AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LPG Gas Price: వినియోగదారులకు బ్యాడ్‌న్యూస్‌.. పెరిగిన గ్యాస్‌ సిలిండర్‌ ధర..!

LPG Gas Price Hike: ఆగస్టు 1న కమర్షియల్‌ ఎల్‌పీజీ ధరలను పలు నగరాల్లో భారీగా తగ్గించిన విషయం తెలిసిందే. కోల్‌కతాలో రూ.209, ఢిల్లీలో రూ.202 వరకు తగ్గించారు. ఇప్పుడు సెప్టెంబర్‌లో మళ్లీ ధరలు పెరగడంతో కమర్షియల్‌ ఎల్‌పీజీపై ఆధారపడే వ్యాపారాలకు కొంత అదనపు..

LPG Gas Price: వినియోగదారులకు బ్యాడ్‌న్యూస్‌.. పెరిగిన గ్యాస్‌ సిలిండర్‌ ధర..!
Lpg Gas Price Hike
Subhash Goud
|

Updated on: Sep 01, 2026 | 7:09 AM

Share

LPG Cylinder Price: సెప్టెంబర్ నెల ప్రారంభమైన నేడు ఎల్పీజీ వినియోగదారులకు ఎదురుదెబ్బ తగిలింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఎల్పీజీ సిలిండర్ల ధరలను పెంచాయి. ఐఓసీఎల్ ప్రకారం, 19 కేజీల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధర రూ.9.50 పెరిగింది. అయితే, 14.2 కేజీల గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరను పెంచకపోవడం గృహ వినియోగదారులకు ఊరటనిచ్చింది.

5 కేజీ, 10 కేజీ గ్యాస్ సిలిండర్ల ధరలను కూడా పెంచలేదు. సాధారణ 5 కేజీల చిన్న ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ఇప్పటికీ రూ.349.50 కే లభిస్తుండగా, ఎక్స్‌ట్రాలైట్ సిలిండర్ ధర రూ.339 వద్ద స్థిరంగా ఉంది. అయితే, 5 కేజీల గృహేతర సిలిండర్ ధర రూ.762 నుండి రూ.764కు పెరిగింది.

ఇది కూడా చదవండి: Gold Price Today: మళ్లీ తగ్గుముఖం పడుతున్న బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే..

ఇవి కూడా చదవండి

దేశంలోని ప్రధాన నగరాల్లో గ్యాస్‌ ధరలు

  1. హైదరాబాద్‌లో 19 కిలోల కమర్షియల్‌ ఎల్‌పీజీ సిలిండర్‌ ధర రూ.11 పెరిగి రూ.2,996కు చేరుకుంది.
  2. ఢిల్లీలో 19 కేజీల సిలిండర్ ధర రూ.9.50 పెరిగి, ఇప్పుడు రూ.2,747.50కి చేరింది. నిన్నటి వరకు దీని ధర రూ.2,738గా ఉండేది.
  3. ముంబైలో 19 కేజీల వాణిజ్య గ్యాస్ సిలిండర్ రూ.2,701కి లభిస్తుంది. ఆగస్టు 31 నాటికి, ఇక్కడ దాని ధర రూ.2,691.50గా ఉంది.
  4. కోల్‌కతాలో 19 కేజీల గ్యాస్ సిలిండర్ ధర రూ.2,872.50 నుంచి రూ.2,982 కు పెరిగింది.
  5. చెన్నైలో 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధర రూ.2,906 నుండి రూ.2,916.50కు చేరింది.

ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఎల్‌పిజి గ్యాస్ సిలిండర్లకు బదులుగా పిఎన్‌జి కనెక్షన్లను ప్రోత్సహిస్తోంది. గ్యాస్ బుకింగ్ ఇబ్బందులు ముగియనున్నాయి. ఈ రోజు, సెప్టెంబర్ 1వ తేదీ నుండి, ప్రభుత్వం ఒక ప్రోత్సాహక పథకాన్ని ప్రారంభిస్తోంది.

ఇదిలా ఉండగా, ఆగస్టు 1న కమర్షియల్‌ ఎల్‌పీజీ ధరలను పలు నగరాల్లో భారీగా తగ్గించిన విషయం తెలిసిందే. కోల్‌కతాలో రూ.209, ఢిల్లీలో రూ.202 వరకు తగ్గించారు. ఇప్పుడు సెప్టెంబర్‌లో మళ్లీ ధరలు పెరగడంతో కమర్షియల్‌ ఎల్‌పీజీపై ఆధారపడే వ్యాపారాలకు కొంత అదనపు భారం ఏర్పడింది. అంతర్జాతీయ ఇంధన ధరలు, ముడిచమురు మార్కెట్‌ పరిస్థితులు, రూపాయి-డాలర్‌ మారకం రేటు వంటి అంశాల ఆధారంగా భవిష్యత్తులోనూ ఎల్‌పీజీ ధరల్లో మార్పులు ఉండే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి: Domestic Help Services: కేవలం రూ.29కే పనిమనిషి సేవలు.. 10 నిమిషాల్లో ఇంటికే వచ్చేస్తారు..!

ఇది కూడా చదవండి: House Wiring: హౌస్ వైరింగ్‌లో ఏది సేఫ్? కాపర్ లేదా అల్యూమినియం వైర్ల మధ్య తేడాలివే!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us