AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Infosys Narayana Murthy: 4 నెలల మనవడికి రూ.240 కోట్ల బహుమతి ఇచ్చిన తాత.. ఆ బుల్లి బిలియనీర్ ఎవరో తెలుసా?

దేశీయ సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు ఎన్‌ఆర్‌ నారాయణ మూర్తి తన నాలుగు నెలల మనవడు ఏకాగ్రహ్‌ రోహన్‌ మూర్తికి ఖరీదైన గిఫ్ట్‌ ఇచ్చాడు. ఇన్ఫోసిస్‌కు చెందిన 15 లక్షల షేర్లను బహుమతిగా ప్రధానం చేశాడు. వీటి ప్రస్తుత మార్కెట్‌ విలువ రూ. 240 కోట్లుగా ఇన్ఫోసిస్‌ ఒక ప్రకటనలో వెల్లడించింది. 77 ఏళ్ల ఇన్ఫోసిస్‌లో తనకుగల వాటాలో 0.04 శాతం షేర్లను శుక్రవారం ఆఫ్ మార్కెట్ లావాదేవీలో తన మనవడి పేరిట..

Infosys Narayana Murthy: 4 నెలల మనవడికి రూ.240 కోట్ల బహుమతి ఇచ్చిన తాత.. ఆ బుల్లి బిలియనీర్ ఎవరో తెలుసా?
Infosys Narayana Murthy
Srilakshmi C
|

Updated on: Mar 19, 2024 | 10:02 AM

Share

న్యూఢిల్లీ, మార్చి 19: దేశీయ సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు ఎన్‌ఆర్‌ నారాయణ మూర్తి తన నాలుగు నెలల మనవడు ఏకాగ్రహ్‌ రోహన్‌ మూర్తికి ఖరీదైన గిఫ్ట్‌ ఇచ్చాడు. ఇన్ఫోసిస్‌కు చెందిన 15 లక్షల షేర్లను బహుమతిగా ప్రధానం చేశాడు. వీటి ప్రస్తుత మార్కెట్‌ విలువ రూ. 240 కోట్లుగా ఇన్ఫోసిస్‌ ఒక ప్రకటనలో వెల్లడించింది. 77 ఏళ్ల ఇన్ఫోసిస్‌లో తనకుగల వాటాలో 0.04 శాతం షేర్లను శుక్రవారం ఆఫ్ మార్కెట్ లావాదేవీలో తన మనవడి పేరిట బదిలీ చేశాడు. షేర్ ట్రాన్ఫర్‌ తర్వాత ఇన్ఫోసిస్‌లో నారాయణ మూర్తి హోల్డింగ్ 0.40 నుంచి 0.36 శాతానికి పడిపోయింది. శుక్రవారం బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE)లో వీటి ఒక్కొక్క షేర్‌ విలువ రూ. 1,602.30 వద్ద ముగిశాయి. దీంతో ఏకాగ్రహ్‌ మూర్తి ఇన్ఫోసిస్‌లో రూ. 240,34,50,000 సంపదన కలిగిన బుల్లి బిలియనీర్‌గా అవతరించాడు.

ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి కుమారుడు రోహన్ మూర్తి, కోడలు అపర్ణ కృష్ణన్‌ల సంతానం ఏకాగ్రా. గత ఏడాది నవంబర్ 10న బెంగళూరులో వీరు ఏకాగ్రహ్‌కు జన్మనిచ్చారు. గత వారం రాజ్యసభ ఎంపీగా ప్రమాణస్వీకారం చేసిన నారాయణ మూర్తి, భార్య సుధా మూర్తిలకు ఏకాగ్రహ్‌ మూడో మనవడు. నారాయణ మూర్తి కుమార్తె అక్షత, అల్లుడు రిషి సునాక్‌ (బ్రిటన్‌ ప్రధాని) దంపతులకి కృష్ణ, అనౌష్క అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

డిసెంబర్ త్రైమాసికం చివరి నాటికి ఇన్ఫోసిస్‌లో అక్షతా మూర్తి 1.05 శాతం, సుధా మూర్తి 0.93 శాతం, రోహన్ 1.64 శాతం వాటా కలిగి ఉన్నారు. కాగా నారాయణ మూర్తి మరో ఆరుగురు భాగస్వాములతో కలిసి 1981లో ఇన్ఫోసిస్‌ను ప్రారంభించారు. వీరిలో అశోక్ అరోరా 1989లో ఇన్ఫోసిస్‌ను వదిలి అమెరికాలో స్థిరపడ్డారు. ప్రస్తుతం మిగతా సహ వ్యవస్థాపకులందరూ బిలియనీర్లుగా ఉన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
అందంలో తల్లిని మించిపోయిందిగా..
అందంలో తల్లిని మించిపోయిందిగా..
బీచ్‌లో పరువాల విందు.. బాలయ్య నటి అదిరిపోయే ఫొటోస్
బీచ్‌లో పరువాల విందు.. బాలయ్య నటి అదిరిపోయే ఫొటోస్
శిక్షణ ఇచ్చిన గురువుకే పంగనామం పెట్టాలనుకున్నాడు.. చివరకు..
శిక్షణ ఇచ్చిన గురువుకే పంగనామం పెట్టాలనుకున్నాడు.. చివరకు..