AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Infosys: గుడ్ న్యూస్.. విశాఖలో ఇన్ఫోసిస్ కార్యాలయం.. ఆ ప్రణాళికలో భాగంగా కంపెనీ నిర్ణయం..

Infosys: ఇన్ఫోసిస్ అందుబాటులో ఉన్న టాలెంట్ ఉద్యోగులకు దగ్గరగా ఉండే ప్రయత్నాన్ని ప్రారంభించింది. టైర్- II నగరాల్లో నాలుగు కొత్త కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నట్లు హ్యూమన్ రిసోర్సెస్ గ్రూప్ హెడ్ కృష్ణమూర్తి శంకర్ వెల్లడించారు.

Infosys: గుడ్ న్యూస్.. విశాఖలో ఇన్ఫోసిస్ కార్యాలయం.. ఆ ప్రణాళికలో భాగంగా కంపెనీ నిర్ణయం..
Infosys
Ayyappa Mamidi
|

Updated on: Jun 15, 2022 | 5:30 PM

Share

Infosys: ఇన్ఫోసిస్ అందుబాటులో ఉన్న టాలెంట్ ఉద్యోగులకు దగ్గరగా ఉండే ప్రయత్నాన్ని ప్రారంభించింది. టైర్- II నగరాల్లో నాలుగు కొత్త కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నట్లు హ్యూమన్ రిసోర్సెస్ గ్రూప్ హెడ్ కృష్ణమూర్తి శంకర్ వెల్లడించారు. ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్ లోని విశాఖలో సైతం కంపెనీ తన కార్యకలాపాలను ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ టైర్ -II నగరాల నుంచి ఎక్కువ మంది యువత ఐటీ రంగంలో పనిచేస్తున్నందున కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. దీనికి తోడు కరోనా తరువాత 60 శాతం మంది ఉద్యోగులు స్వస్థలాలకు వెళ్లిపోవటం కూడా ఈ నిర్ణయం వెనుక మరో కారణంగా తెలుస్తోంది.

తమ ఉద్యోగులు చాలా మంది స్వగ్రామాల నుండి పని చేస్తున్నారని, వారు ఇళ్లకు దగ్గరగానే ఉండాలని అనుకుంటున్నట్లు కంపెనీ గుర్తించింది. వచ్చే క్వార్టర్ నాటికి ఈ కార్యాలయాలు సిద్ధమౌతాయని కృష్ణమూర్తి శంకర్ వెల్లడించారు. కంపెనీ ఇప్పటికే ఇండోర్, నాగ్‌పూర్‌లలో చిన్న కేంద్రాలను కలిగి ఉంది. కానీ.. ఇప్పుడు కొత్త ప్రణాళికలో భాగంగా కంపెనీ కోయంబత్తూర్, వైజాగ్, కోల్‌కతా, నోయిడాలో కార్యాలయాలను ఏర్పాటు చేస్తోంది. ఇవి మైక్రో హబ్ లుగా పనిచేయనున్నట్లు కంపెనీ వెల్లడించింది.

కంపెనీ వర్క్‌ఫోర్స్‌లో మహిళల సంఖ్య ఒక శాతం పెరిగింది. 3,15,000 మంది ఉద్యోగుల ఆధారంగా ఇది గత ఏడాది 38.6% కాగా ఇప్పుడు 39.6%గా ఉందని శంకర్ చెప్పారు. ఇంట్లో నుంచి పని చేస్తూ పిల్లలు, కుటుంబాన్ని పర్యవేక్షించాలని అనేక మంది భావించటం కూడా ఇందుకు మరో కారణమని తెలుస్తోంది. కంపెనీల్లో ఇప్పుడు మహిళల పాత్ర పెరిగిందని, అందువల్ల ఉద్యోగాలు వీడిన మహిళలను మళ్లీ తిరిగి ఉద్యోగాల్లోకి చేరేలా చేసేందుకు తాము కృషి చేస్తున్నట్లు శంకర్ తెలిపారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఫుడ్‌ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో షాకింగ్‌ విషయాలు...!
ఫుడ్‌ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో షాకింగ్‌ విషయాలు...!
జియోలో కేవలం రూ.1748 రీఛార్జ్‌తో 336 రోజుల వ్యాలిడిటీ..
జియోలో కేవలం రూ.1748 రీఛార్జ్‌తో 336 రోజుల వ్యాలిడిటీ..
ఘాటైన చూపుతో చంపేస్తున్న రాశి ఖన్నా.. బ్యూటిఫుల్ ఫొటోస్
ఘాటైన చూపుతో చంపేస్తున్న రాశి ఖన్నా.. బ్యూటిఫుల్ ఫొటోస్
కుప్పకూలిన "సునామీ స్వింగ్", ఒకరు మృతి, 13మందికి సీరియస్!
కుప్పకూలిన
శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఇక వాట్సాప్‌లో దర్శనం టిక్కెట్లు!
శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఇక వాట్సాప్‌లో దర్శనం టిక్కెట్లు!
మీ కాలేయంలోని కొవ్వును వెన్నలా కరిగించే పానియం ఇది.. తయారీ ఇలా..
మీ కాలేయంలోని కొవ్వును వెన్నలా కరిగించే పానియం ఇది.. తయారీ ఇలా..
ప్రేమలో ఉన్న ప్రతి కుర్రాడు పాడుకునే ఏకైక సాంగ్..
ప్రేమలో ఉన్న ప్రతి కుర్రాడు పాడుకునే ఏకైక సాంగ్..
చిరంజీవి రిజెక్ట్ చేసిన కథతో పవన్ కల్యాణ్ సినిమా.. కట్ చేస్తే..
చిరంజీవి రిజెక్ట్ చేసిన కథతో పవన్ కల్యాణ్ సినిమా.. కట్ చేస్తే..
కష్టాల్లో ఉన్న భారత్‌ను ఆదుకున్న సూర్య..అమెరికా టార్గెట్ 162
కష్టాల్లో ఉన్న భారత్‌ను ఆదుకున్న సూర్య..అమెరికా టార్గెట్ 162
ఇదేం పిచ్చిరా బాబా.. రీల్‌ రీక్రియేట్ చేస్తుండగా జారీన ఛైర్..
ఇదేం పిచ్చిరా బాబా.. రీల్‌ రీక్రియేట్ చేస్తుండగా జారీన ఛైర్..