Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Onion Prices: ఉల్లి ధరలను తగ్గించేందుకు కేంద్రం కీలక నిర్ణయం

దేశీయంగా ఉల్లి లభ్యత పెంచడం ద్వారా ధరలను అదుపు చేసేందుకు ఉల్లి ఎగుమతులను కేంద్రం నిషేధించింది. దీనికి నిరసనగా చందవాడ్‌లో జరిగిన నాసిక్ జిల్లా ఉల్లి వ్యాపారుల సంఘం సమావేశంలో శనివారం నుంచి వేలం నిలిపివేయాలని నిర్ణయించారు. ఉల్లి ఎగుమతి నిషేధంపై నిర్ణయం తీసుకునే ముందు ప్రభుత్వం కనీసం వారం రోజుల ముందుగానే అల్టిమేటం ఇచ్చి ఉండాల్సిందని, దీనివల్ల వ్యాపారులంతా ఇప్పుడు గందరగోళంలో ఉన్నారని నాసిక్ జిల్లా..

Onion Prices: ఉల్లి ధరలను తగ్గించేందుకు కేంద్రం కీలక నిర్ణయం
Onion
Follow us
Subhash Goud

|

Updated on: Dec 09, 2023 | 2:39 PM

సామాన్యులకు ఉల్లి ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో రూ.50 చొప్పున విక్రయిన్నారు. భారతదేశంలోని కొన్ని నగరాల్లో ఉల్లి కిలో రూ.100కి చేరుకుంది. దేశంలో పెరుగుతున్న ధరలను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2024 మార్చి 31 వరకు ఉల్లి ఎగుమతిపై ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ నిర్ణయాన్ని తెలియజేస్తూ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్‌టీ) గురువారం ఒక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఉల్లి ఎగుమతిపై ఈ నిషేధం డిసెంబర్ 8 నుంచి అమలులోకి వచ్చింది. దేశీయంగా ఉల్లి వినియోగాన్ని కొనసాగించేందుకు, ధరలను అదుపులో ఉంచేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, నోటిఫికేషన్ జారీకి ముందు మూడు సందర్భాల్లో ఈ పరిమితి వర్తించదు.

  • షిప్పింగ్ బిల్లులు దాఖలు అయ్యాయి. భారతీయ ఓడరేవులకు నౌకలు వచ్చాయి.
  • నోటిఫికేషన్ వెలువడకముందే ఓడలో ఉల్లిపాయల లోడ్ ప్రారంభమైంది.
  • ఉల్లి సరుకులను కస్టమ్స్‌కు అప్పగించిన చోట, వివరాలు వారి సిస్టమ్‌లోకి ఫీడ్ చేయడం జరిగింది.

ఉల్లి, టొమాటో ధరలు నెలవారీగా 58 శాతం, 35 శాతం పెరిగాయని క్రిసిల్ ఎంఐ అండ్ ఏ రీసెర్చ్ తన నివేదికలో పేర్కొంది. పండుగల డిమాండ్‌, ఖరీఫ్‌ సీజన్‌లో వర్షాల కారణంగా ఉత్పత్తి తగ్గడంతో ఉల్లి, టమాటా ధరలు పెరిగాయి. నివేదిక ప్రకారం, నవంబర్‌లో ఇంట్లో తయారుచేసిన వెజ్, నాన్ వెజ్ థాలీల ధరలు నెలవారీ ప్రాతిపదికన 10 శాతం, ఐదు శాతం పెరిగాయి. నెలవారీగా కోళ్ల ధరల్లో ఒకటి నుంచి మూడు శాతం స్వల్ప తగ్గుదల కనిపించగా.. నాన్ వెజ్ థాలీ ధరతో పోలిస్తే కోళ్ల ధర 50 శాతం సహకరిస్తోంది.

కాగా, దేశీయంగా ఉల్లి లభ్యత పెంచడం ద్వారా ధరలను అదుపు చేసేందుకు ఉల్లి ఎగుమతులను కేంద్రం నిషేధించింది. దీనికి నిరసనగా చందవాడ్‌లో జరిగిన నాసిక్ జిల్లా ఉల్లి వ్యాపారుల సంఘం సమావేశంలో శనివారం నుంచి వేలం నిలిపివేయాలని నిర్ణయించారు. ఉల్లి ఎగుమతి నిషేధంపై నిర్ణయం తీసుకునే ముందు ప్రభుత్వం కనీసం వారం రోజుల ముందుగానే అల్టిమేటం ఇచ్చి ఉండాల్సిందని, దీనివల్ల వ్యాపారులంతా ఇప్పుడు గందరగోళంలో ఉన్నారని నాసిక్ జిల్లా ఉల్లి వ్యాపారుల సంఘం అధ్యక్షుడు ఖండూ డియోర్ చెప్పారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి