BSNL-BBNL Merger: కేంద్రం కీలక నిర్ణయం.. బీఎస్ఎన్‌ఎల్, బీబీఎన్‌ఎల్ సంస్థల విలీనానికి కేబినెట్‌ ఆమోదం

Modi Cabinet Decisions: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNLపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. BSNL 4 జీ సేవలను పటిష్టం చేసేందుకు భారీ ప్యాకేజ్‌ను ప్రకటించింది. రూ. లక్షా 64 వేల కోట్ల ప్యాకేజీ ప్రకటించింది కేంద్రం. BSNL , BBNL సంస్థల విలీనానికి కేంద్ర కేబినెట్‌ ఓకే చెప్పింది.

BSNL-BBNL Merger: కేంద్రం కీలక నిర్ణయం.. బీఎస్ఎన్‌ఎల్, బీబీఎన్‌ఎల్ సంస్థల విలీనానికి కేబినెట్‌ ఆమోదం
Bsnl Bbnl
Follow us

|

Updated on: Jul 27, 2022 | 5:57 PM

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్‌ఎల్(BSNL)పై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. బీఎస్ఎన్‌ఎల్ 4 జీ సేవలను పటిష్టం చేసేందుకు భారీ ప్యాకేజ్‌ను ప్రకటించింది. రూ. లక్షా 64 వేల కోట్ల ప్యాకేజీ ప్రకటించింది కేంద్రం. బీఎస్ఎన్‌ఎల్ , బీబీఎన్‌ఎల్(BBNL) సంస్థల విలీనానికి కేంద్ర కేబినెట్‌ ఓకే చెప్పింది. బిఎస్‌ఎన్‌ఎల్‌కు పునరుద్ధరణ ప్యాకేజీకి మోడీ మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది. 1.64 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించినట్లు మంత్రివర్గ సమావేశం అనంతరం టెలికాం మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. 2019లో మొదటి ప్యాకేజీ ఇచ్చారు. బీఎస్‌ఎన్‌ఎల్‌, భారత్‌ బ్రాడ్‌బ్యాంక్‌ నెట్‌వర్క్‌ల విలీనానికి కేబినెట్‌ ఆమోదం తెలిపిందని వెల్లడించారు.

అలాగే, రెండవ నిర్ణయం ప్రకారం, గ్రామాలలో కనెక్టివిటీ కోసం 26316 కోట్ల ప్యాకేజీకి మంత్రివర్గం ఈ రోజు ఆమోదించిందని వైష్ణవ్ ప్రకటించారు. 2జీ ఉన్న గ్రామాలకు 4జీ సేవలందించేందుకు అనుమతి లభించింది. సరిహద్దు ప్రాంతం కోసం కూడా ఆర్డర్ ఇవ్వబడింది.

సరిహద్దు ప్రాంతం తూర్పు లడఖ్‌ను కూడా కలిగి ఉంటుంది. ఇక్కడ 4G తీసుకురావచ్చు. సరిహద్దు ప్రాంతంలో 4జీ నెట్‌వర్క్‌ను ఎలా తీసుకురావచ్చో రక్షణ మంత్రిత్వ శాఖ, హోం మంత్రిత్వ శాఖ, కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ వివరిస్తాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..