AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LIC Q4 Results: ఎల్‌ఐసీ క్యూ4 ఫలితాల విడుదల.. తగ్గిన కంపెనీ లాభాలు..

దేశంలో అతిపెద్ద బీమా కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(LIC) మార్చి త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది. మార్చి త్రైమాసికంలో ఎల్‌ఐసీ కన్సాలిడేటెడ్ నికర లాభం 17.41 శాతం తగ్గి రూ.2409.39 కోట్లకు చేరుకుంది...

LIC Q4 Results: ఎల్‌ఐసీ క్యూ4 ఫలితాల విడుదల.. తగ్గిన కంపెనీ లాభాలు..
Lic
Srinivas Chekkilla
|

Updated on: May 31, 2022 | 7:06 AM

Share

దేశంలో అతిపెద్ద బీమా కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(LIC) మార్చి త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది. మార్చి త్రైమాసికంలో ఎల్‌ఐసీ కన్సాలిడేటెడ్ నికర లాభం 17.41 శాతం తగ్గి రూ.2409.39 కోట్లకు చేరుకుంది. గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ టర్నోవర్ రూ.2,917.33 కోట్లుగా ఉంది. ఎల్‌ఐసీ ఒక్కో షేరుపై రూ. 1.50 డివిడెండ్‌ను ప్రకటించింది . స్టాక్ మార్కెట్‌(Stock Market)లో లిస్టయిన తర్వాత ఎల్‌ఐసీకి ఇది మొదటి త్రైమాసిక ఫలితం. మార్చి త్రైమాసికంలో ఎల్‌ఐసీ నికర ప్రీమియం ఆదాయం 17.88 శాతం పెరిగి రూ.1,44,158.84 కోట్లకు చేరుకుంది. గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ ప్రీమియం ఆదాయం రూ.1,22,290.64 కోట్లుగా ఉంది. మొదటి సంవత్సరం ప్రీమియం ఆదాయం 32.65 శాతం పెరిగి రూ. 14,663.19 కోట్లకు, పునరుద్ధరణ ప్రీమియం ఆదాయం 5.37 శాతం పెరిగి రూ.71,472.05 కోట్లకు, సింగిల్ ప్రీమియం ఆదాయం 33.70 శాతం పెరిగి రూ. 58,250.91 కోట్లకు చేరినట్లు కంపెనీ నివేదించింది.

కంపెనీ పెట్టుబడి ఆదాయం రూ.67,855.59 కోట్ల వద్ద స్థిరపడింది. గతేడాది ఇదే త్రైమాసికంలో పెట్టుబడుల ద్వారా కంపెనీ ఆదాయం రూ.67,684.27 కోట్లుగా ఉంది. సోమవారం ఎల్‌ఐసీ షేరు పెరిగింది. బిఎస్‌ఇలో ఈ షేరు 1.89 శాతం లాభంతో రూ.837.05 వద్ద ముగిసింది. ముగింపు ధర వద్ద LIC మార్కెట్ క్యాప్ రూ. 5,29,433.93 కోట్లుగా ఉంది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ షేర్ల లిస్టింగ్ బలహీనంగా ఉంది. ఎన్‌ఎస్‌ఇలో ఎల్‌ఐసి షేరు ఇష్యూ ధరతో పోలిస్తే 8.11 శాతం తగ్గి రూ.872 వద్ద లిస్టయింది. ఎల్‌ఐసి లిస్టింగ్ బిఎస్‌ఇలో 8.62 శాతం తగ్గి రూ.867.20 వద్ద ఉంది. ఈ ఇష్యూ ద్వారా ప్రభుత్వం రూ.20,557 కోట్లు సమీకరించింది. ఈ ప్రారంభ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)కి దేశీయ ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందన వచ్చింది. ప్రభుత్వం ఎల్‌ఐసి షేర్ల ఇష్యూ ధరను ఒక్కో షేరుకు రూ.949గా నిర్ణయించింది. అయితే ఎల్‌ఐసీ పాలసీదారులు, రిటైల్ ఇన్వెస్టర్లు ఒక్కో షేరుకు వరుసగా రూ.889 మరియు రూ.904 చొప్పున షేర్లు పొందారు. ఎల్‌ఐసీ ఐపీఓ మే 9న ముగియగా, మే 12న బిడ్డర్లకు షేర్లను కేటాయించారు. ప్రభుత్వం IPO ద్వారా LICలో 22.13 కోట్లకు పైగా షేర్లను అంటే 3.5 శాతం వాటాను ఆఫర్ చేసింది. ఇందుకోసం ఒక్కో షేరు ధరను రూ.902-949గా ఉంచింది.

Follow Us
మళ్లీ లంచం తీసుకుంటూ దొరికిన మైన్స్ సర్వేయర్
మళ్లీ లంచం తీసుకుంటూ దొరికిన మైన్స్ సర్వేయర్
మరో కొత్త వీడియోలో దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు.. ఈసారి..
మరో కొత్త వీడియోలో దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు.. ఈసారి..
సముద్రంలో చిక్కుకున్న నిపుణులు.. తాళ్ళు తెగిపోవడంతో కలకలం..
సముద్రంలో చిక్కుకున్న నిపుణులు.. తాళ్ళు తెగిపోవడంతో కలకలం..
తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలా..? రైల్వేశాఖ కొత్త రూల్స్
తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలా..? రైల్వేశాఖ కొత్త రూల్స్
నీళ్లు.. నిధులు.. నియామకాలు! తెలంగాణలో మళ్లీ ఉద్యమం నాటి సెగలు!
నీళ్లు.. నిధులు.. నియామకాలు! తెలంగాణలో మళ్లీ ఉద్యమం నాటి సెగలు!
యూట్యూబ్‌ను ఊపేస్తోన్న డీమాన్ పవన్, రీతూ చౌదరీల రొమాంటిక్ సాంగ్
యూట్యూబ్‌ను ఊపేస్తోన్న డీమాన్ పవన్, రీతూ చౌదరీల రొమాంటిక్ సాంగ్
బిర్యానీ ఆకు కేవలం మసాలా కాదు.. ఇంటి శుభానికి ప్రతీకగా ఎందుకు..
బిర్యానీ ఆకు కేవలం మసాలా కాదు.. ఇంటి శుభానికి ప్రతీకగా ఎందుకు..
అరకు అడవిలో అలజడి.. భారీగా పట్టుబడ్డ గంజాయి
అరకు అడవిలో అలజడి.. భారీగా పట్టుబడ్డ గంజాయి
క్రెడిట్ కార్డు తీసుకున్న వ్యక్తి మరణిస్తే బిల్లు ఎవరు కట్టాలి..?
క్రెడిట్ కార్డు తీసుకున్న వ్యక్తి మరణిస్తే బిల్లు ఎవరు కట్టాలి..?
ఆ గిరిజనుల్లో పట్టలేనంత ఆనందం.. ధింసాతో సందడి.. ఎందుకో తెలుసా..!
ఆ గిరిజనుల్లో పట్టలేనంత ఆనందం.. ధింసాతో సందడి.. ఎందుకో తెలుసా..!