Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Wheat Price: పండుగల సమయంలో పెద్ద షాక్.. పెరగనున్న గోధుమ ధరలు!

పండుగల సీజన్‌ కావడంతో మార్కెట్‌లో గోధుమలకు డిమాండ్‌ పెరిగిందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. కాగా, డిమాండ్ పెరగడం వల్ల గోధుమల సరఫరాపై ప్రభావం పడింది, దీని కారణంగా ధరలు 8 నెలల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ధరల పెరుగుదల ఇదే ధోరణి కొనసాగితే రానున్న రోజుల్లో రిటైల్ ద్రవ్యోల్బణం పెరగవచ్చు. ఎందుకంటే గోధుమలు అనేక రకాల ఆహార పదార్థాలను..

Wheat Price: పండుగల సమయంలో పెద్ద షాక్.. పెరగనున్న గోధుమ ధరలు!
Wheat Price
Follow us
Subhash Goud

|

Updated on: Oct 17, 2023 | 9:05 PM

కేంద్ర ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా ద్రవ్యోల్బణం తగ్గే సూచనలు కనిపించడం లేదు. ఒక వస్తువు చౌకగా మారే సమయానికి, మరొకటి ఖరీదైనదిగా మారుతుంది. టమోటాలు, పచ్చి కూరగాయల ధరలు తగ్గగా, ఇప్పుడు గోధుమలు మరోసారి ఖరీదైనవిగా మారాయి. పండుగల సీజన్‌కు ముందే గోధుమల ధర 8 నెలల గరిష్ట స్థాయికి చేరుకుందని చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆహార ద్రవ్యోల్బణం పెరుగుతుందన్న భయం మరోసారి పెరిగింది. అదే సమయంలో దిగుమతి సుంకం కారణంగా విదేశాల నుంచి ఆహార పదార్థాల దిగుమతిపై ప్రభావం పడుతుందని వ్యాపారులు చెబుతున్నారు. దీంతో దిగుమతి సుంకాన్ని తొలగించాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. అటువంటి పరిస్థితిలో ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి, కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రభుత్వ స్టాక్ నుండి గోధుమలు, బియ్యం వంటి ఆహార పదార్థాలను విడుదల చేయాలి.

పండుగల సీజన్‌ కావడంతో మార్కెట్‌లో గోధుమలకు డిమాండ్‌ పెరిగిందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. కాగా, డిమాండ్ పెరగడం వల్ల గోధుమల సరఫరాపై ప్రభావం పడింది, దీని కారణంగా ధరలు 8 నెలల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ధరల పెరుగుదల ఇదే ధోరణి కొనసాగితే రానున్న రోజుల్లో రిటైల్ ద్రవ్యోల్బణం పెరగవచ్చు. ఎందుకంటే గోధుమలు అనేక రకాల ఆహార పదార్థాలను తయారు చేసే ధాన్యం. గోధుమల ధర పెరిగితే రొట్టెలు, రోటీలు, బిస్కెట్లు, కేకులు వంటి అనేక ఆహార పదార్థాలు ఖరీదైనవి కావడం సహజం.

భారత ప్రభుత్వం గోధుమలపై 40 శాతం దిగుమతి సుంకం:

ఇవి కూడా చదవండి

దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం గోధుమల ధరలో 1.6% పెరుగుదల నమోదైంది. దీంతో ఫిబ్రవరి 10 నుంచి అత్యధికంగా హోల్‌సేల్ మార్కెట్‌లో మెట్రిక్ టన్ను గోధుమ ధర రూ.27,390కి చేరింది. గత ఆరు నెలల్లో గోధుమల ధరలు దాదాపు 22% పెరిగాయని చెబుతున్నారు. అదే సమయంలో గోధుమల దిగుమతిపై సుంకం ఎత్తివేయాలని రోలర్ ఫ్లోర్ మిల్లర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు ప్రమోద్ కుమార్ ఎస్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం గోధుమలపై దిగుమతి సుంకాన్ని తొలగిస్తే, దాని ధర తగ్గే అవకాశం ఉందని ఆయన అంటున్నారు. నిజానికి, భారత ప్రభుత్వం గోధుమలపై 40% దిగుమతి సుంకాన్ని విధించింది. దానిని తొలగించడానికి లేదా తగ్గించడానికి తక్షణ ప్రణాళిక కనిపించడం లేదు.

దీంతో ఆహార పదార్థాల ధరలు తగ్గుతాయి:

అదే సమయంలో అక్టోబర్ 1 నాటికి ప్రభుత్వ గోధుమ స్టాక్‌లో కేవలం 24 మిలియన్ మెట్రిక్ టన్నుల గోధుమలు మాత్రమే ఉన్నాయి. ఇది ఐదేళ్ల సగటు 37.6 మిలియన్ టన్నుల కంటే చాలా తక్కువ. అయితే, 2023 పంట సీజన్‌లో కేంద్రం రైతుల నుంచి 26.2 మిలియన్ టన్నుల గోధుమలను కొనుగోలు చేసింది. ఇది లక్ష్యం 34.15 మిలియన్ టన్నుల కంటే తక్కువగా ఉంది. అదే సమయంలో 2023-24 పంట సీజన్‌లో గోధుమ ఉత్పత్తి 112.74 మిలియన్ మెట్రిక్ టన్నులు ఉంటుందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది. దీంతో ఆహార పదార్థాల ధరలు తగ్గుతాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి