AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Liquor: భారత్‌లో ఆ 10 రాష్ట్రాల ప్రజలు అత్యధికంగా మద్యం సేవిస్తున్నారు.. ఇందులో మీ రాష్ట్రం కూడా ఉందా..? చెక్‌ చేసుకోండి

Liquor: భారతదేశంలో దాదాపు 160 మిలియన్ల మంది మద్యం సేవిస్తున్నారు. వీరిలో 95 శాతం మంది పురుషులు ఉండగా, వీరి వయస్సు 18 నుంచి 49 ఏళ్ల మధ్య ఉంటుందని నివేదికలు..

Liquor: భారత్‌లో ఆ 10 రాష్ట్రాల ప్రజలు అత్యధికంగా మద్యం సేవిస్తున్నారు.. ఇందులో మీ రాష్ట్రం కూడా ఉందా..? చెక్‌ చేసుకోండి
Subhash Goud
|

Updated on: Feb 27, 2022 | 4:16 PM

Share

Liquor: భారతదేశంలో దాదాపు 160 మిలియన్ల మంది మద్యం సేవిస్తున్నారు. వీరిలో 95 శాతం మంది పురుషులు ఉండగా, వీరి వయస్సు 18 నుంచి 49 ఏళ్ల మధ్య ఉంటుందని నివేదికలు వెలువడుతున్నాయి. దేశంలో యేటా బిలియన్ల లీటర్ల మద్యం (Liquor Consumption) వినియోగిస్తున్నారు. సర్వే సంస్థ క్రిసిల్ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. 2020 సంవత్సరంలో 5 రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh), తెలంగాణ (Telangana), తమిళనాడు (Tamilnadu), కర్ణాటక (Karnataka), కేరళ (Kerala) రాష్ట్రాలు.. దేశంలో అమ్ముడవుతున్న మొత్తం మద్యంలో 45 శాతం వినియోగిస్తున్నాయి. ఇక దేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కువగా మద్యం తాగుతున్నారో తెలుసుకోండి.

ఇక తాజాగా అత్యధికంగా మద్యం సేవించే రాష్ట్రాలపై జరిగిన సర్వే నివేదికల ప్రకారం.. అత్యధికంగా మద్యం సేవించే రాష్ట్రాల్లో ఛత్తీస్‌గఢ్‌ పేరు మొదటి స్థానంలో ఉంది. దాదాపు 30 మిలియన్ల జనాభా ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో దాదాపు 35.6 శాతం మంది మద్యం సేవిస్తున్నారు. ఈ జాబితాలో త్రిపుర రెండో స్థానంలో ఉంది. త్రిపురలో 34.7 శాతం మంది మద్యం సేవిస్తున్నారు. వీరిలో 13.7 శాతం మంది నిత్యం మద్యం సేవిస్తున్నారు.

మూడో స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 34.5 శాతం మంది ప్రజలు నిత్యం మద్యం సేవిస్తున్నారు. ఈ జాబితాలో నాలుగో స్థానంలో పంజాబ్‌ ఉంది. దాదాపు 30 మిలియన్ల జనాభా ఉన్న పంజాబ్‌లో 28.5 శాతం మంది మద్యం సేవిస్తున్నారు. వీరిలో నిత్యం తాగేవారి సంఖ్య 6 శాతం.

5వ స్థానంలో ఉన్న అరుణాచల్ ప్రదేశ్ ఉంది. ఇక్కడి జనాభాలో 28 శాతం మంది మద్యం సేవిస్తున్నారు. అదే సమయంలో, గోవాలో ఆరో స్థానంలో ఉన్న జనాభాలో దాదాపు 26.4 శాతం మంది మద్యం సేవిస్తున్నారు. కేరళ సంఖ్య 7వ స్థానంలో ఉంది. 19.9 శాతం మంది మద్యం సేవిస్తున్నారని నేషనల్‌ ఫ్యామిలీ హెల్త్‌ సర్వే(NFHS) నివేదిక తెలిపింది.

ఇక 8వ స్థానంలో పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రం ఉంది. దాదాపు 10 కోట్ల జనాభా ఉన్న ఈ రాష్ట్రంలో 14 శాతం మంది అంటే దాదాపు 1.4 కోట్ల మంది మద్యం సేవిస్తున్నారు. ఇక 9వ స్థానంలో తమిళనాడు ఉంది. 7.3 కోట్ల జనాభా ఉన్న తమిళనాడులో దాదాపు 15 శాతం మంది మద్యం సేవిస్తున్నారు. కర్ణాటక 10వ స్థానంలో ఉంది. 62 మిలియన్ల జనాభా ఉన్న కర్ణాటకలో దాదాపు 11 శాతం మంది మద్యం సేవిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

Russias Military: రష్యా సైనికుల వాహనాలపై జెడ్‌ (Z) అనే అక్షరం ఎందుకు ఉంటుందో తెలుసా..?

Mars: అంగారకుడిపై పువ్వులా కనిపించే రాయిని కనుగొన్న క్యురియాసిటీ రోవర్‌.. ఆశ్చర్యపోయిన శాస్త్రవేత్తలు

Follow Us