‌వాలాను వారెన్ బఫెట్ ఆఫ్ ఇండియా అని పిలిచే స్థాయికు ఎదిగాడు. ఆయన గత సంవత్సరం మరణించాడు కానీ అతని సూత్రాలను ఇప్పటికీ చాలా మంది పెట్టుబడిదారులు అనుసరిస్తున్నారు. రాకేష్ జున్‌జున్‌వాలా పాటించిన సూత్రాల గురించి తెలుసుకుందాం.

వేరొకరిపై ఆధారపడకుండా ఉండడం

రాకేష్ జున్‌జున్‌వాలా సరిగ్గా కొనండి, స్థిరంగా ఉంచుకోండి అనే భావనను బలంగా విశ్వసించారు. పెట్టుబడిదారులు వేరొకరిపై ఆధారపడకుండా తమ సొంత పరిశోధనలు ప్లాన్ చేసుకుని చేయాలని సూచించే వారు. ముఖ్యంగా పెట్టుబడిదారులు ప్రణాళికకు కట్టుబడి ఉండాలని పేర్కొన్నారు. 

ఇవి కూడా చదవండి

పోటీకి వ్యతిరేకం

షేర్‌ మార్కెట్‌ అతనే పాటించిన మరో సూత్రం పోటీ పెట్టుబడికి దూరంగా ఉండమని సూచించేవారు. ప్రతి హైరైజ్ స్టాక్‌లో పెట్టుబడి పెట్టడం పెట్టుబడిదారుడికి సాధ్యం కాదు. బదులుగా ఇతరులు విక్రయిస్తున్నప్పుడు స్టాక్‌లను కొనుగోలు చేయాలని, ఇతరులు కొనుగోలు చేస్తున్నప్పుడు స్టాక్‌లను విక్రయించాలని ఆయన సూచించారు. సరళంగా చెప్పాలంటే స్టాక్‌ను డిస్కౌంట్ చేసినప్పుడు కొనుగోలు చేయడం, మార్కెట్ పెరుగుతున్నప్పుడు విక్రయించడం ముఖ్యమని భావిచేవారు. ప్రతి పెట్టుబడిదారుడు ఓపిక కలిగి ఉండాలని, వారి పెట్టుబడికి కొంత సమయం ఇవ్వాలి. పెట్టుబడిదారుడు పెట్టుబడి పెట్టగానే మంచి రాబడిని పొందడం సాధ్యం కాదు. ఓర్పు, పరిశోధన, సమయంతో మాత్రమే భారీ రాబడిని పొందవచ్చు.

భావోద్వేగం

రాకేష్ జున్‌జున్‌వాలా పెట్టుబడిదారులు తమ పెట్టుబడుల గురించి ఎప్పుడూ భావోద్వేగానికి గురికాకూడదని పేర్కొనేవారు. ముఖ్యంగా దీర్ఘకాలిక పెట్టుబడి ప్రణాళికలను ఎంచుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా మంచి రాబడి కోసం మీరు స్టాక్‌ల గురించి భావోద్వేగానికి గురికాకుండా నిష్క్రమించడానికి సరైన సమయాన్ని ఎంచుకోవాలి.

కంపెనీలు వెంట పడడం

రాకేష్ జున్‌జున్‌వాలా కూడా వెలుగులో ఉన్న కంపెనీల వెంట పరుగెత్తవద్దని, అలాగే అసమంజసమైన విలువలతో పెట్టుబడి పెట్టవద్దని సూచించారు. అతను వ్యాపార వృద్ధిని విశ్వసించాడు. పెట్టుబడిదారుల మొత్తం డబ్బును కోల్పోయేలా చేసే పెద్ద కంపెనీలలో పెట్టుబడి పెట్టాడు. కంపెనీ బ్రాండ్ కంటే వ్యాపారం, స్టాక్స్ వృద్ధిని అధ్యయనం చేయాలని ఆయన సలహా ఇచ్చే వారు. 

పెట్టుబడి సమ్మేళనం

రాకేష్ జున్‌జున్‌వాలా సమ్మేళనం శక్తిని విశ్వసించారు, ఎందుకంటే ఇది ఏదైనా చిన్న పెట్టుబడులను అధిక కార్పస్‌గా మార్చడంలో సహాయపడుతుంది. మార్కెట్‌ను అర్థం చేసుకుని పెట్టుబడి ప్రణాళికలు రూపొందించుకోవాలని ఆయన ఎప్పుడూ సూచించేవారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్  చేయండి..