AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Post Office Scheme: పది లక్షల పెట్టుబడితో మరో పది లక్షల రాబడి.. ఈ సూపర్ సేవింగ్ పోస్టాఫీస్ స్కీమ్ గురించి తెలుసుకోండి

తాజాగా పోస్ట్ ఆఫీస్‌లో అందుబాటులో ఉండే కిసాన్ వికాస్ పత్ర వడ్డీ రేటు గణనీయంగా పెరిగింది. కిసాన్ వికాస్ పత్ర ప్రారంభ లక్ష్యం రైతులను డబ్బు ఆదా చేసేలా ప్రోత్సహించడం. ఇది భారత కేంద్ర ప్రభుత్వం ద్వారా నిర్వహించే ఏకమొత్త డిపాజిట్ పథకం.

Post Office Scheme: పది లక్షల పెట్టుబడితో మరో పది లక్షల రాబడి.. ఈ సూపర్ సేవింగ్ పోస్టాఫీస్ స్కీమ్ గురించి తెలుసుకోండి
Post Office Scheme
Nikhil
| Edited By: seoteam.veegam|

Updated on: Jun 02, 2023 | 2:41 PM

Share

కష్టపడి సంపాదించిన సొమ్ముకు నమ్మకమైన రాబడి కోసం అనేక విభిన్న పెట్టుబడి ఎంపికలు ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి, అయితే పెట్టుబడి ఎంపికల్లో దేశ జనాభాలో గణనీయమైన భాగం ఇప్పటికీ బ్యాంకు, పోస్టాఫీసు లేదా ఎల్ఐసీ పథకాలలో పాల్గొనేందుకు ఆసక్తి చూపతున్నారు. అయితే ఆయా సంస్థలు కూడా ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్లాన్స్‌తో పెట్టుబడిదారులను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. అయితే కొన్ని సార్లు పాత పథకాలకు సరికొత్త వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తూ కస్టమర్లను ఆకర్షించడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. తాజాగా పోస్ట్ ఆఫీస్‌లో అందుబాటులో ఉండే కిసాన్ వికాస్ పత్ర వడ్డీ రేటు గణనీయంగా పెరిగింది. కిసాన్ వికాస్ పత్ర ప్రారంభ లక్ష్యం రైతులను డబ్బు ఆదా చేసేలా ప్రోత్సహించడం. ఇది భారత కేంద్ర ప్రభుత్వం ద్వారా నిర్వహించే ఏకమొత్త డిపాజిట్ పథకం. ఈ పోస్ట్ ఆఫీస్ స్కీమ్‌లో, పెట్టుబడిదారుడు ఒకేసారి మొత్తాన్ని పెట్టుబడి పెట్టినప్పుడు నిర్ణీత వ్యవధిలో రెట్టింపు మొత్తాన్ని పొందవచ్చు. ఈ ప్రోగ్రామ్ కింద అందించే వడ్డీ రేటును ప్రభుత్వం ఏప్రిల్ 1, 2023 నుంచి 7.2 శాతం నుంచి 7.4 శాతానికి పెంచింది. వడ్డీ రేట్ల పెరుగుదల కారణంగా ఈ ప్లాన్ వివరాలను తెలుసుకుందాం.

కిసాన్ వికాస్ పత్రలో మీరు కనిష్టంగా రూ. 1,000, గరిష్టంగా ఎంతమొత్తమైనా ఏకకాలంలో పెట్టుబడి పెట్టాలి. ఏప్రిల్ 2023లో వడ్డీ రేటును పెంచాలనే ప్రభుత్వ నిర్ణయంతో కిసాన్ వికాస్ పత్ర పథకం కింద డిపాజిట్ల రెట్టింపు కాలపరిమితి కూడా ఇప్పుడు తగ్గించారు. కిసాన్ వికాస్ పత్ర కింద గత 120 నెలలతో పోలిస్తే ప్రస్తుతం కేవలం 115 నెలల్లో డబ్బు రెట్టింపు అవుతుంది. అలాగే కిసాన్ వికాస్ పత్రాన్ని కనీసం 18 ఏళ్ల వయస్సు ఉన్న భారతీయ పౌరులు ఎవరైనా సమీప పోస్టాఫీసులో కొనుగోలు చేయవచ్చు. బ్యాంకు ఖాతాలు లేని గ్రామీణ భారతదేశంలోని ప్రజలు ముఖ్యంగా దీనికి ఆకర్షితులవుతున్నారు. కేవీపీను పెద్దవారితో లేదా మైనర్ కోసం సంయుక్తంగా కూడా కొనుగోలు చేయవచ్చు. ఈ పథకంలో పెట్టుబడి పెట్టడానికి అర్హతలు ఇవే

  • పెట్టుబడిదారుడు భారతీయ జాతీయుడై ఉండాలి.
  • పెట్టుబడిదారుడు 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు కలిగి ఉండాలి.
  • ఒక పెద్దవారు పిల్లల తరపున లేదా మానసిక అనారోగ్యంతో ఉన్న వారి తరపున దరఖాస్తును సమర్పించవచ్చు.
  • ప్రవాస భారతీయులు, హిందూ అవిభక్త కుటుంబాలు (హెచ్‌యూఎఫ్) కేవీపీలో పెట్టుబడి పెట్టడానికి అనర్హులు. 

రూ.10 లక్షలకు పది లక్షల రాబడి ఇలా

మీరు ఈ పథకంలో 10 లక్షలు పెట్టుబడి పెడితే మీరు రూ. 115 నెలల తర్వాత మెచ్యూరిటీ సమయంలో 20 లక్షలు పొందవచ్చు. ముఖ్యంగా ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం చక్ర వడ్డీ రేట్ల ప్రయోజనాన్ని అందిస్తుంది.

ఇవి కూడా చదవండి

దరఖాస్తు ఇలా

  • పోస్ట్ ఆఫీస్ నుంచి కేవీపీ దరఖాస్తు ఫారమ్-ఏను పొందాలి.
  • అవసరమైన సమాచారంతో ఫారమ్‌ను పూరించి,  దానిని సమర్పించాలి.
  • ఏజెంట్ సహాయంతో పెట్టుబడి పెడితే ఫారం-ఏ1 తప్పనిసరిగా పూర్తి చేసి సమర్పించాలి.
  • కేవైసీ ప్రక్రియ కోసం, గుర్తింపు పత్రాలలో ఏదైనా ఒకదాని కాపీని అందించాలి.
  • పత్రాలను పరిశీలించి, అవసరమైన డిపాజిట్లు చేసిన తర్వాత కేవీప సర్టిఫికేట్ అందిస్తారు. అయితే కేవీపీసర్టిఫికేట్‌ను స్వీకరించడానికి నమోదిత ఈమెయిల్ చిరునామాను కూడా అందించవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి